breaking news
Seetha Payanam Movie
-
హీరోయిన్గా అర్జున్ కూతురు.. ‘సీతా పయనం’ ఎప్పుడంటే..?
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు.ఇక ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్టారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు.ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పాజిటీవ్ బజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, ఫ్యామిలీస్ కు బాగా నచ్చే అనేక అంశాలు ఈ మూవీలో ఉండబోతున్నాయి, త్వరలో సీతా పయనం ట్రైలర్ ను మేకర్స్ విడుదల చెయనున్నారు. -
ఆహా ఓహో..అస్సలు సినిమా ముందుంది అంటున్న ఐశ్వర్య!
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా.. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. అతని మేనల్లుడు ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా నుంచి ‘అస్సలు సినిమా ముందుంది’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఆహా ఓహో అంటాడు.. అందం నీదే అంటాడు అనే పదాలతో మొదలైన ఈ సాంగ్ ఊపుతెప్పించే లిరిక్స్ తో ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీయ ఘోషల్ పాడారు. ఈ పాటలో ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ అవుతుండగా.. అనూప్ రూబెన్స్ బాణీలు అదుర్స్ అనేలా ఉన్నాయి. -
ఆ మూడు సినిమాలు తీసుంటే రిటైర్ అయ్యేవాడిని : సుకుమార్
‘‘ఈ వేదికపై ఇద్దరు (అర్జున్, ఉపేంద్ర) లెజెండ్స్ ఉన్నారు. ఈ ఇద్దరూ యాక్టర్స్ మాత్రమే కాదు.. దర్శకులు కూడా. ‘ఓం, ఏ, ఉపేంద్ర... ఇలాంటి కల్ట్ సినిమాలు తీసిన తర్వాత ఏ దర్శకుడైనా రిటైర్ అయిపోవచ్చు. నేను ఆ మూడు చిత్రాలు తీసి ఉంటే రిటైర్ అయిపోయేవాడిని. ఈ రోజు నా స్క్రీన్ప్లే ఇలా ఉందంటే కారణం ఆ మూడు సినిమాలే’’ అని అన్నారు దర్శకుడు సుకుమార్.హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్ ప్రధాన పాత్రలో, అర్జున్, ధ్రువ సర్జా, నిరంజన్, సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ టీజర్లో ఐశ్వర్య, నిరంజన్ బ్యూటిఫుల్గా కనిపించారు. అలాగే ఈ చిత్రంలో చంద్రబోస్ గారు రాసిన ఓ పాట విన్నాను. చాలా నచ్చింది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.‘‘నేను కాలేజీలో చదివిన రోజుల్లోనే అర్జున్ గారు నాకు డైలాగ్ రైటర్గా అవకాశం ఇచ్చారు. అప్పుడు నాకు అవకాశం కల్పించిన అర్జున్గారు, ఇప్పుడు నా అన్న కొడుకుకి అవకాశం ఇచ్చారు. ‘సీతాపయనం’ టీజర్ బ్యూటిఫుల్గా ఉంది’’ అన్నారు మరో ముఖ్య అతిథి ఉపేంద్ర. ‘‘నా హనుమాన్ జంక్షన్’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా చేసిన సుకుమార్ ఇప్పుడు ఇండియాలోని టాప్ టెన్ దర్శకుల్లో ఒకరని చెప్పడం గర్వంగా ఉంది. ఉపేంద్రగారికి పెద్ద పెద్ద దర్శకులే అభిమానులుగా ఉంటారు. మా అమ్మాయి కోసం ఈ సినిమాను మొదలుపెట్టాను. నాపై తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమను మా అమ్మాయిపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నాను. నిరంజన్లో మంచి అంకితభావం ఉంది’’ అన్నారు. ‘‘సీతా పయనం’తో తెలుగు పరిశ్రమకు వస్తున్నందుకు, నాన్నగారితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు ఐశ్వర్యా అర్జున్. ‘‘తెలుగులో నాకిది తొలి సినిమా’’ అన్నారు నిరంజన్.


