డెహ్రాడౌన్: బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనపడటం లేదు. ఇరు వర్గాలు మాటల తూటాలతో పరస్పరం దాడికి దిగుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై కంగన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సోనియాపై విమర్శలు ఎక్కుపెట్టారు. స్వస్థలానికి చేరుకున్న అనంతరం.. ‘‘ఈ ఏడాది ఢిల్లీ గుండె కోతకు గురైంది. అక్కడ రక్తం ప్రవహించింది. సోనియా సేన ముంబైలో ఆజాద్ కశ్మీర్ అని నినాదాలు చేస్తోంది, ఈ రోజు స్వేచ్చ ఉందని భావించగలిగే విషయం అంటే గొంతెత్తడం ఒకటే, నాకు మీ గొంతు ఇవ్వండి, లేదంటే స్వేచ్ఛ అంటే రక్తం చిందించడమే అవుతుంది’’అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. గతేడాది దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్యూలో చోటుచేసుకున్న ఘర్షణలను వ్యతిరేకిస్తూ ముంబైలో.. ‘ఫ్రీ కశ్మీర్’ ప్లకార్డులు ప్రదర్శించడాన్ని ఈ సందర్భంగా కంగన ప్రస్తావించారు. (చదవండి: కంగనా రనౌత్కు బీఎంసీ మరో షాక్)
బరువెక్కిన హృదయంతో మంబైని వీడుతున్నా
శివసేన ఎంపీ సంజయ్ రౌత్- కంగనల మధ్య సోషల్ మీడియాలో చోటుచేసుకున్న వాగ్వాదం నేపథ్యంలో భారీ భద్రత నడుమ ఆమె బుధవారం ముంబైలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికే పాలిలోని ఆమె కార్యాలయంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని కూల్చివేశారు. అంతేగాక కంగనకు సంబంధించిన మరో నివాసం కూడా అక్రమ కట్టడం అని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీతో భేటీ అయిన ఆమె.. సోమవారం స్వస్థలం హిమాచల్ ప్రదేశ్కు పయనమయ్యారు.
మనాలిలోని తన నివాసానికి చేరుకునే క్రమంలో.. ‘‘బరువెక్కిన హృదయంతో ముంబైని వీడుతున్నాను. నాపై వరుస దాడులు, వేధింపులు, నా ఇంటిని, ఆఫీసును కూల్చేందుకు జరిగిన ప్రయత్నాలు నన్ను భయాందోళనకు గురిచేసిన తీరు, నా చుట్టూ సాయుధులతో కల్పించిన భద్రత.. నేను పీఓకేతో పోల్చినట్లుగా అన్న మాటలు సరైనవేనని నిరూపించేలా ఉన్నాయి’’ అంటూ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. ఇక కంగన ముంబైని వీడి వెళ్లడంపై స్పందించిన శివసేన నేత ప్రతాప్ సర్నాయక్.. ‘‘తనను సమర్థించిన వాళ్ల ముఖాలను కంగన నల్లముఖాలు చేసింది. తను వెళ్లిపోయింది.. ఇప్పుడు అరవండి.. జై మహారాష్ట్ర’’అని పేర్కొన్నారు. (కంగన వెనుక ప్రధాని నరేంద్ర మోదీ!)
మనాలి చేరుకున్న కంగన.. ‘సోనియా సేన’పై ఫైర్!
Published Mon, Sep 14 2020 2:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement