-
స్కేట్బోర్డ్పై మనాలి టు కన్యాకుమారి
‘మనాలి నుంచి కన్యాకుమారికి ఎలా వెళతాం?’ అనే ప్రశ్నకు ‘స్కేట్బోర్డ్ మీద’ అని ఎవరూ చెప్పరు. ‘మీరు చెప్పకపోతేనేం... నేనైతే స్కేట్బోర్డ్ మీదే వెళ్లాను’ అంటున్నాడు రితిక్. ప్రెషనల్ స్కేట్ బోర్డర్ అయిన రితిక్ క్రాడ్జెల్ మనాలి నుంచి కన్యాకుమారికి స్కేట్బోర్డ్ మీద వెళ్లాడు. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు నెట్లోకాన్ని అబ్బురపరుస్తున్నాయి. చిన్న బ్యాక్ప్యాక్తో బయలుదేరిన రితిక్ 100 రోజుల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు. రీల్స్, వీడియోలలో తనకు ఎదురైన అనుభవాలను నెటిజనులతో పంచుకున్నాడు. గూగుల్ మ్యాప్స్ పనిచేయకపోవడం నుంచి దట్టమైన ΄పొగమంచుతో హైవేల జీరో విజిబిలిటీ వరకు రితిక్కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకే వెళ్లాడు. రితిక్ సాహసం, ఓపికకు నెటిజనులు ప్రశంసల వర్షం కురిపించారు. -
కులు, మనాలీ, సిమ్లా.. ఒకేసారి చూసేందుకు ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ!
హిమాచల్ప్రదేశ్లోని కులు, సిమ్లా, మనాలి పర్యాటక ప్రాంతాలు ఏడాది పొడవునా టూరిస్టులతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా మార్చి ప్రారంభం నుండి కులు, సిమ్లా, మనాలిలకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇప్పుడు ఈ మూడు అద్భుత ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఐఆర్సీటీసీ ఒక ట్వీట్లో ఈ టూర్ ప్యాకేజీ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. ఐఆర్సీటీసీ అందించే ఈ టూర్ ప్యాకేజీ 2024, మార్చి 27 నుండి ప్రారంభంకానుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం తిరువనంతపురం నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎయిర్ టూర్ ప్యాకేజీ. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లతో కూడిన ఈ టూర్ ప్యాకేజీలో హిమాచల్లోని ఈ మూడు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణించాలనుకుంటే.. ఒకరైతే రూ.67,500, ఇద్దరికైతే రూ.53,470, ముగ్గురికి రూ.51,120 చెల్లించాల్సివుంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ రిజర్వేషన్కు రూ.46,420, బెడ్ లేకుండా అయితే రూ.43,800 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెండు నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లలకు, ఛార్జీగా రూ. 33,820లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. It's time for a vacation amidst the hills. Visit #shimla-#Kullu-#Manali with IRCTC (SEA23) on 27.03.2024 from #Thiruvananthapuram Book now on https://t.co/9ulobfRHWU . . .#dekhoapnadesh #Travel #Booking #Tours #traveller #vacations #ExploreIndia #HimachalPradesh @hp_tourism… pic.twitter.com/dgf3PbNLhp — IRCTC (@IRCTCofficial) February 21, 2024 -
విలాసవంతమైన నివాస భవనాల్లో టాప్ నగరాలు ఇవే..
ప్రపంచంలోనే విలాసవంతమైన నివాస భవనాల ధరలు పెరుగుతున్నాయి. అలా ధరలు పెరుగుతున్న జాబితాలో గ్లోబల్గా ముంబయి నాలుగోస్థానంలో ఉంది. అందుకు సంబంధించి నైట్ ఫ్రాంక్ ఇండియా ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ3 2023’ నివేదికలను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ముంబయి రియల్ ఎస్టేట్ మార్కెట్ నాలుగో స్థానంలో ఉంది. ఈ నివేదిక లగ్జరీ గృహాల సగటు వార్షిక ధరల వృద్ధిని సూచిస్తుంది. ఇదీ చదవండి: దీపావళికి ముందే అంబానీ క్రెడిట్ కార్డులు దేశంలోని ముంబయి(నాలుగోస్థానం), దిల్లీ పదో స్థానం, బెంగళూరు 17వ స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 46 నగరాల్లో సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. గతేడాది ముంబయి 22వ స్థానం ఉంది. ఏడాది కాలంలో ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో 6.5 శాతం పెరిగాయి. దాంతో 18 స్థానాలు ఎగబాకింది. దిల్లీ, బెంగళూరు సైతం వాటి ఇండెక్స్ను మెరుగుపరుచుకున్నాయి. గ్లోబల్ ఇండెక్స్లో తొలి మూడు స్థానాల్లో మనీలా(ఫిలిప్పీన్స్), దుబాయ్(యూఏఈ), షాంఘై(చైనా) నిలిచాయి. -
విజయ్ దేవరకొండ తల్లిని ఏడిపించేసిన రౌడీ ఫ్యాన్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్స్టేటస్ అందుకున్న విజయ్ గత ఐదేళ్ల నుంచి ‘దేవరశాంటా’(Deverasanta) పేరుతో ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఇంకాస్త డిఫరెంట్గా ప్లాన్ చేసిన విజయ్ తన అభిమానుల్లో 100మందిని మనాలికి హాలీడే ట్రిప్కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ ఓ స్పెషల్ వీడియోను షేర్చేసుకున్నాడు. తన స్నేహితులతో చిన్నప్పుడు ట్రిప్కి వెళ్లిన సంగతులని గుర్తుచేసుకుంటూ.. 'నాకు 21 ఏళ్లున్నప్పుడు అనుకుంటా. మొదటిసారి నా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి హంపి ట్రిప్కు వెళ్లాను. అప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో నా ట్రిప్కు సరిపడా డబ్బులన్నీ నా స్నేహితుడే భరించాడు. నా ఫస్ట్ హాలీడే వెకేషన్ అదే. నాలాగే అలాంటి సంతోసాన్ని మీ అందరికి కూడా పంచాలనుకున్నా' అంటూ విజయ్ అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ దేవర శాంటాలో భాగంగా మనాలి ట్రిప్కు వెళ్లిన అభిమానులు తమ అనుభవాలను షేర్ చేసుకుంటూ విజయ్కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఈ ట్రిప్కు చివర్లో తన తల్లిదండ్రులతో వెళ్లి విజయ్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ చేయడం విశేషం. -
మాట నిలబెట్టుకున్న విజయ్! వందమంది ఫ్యాన్స్ సర్ప్రైజ్ ట్రిప్ వీడియో వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంతో యూత్లో ఆయన విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాల కంటే కూడా తన ప్రవర్తనతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు విజయ్. హిట్..ప్లాఫ్తో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ పాలోయింగ్ పెరుగుతూనే ఉంది. అలాగే విజయ్ కూడా తరచూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంటాడు. చదవండి: నాపై అలాంటి కామెంట్స్ చేశారు.. దానికి కారణం ఇదే: ఎస్వీ కృష్ణారెడ్డి గత ఐదేళ్ల నుంచి ప్రతి క్రిస్మస్కు అభిమానులకు బహుమతులు అందిస్తున్నాడు ఈ టాలీవుడ్ సెన్సెషన్. దేవరశాంట పేరుతో ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్తో సర్ప్రైజ్ ఇస్తుంటాడు. ఈ సారి మాత్రం 100 మంది ఫ్యాన్స్ని మనాలి విహారయాత్రకు పంపించనున్నట్లు ప్రకటించాడు. ఐదు రోజుల పాటు సాగే ఈ విహారయాత్రకు సంబంధించిన ఖర్చులన్నీ ఆయనే భరించనున్నాడు. చదవండి: పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గని కాజల్ జోరు ఇప్పటికే ఈ 100 మంది పేర్లు ప్రకటించిన విజయ్ ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ యాత్ర కొనసాగనుందని వెల్లడించాడు. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 17న) వారి జర్నీ స్టార్ట్. ఈ సందర్భంగా ఫ్లైట్లో పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫ్యాన్స్ పంపిన వీడియోని విజయ్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ‘ఈ రోజు ఉదయం వాళ్లు ఫ్లైట్లో ఉన్న వీడియోను నాకు పంపించారు. పర్వతాల్లోకి హాలీడే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచీ 100 మంది ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది’ అంటూ విజయ్ రాసుకొచ్చాడు. Cutest ❤️ they sent me a video from their flight this morning. And they are off on their holiday to the mountains! 100 from across the country, makes me so happy 🥰#Deverasanta2022 pic.twitter.com/BF4DX5PIyG — Vijay Deverakonda (@TheDeverakonda) February 17, 2023 And here are the 100 of you, randomly selected this year :) Travel dates - February 17- 20. Will do a call group call and speak soon ❤️ pic.twitter.com/syOaRfvsXa — Vijay Deverakonda (@TheDeverakonda) February 2, 2023
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- వంద మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement