breaking news
Khawaja Asif
-
పాక్, తాలిబన్ల మధ్య వార్ టెన్షన్.. ఏం జరగనుంది?
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో దాయాది పాకిస్తాన్కు ఆప్ఘన్ తాలిబన్ల ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంపై భవిష్యత్తులో జరిగే ఏ సైనిక దాడినైనా ధీటుగా ఎదుర్కొంటామని తాలిబాన్ హోం మంత్రి ఖలీఫా సిరాజుద్దీన్ హక్కానీ హెచ్చరించారు. పోరాడటంలో తమకు ఇబ్బంది లేదు అని చెప్పుకొచ్చారు.సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తుర్కియేలోని ఇస్తాంబుల్ వేదికగా మూడో విడత శాంతి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, తాలిబాన్ ప్రతినిధి బృందం పాల్గొన్నారు. కాగా, ఎటూ తేలకుండానే చర్చలు ముగిశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రతినిధి బృందం బాధ్యతారాహిత్య వైఖరే దీనికి కారణమని తాలిబన్ బృందంలోని నేత జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. పాక్ సైన్యం, ఇంటెలిజెన్స్లోని కొన్ని శక్తులు చర్చలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. పాకిస్తాన్ అంతర్గత సమస్యలు, అభద్రత, ‘తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్’ ఉగ్రదాడులకు తమ ప్రభుత్వాన్ని నిందించేందుకు అవి యత్నిస్తున్నాయని తెలిపారు.మరోవైపు పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్తో చర్చల వ్యవహారం ముగిసిందన్నారు. భవిష్యత్తు సమావేశాలకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేదని తెలిపారు. చర్చల అనంతరం ఉత్త చేతులతో తిరిగి రావడం.. మధ్యవర్తులకు కూడా తాలిబన్లపై ఆశ లేదని విషయాన్ని చాటుతోందని కామెంట్స్ చేశారు.అనంతరం, ఖవాజా వ్యాఖ్యలపై తాలిబాన్ హోం మంత్రి ఖలీఫా సిరాజుద్దీన్ హక్కానీ స్పందిస్తూ.. ‘ఒక దేశం తన ప్రయోజనాల కోసం మరో దేశ భూభాగాన్ని ఉల్లంఘించడం అనైతికం. మా సహనాన్ని పరీక్షిస్తే, మా ప్రతిస్పందన చాలా ఘాటుగా ఉంటుంది. ప్రపంచ సామ్రాజ్యవాదులను ఎదుర్కొన్న వాళ్ళం. యుద్ధ భూమిలో ఆప్ఘన్లు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. మళ్లీ పోరాడటంలో మాకు ఇబ్బంది లేదు. చర్చలు విఫలమవడంతో, సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం మళ్లీ నెలకొంది. పాకిస్తాన్తో యుద్ధం చేసేందుకు మేము సిద్ధమే అని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణలు, పరస్పర దాడులతో భారీ ప్రాణనష్టం జరిగే ప్రమాదముంది. సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. -
చర్చలు విఫలమైతే యుద్ధమే: పాక్ రక్షణ మంత్రి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి మాటల దాడికి దిగారు. ఆఫ్ఘనిస్థాన్తో శాంతి చర్చల నేపథ్యంలో ఖవాజా రెచ్చిపోయారు. తమ ఎదుట చాలా ఆప్షన్లు ఉన్నాయంటూ ఆప్ఘన్ తాలిబన్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చర్చలు విఫలమైతే తాలిబాన్లతో యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య నేడు తుర్కియోలో చివరి దశలో కీలకమైన శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జియో టీవీతో మాట్లాడుతూ..‘ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లతో చర్చలు విఫలమైతే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. మాకు చాలా ఎంపికలు ఉన్నాయి. మమ్మల్ని టార్గెట్ చేయాలని చూస్తే మేము కూడా అదే విధంగా స్పందిస్తాం. ప్రత్యక్షంగా మేము యుద్ధంలోకి దిగాల్సి వస్తుంది. ఇలా జరగదని నేను కోరుకుంటున్నా. తాలిబాన్ ప్రభుత్వం సరిహద్దు దాడులను ఆపడానికి దృఢమైన చర్యలు తీసుకునే వరకు ఆఫ్ఘనిస్థాన్తో సంబంధాలు సాధారణ స్థితికి తిరిగి రావు. నేను మొత్తం ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని నిందించడం లేదు’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ ఆండ్రాబీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సానుకూల ఫలితం కోసం ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాల్గొంటూనే ఉంటుంది అని ఆయన నొక్కిచెప్పారు. కానీ, ఆఫ్ఘనిస్థాన్ తన భూభాగం నుండి ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంపై చర్చలు ఆధారపడి ఉంటాయని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదటి రౌండ్ చర్చలు అక్టోబర్ 18-19 తేదీలలో దోహాలో జరిగాయి. తరువాత అక్టోబర్ 25 నుండి ఇస్తాంబుల్లో రెండవ రౌండ్ చర్చలు జరిపారు. తాజాగా మరోసారి చర్చలు జరిపేందుకు రెండు దేశాలు సిద్ధమయ్యాయి. అయితే, కాబూల్ తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కి వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలనే పాకిస్తాన్ డిమాండ్లపై ఆఫ్ఘనిస్థాన్ స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడంతో చర్చలు విఫలమవుతున్నాయి. -
తాలిబన్లను తుడిచిపెట్టేస్తాం
ఇస్లామాబాద్: ఆఫ్గనిస్తాన్ నుంచి తమ దేశంలో మళ్లీ ఉగ్రవాద దాడులు జరిగితే ఆ దేశంలో అధి కారంలో ఉన్న తాలిబన్లను తుడిచిపెట్టేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చ రించారు. సోదర దేశంగా శాంతి నెలకొల్పేందు కు ఆఫ్గనిస్తాన్కు ఒక అవకాశం ఇచ్చామని, కా నీ.. ఆ దేశంలోని కొందరు నేతలు చేస్తున్న ప్రక టనలు తాలిబన్ల సంకుచిత బుద్ధిని బయటపెడు తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు బుధ వారం ఆయన సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ‘పాకిస్తాన్కు ఉన్న ఆయుధాల్లో చిన్న భాగాన్ని వాడినా తాలిబన్ల పాలనను అంతం చేసి, వారిని తిరిగి గుహల్లోకి తరమగలం. వాళ్లు అదే గనుక కోరుకుంటే.. గతంలో మాదిరిగానే తోకలు ము డుచుకుని తోరాబోరా గుహల్లోకి మళ్లీ పరుగులు తీయటం అక్కడి ప్రజలు చూస్తారు. తాలిబన్లు పోరాటాన్నే కోరుకుంటే.. వారి సర్కస్ ఫీట్లను ప్రపంచం మొత్తం చూస్తుంది. మీ ద్రోహాన్ని, అపహాస్యాన్ని చాలాకాలంగా భరిస్తున్నాం. ఇక భరించేది లేదు. పాకిస్తాన్లో ఉగ్రదాడి జరిగినా, ఆత్మాహుతి దాడి జరిగినా.. ఆ దుస్సాహసానికి తగిన ప్రతిఫలాన్ని రుచి చూస్తారు. మా శక్తిసా మర్థ్యాలను పరీక్షించాలని చూస్తే.. అదే మీ అంతం అవుతుంది. ఆఫ్గనిస్తాన్ను సామ్రాజ్యాల స్మ శానం అంటుంటారు కదా! పాకిస్తాన్ సామ్రాజ్యం కాదు. కానీ, ఆఫ్గనిస్తాన్ మాత్రం కచ్చితంగా వారి సొంత ప్రజల స్మశానమే. నిజానికి మీ దేశం సామ్రాజ్యాల స్మశానం కాదు. మీ చరిత్ర మొత్తం సామ్రాజ్యాల ఆట స్థలం’అని ఎద్దేవా చేశారు.చర్చలు విఫలంపాకిస్తాన్– ఆఫ్గనిస్తాన్ మధ్య కొద్దిరోజులుగా టర్కీలోని ఇస్తాంబుల్లో జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. తమ దేశంలో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటాన్ని ఆపేయాలన్న పాకిస్తాన్ ప్రధాన డిమాండ్కు ఆఫ్గనిస్తాన్లోని తాలిబన్ పాలకులు అంగీకరించకపోవటంతో చర్చల్లో ప్రతిష్టంభణ ఏర్పడింది. టర్కీ మధ్యవర్తిత్వంతో గత శనివారం నుంచి జరుగుతున్న చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయని పాకిస్తాన్ సమాచా ర శాఖ మంత్రి అత్తొల్లా తరార్ బుధవారం ప్రకటించారు. ఉగ్రవాదులను నిర్మూలించటంలో ఆఫ్గనిస్తాన్ నుంచి దీర్ఘకాలిక సహకారాన్ని ఆశించామని, సీమాంతర ఉగ్రవాద నిర్మూలన కోసం ఆఫ్గనిస్తాన్లో తాలిబన్ల పాలన ప్రారంభమైనప్పటి నుంచి సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని చెప్పారు. దోహాలో తాలిబన్లు రాత పూర్వకంగా ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరినా అటువైపు నుంచి సానుకూల స్పందన రాలేదని ఆరోపించారు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, శాంతి స్థాపన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పుకొచ్చారు. చర్చల విఫలంపై తాలిబన్ల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు తమ ప్రజల భద్రత, శాంతి కోసం వీలైనన్ని మార్గాల్లో చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంటామని పాకిస్తాన్ సైనిక వర్గాలు తెలిపాయి. -
భారత్ కీలుబోమ్మగా ఆప్ఘనిస్తాన్.. 50 రెట్ల తీవ్రతతో ప్రతి దాడి: పాక్ మంత్రి
ఇస్లామాబాద్: తుర్కియే వేదికగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్.. ఆఫ్ఘనిస్థాన్పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ఘనిస్థాన్ నాయకత్వం భారత్ కీలు బొమ్మగా మారిపోయిందంటూ విమర్శలు చేశారు. అలాగే, ఇస్లామాబాద్పై దాడి జరిగితే దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతిదాడి జరుగుతుంది అంటూ తీవ్రంగా హెచ్చరించారు.పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జియో న్యూస్తో మాట్లాడుతూ..‘ఆఫ్ఘనిస్థాన్ నాయకత్వం ఢిల్లీకి ఒక సాధనంగా వ్యవహరిస్తోంది. భారత్ చేతిలో కీలు బొమ్మగా మారిపోయింది. భారత్ చెప్పిన విధంగా కాబూల్ ప్రజలు తీగలను లాగుతూ, తోలుబొమ్మ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. భారత్ పశ్చిమ సరిహద్దులో ఓటమికి పరిహారం చెల్లించడానికి ఆఫ్ఘనిస్థాన్ను ఉపయోగిస్తోంది. భారత్ కారణంగానే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య చర్చలు విఫలమయాయి. కాబూల్ పవర్ బ్రోకర్లు భారత్ ప్రభావంతో చర్చలను దెబ్బతీశారు. పాకిస్తాన్తో భారత్ తక్కువ తీవ్రత గల యుద్ధంలో పాల్గొనాలని అనుకుంటోంది. దీన్ని సాధించడానికి కాబూల్ను పాక్పై ఉపయోగిస్తున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదానికి కాబూల్ కారణం అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.చర్చలు విఫలమైతే యుద్ధమే!ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలమైతే ప్రత్యక్ష సంఘర్షణ తప్ప మాకు మరే ఆప్షన్ లేదని ఖవాజా అసిఫ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం.. మరో యుద్ధాన్ని భరించలేని ప్రపంచానికి ఆందోళనకరంగా మారింది. పాక్, ఆప్ఘన్ ప్రతినిధులు ఇప్పటికీ టర్కీలోనే ఉన్నప్పటికీ, నాలుగో దఫా చర్చలపై ఎటువంటి సమాచారం లేదు. దీంతో, జరుగుతుందా? అనే టెన్షన్ నెలకొంది. మరోవైపు.. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైనట్టు ఇరు దేశాల అధికార మీడియాలు మంగళవారం మధ్యాహ్నం ప్రకటించాయి. ఈ ప్రతిష్టంభనకు మీరంటే మీరే కారణమని ఇరు దేశాలూ ఆరోపణలు చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ బృందం నిర్మాణాత్మక చర్చలకు అన్ని ప్రయత్నాలు చేసిందని తెలిపింది. దీనిపై పాక్ స్పందిస్తూ ఆప్ఘన్లు.. మొండివైఖరి, ఉదాసీనత ధోరణి చూపారని ఆరోపించింది. తదుపరి చర్చలు ఆప్ఘన్ సానుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ నిజంగా ఈ చర్చలు విఫలమైతే భారత్కు ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు. ఎందుకంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, భారత్లో దాడులకు నిధులు సమకూర్చడం, శిక్షణ సహా ఇతర రకాలుగా పాక్ సైన్యం మద్దతు ఇస్తోందని న్యూఢిల్లీ నిరంతరం ఆరోపిస్తూ వస్తోంది.భారత్, ఆప్ఘన్ సంబంధాలుఅక్టోబరు మొదటి వారంలో మొదటిసారి తాలిబన్ మంత్రి భారత్ పర్యటనకు విచ్చేశారు. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆప్ఘన్, భారత్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్దరణకు మార్గం సుగమం అయ్యింది. విదేశాంగ మంతి అమిర్ ఖాన్ ముత్తఖీ నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటించి ఎస్ జైశంకర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల అనంతరం కాబూల్లోని టెక్నికల్ మిషన్ను పూర్తిస్థాయి ఎంబసీగా మార్చాలని నిర్ణయించారు. అలాగే, పహల్గామ్లో ఉగ్రదాడిని ముత్తఖీ తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు తమ భూభాగాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. -
అదే జరిగితే ఆఫ్ఘనిస్థాన్తో యుద్దమే.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు, ప్రతి దాడులతో రెండు దేశాల సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మరోవైపు.. ఇరు దేశాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల్లో ఒప్పందం కుదరకపోతే బహిరంగ యుద్దమే అని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.తాజాగా పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఆఫ్ఘనిస్థాన్ శాంతిని కోరుకుంటుందనే విశ్వాసం ఉంది. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే వాళ్లతో బహిరంగ యుద్ధం చేస్తాం. అందుకు మాకు ఓ అవకాశం ఉంది. కానీ, వాళ్లు శాంతిని కోరుకుంటారని విశ్వసిస్తున్నా. ఇరు పక్షాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నాయని అనుకుంటున్నా. గత నాలుగైదు రోజులుగా సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి’ అని అన్నారు. అయితే, ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ ఆసిఫ్ ఈ విధంగా స్పందించారు.Former Interior Minister Aftab Sherpao Criticizes Khawaja Asif’s Remarks on Possible War with AfghanistanPakistan’s former Interior Minister and head of the Qaumi Watan Party, Aftab Sherpao, has called Khawaja Asif’s recent statement—that Pakistan could wage an open war against… pic.twitter.com/3u94aQcvss— Truth Lens (@truthlenns) October 26, 2025ఆసిఫ్కు కౌంటర్.. మరోవైపు.. మహమ్మద్ ఆసిఫ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ మంత్రి, క్వామి వతన్ పార్టీ అధినేత అఫ్తాబ్ షెర్పావ్ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా అఫ్తాబ్ స్పందిస్తూ..‘ఆసిఫ్ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం. ప్రభుత్వ సీనియర్ మంత్రి నుండి ఇటువంటి వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీస్తాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల ప్రక్రియను దెబ్బతీస్తాయి. చర్చల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దశాబ్దాల సంఘర్షణలో అధికారులు శాంతి, ప్రాంతీయ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన భవిష్యత్తును నిర్ధారిస్తారు’ అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో దోహా వేదికగా రెండోసారి శాంతి చర్చలు జరుగుతున్నాయి. కాగా, అక్టోబర్ 18,19 తేదీల్లో జరిగిన మొదటి చర్చల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్లు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ క్రమంలోనే శనివారం ఇస్తాంబుల్లో ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి. ఆదివారం కూడా చర్చలు కొనసాగుతున్నాయి. -
పాక్, అఫ్గాన్ కాల్పుల విరమణ
ఇస్లామాబాద్: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య శాంతి దిశగా ముందడుగు పడింది. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇరుపక్షాలు ఆదివారం అంగీకారానికి వచ్చాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలం శాంతియుత పరిస్థితులు, స్థిరత్వం నెలకొనేలా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా దాడులు, కాల్పులు, ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల్లో పలువురు సైనికులు, సామాన్య ప్రజలు, ఉగ్రవాదులు మరణించారు. కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్, అఫ్గాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ మధ్య ఖతార్ రాజధాని దోహాలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల కోసం ఖతార్, తుర్కియే దేశాలు చొరవ తీసుకున్నాయి. కాల్పులు వెంటనే ఆపేయాలని పాక్, అఫ్గాన్ అంగీకారానికి వచి్చనట్లు ఖతార్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే రాబోయే రోజుల్లో తరచుగా సమావేశం కావాలని, శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని, భద్రత, స్థిరత్వానికి కట్టుబడి ఉండాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది. -
భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోంది.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత్ (India) తరఫున ఆప్ఘనిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తుందంటూ నిందలు మోపే ప్రయత్నం చేశారు. భారత్, ఆప్ఘన్తో రెండు వైపులా యుద్దానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందన్నారు.పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ‘పాకిస్తాన్ విషయంలో ఆప్ఘన్, భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ సరిహద్దులో డర్టీ గేమ్ ఆడుతోంది. ఇస్లామాబాద్ యుద్ధ పరిస్థితులపై ప్రతిస్పందించడానికి వ్యూహాలను రూపొందించింది. యుద్ధానికి సంబంధించి బలమైన అవకాశాలు ఉన్నాయి. యుద్ధ వ్యూహాల గురించి బహిరంగంగా చర్చించలేను. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.🚨🚨 Pakistan is prepared for 2 front war: Khawaja Asif Anchor: According to war analysts, India might play dirty games along the border. Are you anticipating that?Khawaja Asif: No, absolutely, you cannot rule that out. There are strong possibilities. pic.twitter.com/ixIU7ClFrJ— Naren Mukherjee (@NMukherjee6) October 17, 2025అంతకుముందు కూడా ఆసిఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆప్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇటీవల భారత్లో పర్యటించడంపై అక్కసు వెళ్లగక్కారు. ముత్తాఖీ ఆరు రోజుల పర్యటనలో పలు ప్రణాళికలు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ఉద్దేశాలను కలిగి ఉందన్నారు. ఇక, ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయొద్దంటూ హెచ్చరికలు చేశారు. తాలిబాన్ నిర్ణయాలను ఢిల్లీ స్పాన్సర్ చేస్తోంది. ఢిల్లీ కోసం కాబూల్ ప్రాక్సీ యుద్ధం చేస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ‘ఆప్ఘన్లో భారీ దాడులు జరిగాయి. స్నేహపూర్వక దేశాల జోక్యం తర్వాత కాల్పుల విరమణకు వారు అంగీకరించారు. కానీ, అది పేలవంగా ఉంది. ఇది ఎక్కువ కాలం ఉంటుందని అనుకోవడం లేదు’ అని అన్నారు.ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’ -
భారత్తో యుద్ధం తప్పదు!
ఇస్లామాబాద్: భారత్తో త్వరలో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఈసారి యుద్ధం జరిగితే పాకిస్తాన్ గతంకంటే మంచి ఫలితాలు సాధిస్తుందని తెలిపారు. మంగళవారం సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్తో యుద్ధం జరిగే అవకాశాలు నిజంగానే ఉన్నాయి. పరిస్థితిని ఉద్రిక్తం చేయటం నా ఉద్దేశం కాదు. కానీ ప్రమాదం ఉన్నమాట నిజం. నేను దానిని తోసిపుచ్చలేను. ఒకవేళ యుద్ధమే వస్తే.. దేవుడి దయవల్ల మనం గతంకంటే మంచి ఫలితాలు సాధిస్తాం. గత ఆరు నెలల క్రితంకంటే ఇప్పుడు పాకిస్తాన్కు ఎక్కువమంది మద్దతుదారులు, మిత్రులు ఉన్నారు. గత మే నెలలో చోటుచేసుకున్న ఘర్షణ సమయంతో పోల్చితే భారత్ ఇప్పుడు మద్దతుదారులను కోల్పోయింది’అని పేర్కొన్నారు. భారత్ ఒకేదేశం కాదు మధ్యయుగంలో మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాలనలో తప్ప భారత్ ఎప్పుడూ ఒకేదేశంగా లేదని ఖవాజా చెప్పుకొచ్చారు. కానీ, అల్లా దయతో ఏర్పడిన పాకిస్తాన్ ఒకే ఐక్య రాజ్యంగా ఉంటూ అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలి సైనిక ఘర్షణ సమయంలో ఐక్యంగా నిలబడిందని పేర్కొన్నారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలంటే ఉగ్రవాదానికి మద్దతిచ్చే చర్యలను మానుకోవాలని ఇటీవల భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించిన విషయం తెలిసిందే. భారత్ వాయుసేన అధిపతి కూడా గత శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా ఇచ్చిన ఎఫ్–16 సహా పాకిస్తాన్కు చెందిన 12 యుద్ధ విమానాలను కూల్చివేశామని తెలిపారు. అదేరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్ తన పౌరులను రక్షించుకునేందుకు ఏ దేశ సరిహద్దునైనా దాటి వెళ్లగలదని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఖవాజా యుద్ధం వస్తుందని ఊహించినట్టు అంచనా వేస్తున్నారు. ట్రంప్ అండతోనే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తాను బెదిరించటంవల్లే రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు పదేపదే ప్రకటించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను తన అధికారిక నివాసం వైట్హౌస్కు లంచ్కు కూడా పిలిచాడు. ఆ తర్వాత కూడా పాక్ ప్రధాని, సైన్యాధ్యక్షుడు ట్రంప్ను కలిశారు. దీంతో మళ్లీ భారత్తో యుద్ధం జరిగితే ట్రంప్ తమకు సాయం చేస్తారని ఖవాజా పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇటీవల సౌదీ అరేబియాతో పాక్ సైన్య సహకార ఒప్పందం చేసుకుంది. అందువల్లే యుద్ధం జరిగితే మంచి ఫలితాలు సాధిస్తామని ఖవాజా ప్రగల్భాలు పలికారని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్(Pakistan) రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్(Asim Khwaja) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్India vs Pakistan) మధ్య యుద్ధం అవకాశాలను ఏమాత్రం తిరస్కరించలేము అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోసారి భారత్తో యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది.పాక్ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ తాజాగా పాకిస్తాన్కు చెందిన సమా టీవీలో మాట్లాడుతూ.. పాకిస్తాన్, భారత్ మధ్య నేను ఉద్రిక్తతలను కోరుకోవడం లేదు. కానీ, రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులను తిరస్కరించడం లేదు. మళ్లీ భారత్తో యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. యుద్ధం విషయానికి పాకిస్తాన్ గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని సాధిస్తాం. భారత్ ఎప్పుడూ ఒకే ఐక్య దేశం కాదని చరిత్ర చూపిస్తుంది. ఔరంగజేబు పాలనలో మాత్రమే ఐక్యంగా ఉంది. ముందు నుంచి పాకిస్తాన్ వేరుగానే సృష్టించబడింది. స్వదేశంలో మేము వాదించుకుంటాం.. పోటీ పడతాం. కానీ, భారత్తో పోరాటం అంటే మాత్రం మేము అందరం కలిస్తే వస్తాం అంటూ బీరాలు పలికారు. దీంతో, వ్యాఖ్యలపై కొత్త చర్చ నడుస్తోంది. పాకిస్తాన్ ప్లాన్ ఏంటి? అని సోషల్ మీడియాతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Pakistan Defence Minister Khwaja Asif speaks of the possibility of another Indo-Pak war-“History shows that India was never truly united, except briefly under Aurangzeb. Pakistan was created in the name of Allah. At home, we argue and compete, but in a fight with India we come… pic.twitter.com/bTrDxqhQel— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) October 8, 2025ఇక, అంతకుముందు కూడా భారత్పై పాకిస్తాన్(Pakistan) రక్షణ శాఖ మంత్రి అసిమ్ ఖవాజా నోరుపారేసుకున్నారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధవిమానాల శిథిలాల కింద భారత్(India) సమాధి అవుతుందని కామెంట్స్ చేశారు. భారత సైనికాధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన దాడుల్లో భారత్కు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. దెబ్బతిన్న ప్రతిష్టను, విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ఆరాటపడుతున్నారని, విఫల యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్లో భారత్ 0–6 స్కోర్తో ఓడిపోయిందని అన్నారు. మరోసారి తమతో సైనిక ఘర్షణకు దిగితే భారత్ను సమాధి చేస్తామని హెచ్చరించారు. కాగా, భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi)హెచ్చరించిన తర్వాత ఖవాజా ఇలా వ్యాఖ్యలు చేశారు. -
భారత్ సమాధి అవుతుంది.. రెచ్చిపోయిన పాక్ మంత్రి
ఇస్లామాబాద్: భారత్పై పాకిస్తాన్(Pakistan) రక్షణ శాఖ మంత్రి అసిమ్ ఖవాజా(Asim Khwaja) నోరుపారేసుకున్నారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధవిమానాల శిథిలాల కింద భారత్(India) సమాధి అవుతుందని ఓవర్గా కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా, భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) రెండు రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులను పెంచి పోషించడం పాకిస్తాన్ ఇకనైనా మానుకోవాలని, భారత్ను రెచ్చగొట్టవద్దని ఆయన తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ 1.0లో చూపించిన సహనాన్ని ఆపరేషన్ సిందూర్ 2.0లో చూపించబోమని స్పష్టంచేశారు.దీనిపై అసిమ్ ఖవాజా ఆదివారం సోషల్ మీడియాలో స్పందించారు. భారత సైనికాధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన దాడుల్లో భారత్కు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. దెబ్బతిన్న ప్రతిష్టను, విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ఆరాటపడుతున్నారని, విఫల యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్లో భారత్ 0–6 స్కోర్తో ఓడిపోయిందని అన్నారు. అయితే, 0–6 స్కోర్కు అర్థం ఏమిటన్నది అసిమ్ ఖవాజా వెల్లడించారు. మరోసారి తమతో సైనిక ఘర్షణకు దిగితే భారత్ను సమాధి చేస్తామని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ఎట్టకేలకు దిగి వచ్చిన పాక్ సర్కార్.. పీవోకేతో సంబంధం -
ఆసియా కప్లో ‘6-0’ సంజ్ఞ వివాదం.. హారిస్ రవూస్పై పాక్ రక్షణ మంత్రి ప్రశంసలు
ఇస్లామాబాద్: ఆసియా కప్లో పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ ‘6-0’అని సంజ్ఞ చేయడం వివాదస్పదంగా మారింది. అయితే, హారిస్ రవూస్ అలా సంజ్ఞ చేయడాన్ని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్ధించాడు. భారత్తో అలా వ్యవహరించడం సరైందేనంటూ ట్వీట్ చేశాడు. ‘హారిస్ రవూఫ్ వారితో సరిగ్గా వ్యవహరిస్తున్నావు. దీన్ని ఇలాగే కొనసాగించండి. భారత్ 6-0ని మరచిపోదు. ప్రపంచం కూడా గుర్తుంచుకుంటుంది’ అంటూ ట్వీట్ చేశారు.గత ఆదివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ చెలరేగి బ్యాటింగ్తో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఒకానొక సమయంలో భారత్ బ్యాట్స్మెన్ దెబ్బకు పాక్ పేసర్ హారిస్ రవూఫ్ సహనం కోల్పోయి.. ‘6-0’ సంకేతంతో విమానాలు కూలుతున్నట్లు సంజ్ఞ చేశాడు. ఈ సంకేతానికి కారణంగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్. ఆపరేషన్ సిందూర్కు ప్రతిగా వారు భారత ఆరు ఫైటర్ జెట్లను కూల్చేశారట. కానీ, ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అంతర్జాతీయ వేదికలపై పాక్ పరువు పోగొట్టుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి.ఈ సంఘటనపై పాక్ కాలమిస్ట్ అయాబ్ అహ్మద్ చేసిన పోస్ట్ను ఖవాజా ఆసిఫ్ రీపోస్టు చేస్తూ కామెంట్స్ చేశారు. జెంటిల్మెన్ గేమ్ ఇలాంటి సంజ్ఞలు క్రీడా ఆచారాలకు విరుద్ధమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
భారత్ దాడి చేస్తే.. సౌదీ మాకు అండగా వస్తుంది
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాతో చేసుకున్న రక్షణ ఒప్పందం ఫలితంగా భారత్ తమపై దాడి చేసిన పక్షంలో ఆ దేశం రంగంలోకి దిగుతుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. ‘ఈ ఒప్పందం ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకున్నది కాదు. ఉమ్మడి రక్షణకు కుదిరిన అంగీకారం. దురాక్రమణ కోసం దీనిని వాడుకోబోం’అని ఆయన జియో టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మా అణు విధానం ప్రత్యేకంగా భారత్నుద్దేశించిందే అయినప్పటికీ సౌదీ అరేబియా అత్యవసరమైన పక్షంలో మా అణు పాటవం సహా సైనిక సామర్థ్యాలను అన్నింటినీ వాడుకునేందుకు ఈ సమగ్ర ఒప్పందంలో ఏర్పాట్లున్నాయి’అని ఆయన వివరించారు. రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దురాక్రమణ జరిగినా దానిని ఉమ్మడి దురాక్రమణగా పరిగణించేందుకు ఈ ఒప్పందంలో నిబంధనలున్నాయన్నారు. ఇలా ఉండగా, పాక్ ఆర్మీతో మరో దఫా తలపడాల్సి వస్తే భారత్ ఇప్పుడు సౌదీ అరేబియాను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మర్ చెబుతున్నారు. -
భారత్ టార్గెట్గా పాక్ చర్యలు.. ఆ దేశంతో సంచలన ఒప్పందం
ఇస్లామాబాద్: భారత్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవల కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందం నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారత్తో యుద్ధ పరిస్థితులు తలెత్తితే.. సౌదీ తప్పకుండా పాక్కు అండగా పోరాడుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవలే ఓ రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా రెండింటిపై దాడిగా భావించి ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో పాక్-సౌదీ మధ్య కుదిరిన ఒప్పందంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి స్పందిస్తూ..‘ఒకవేళ పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితులు ఎదురైతే.. మాకు సౌదీ అండగా పోరాడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక పరస్పర సహాయం ఉంటుంది. ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూడదన్న నిబంధన ఏమీ లేదు. మాకు ఉన్న అన్ని సామర్థ్యాలను వినియోగిస్తాం. పాకిస్తాన్ అణ్వాయుధ తనిఖీలకు ఎప్పుడూ సహకరిస్తుందని.. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడదని పేర్కొన్నారు. అయితే, ఇది కేవలం రక్షణాత్మక ఒప్పందం మాత్రమే అని పేర్కొన్నారు.Pakistan Defence Minister Khawaja Asif claims that Saudi Arabian troops will get involved if there is a military confrontation between India and Pakistan as part of new Pakistan-Saudi Military pact even though no countries have been named in the pact as aggressors. pic.twitter.com/AxPwHTNOef— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 19, 2025చాలా ఏళ్లుగా తాము సౌదీ సైనికులకు శిక్షణ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దానికి పొడిగింపుగా ఈ ఒప్పందాన్ని అభివర్ణించారు. ఇరు దేశాల్లో దేనిపై దాడి జరిగినా.. సమష్టిగా ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. అలాగే, అఫ్గానిస్థాన్ను తమ ప్రత్యర్థి దేశంగా అభివర్ణించారు. ఇదే సమయంలో అరబ్ దేశాలు కూడా ఈ డీల్ భాగం అవుతాయా అని ప్రశ్నించగా.. ముందస్తుగా దీనికి నేనేమీ సమాధానం చెప్పలేను అని క్లారిటీ ఇచ్చారు. ఈ ఒప్పందంలో మూడో దేశం చేరకుండా.. లేదా మరో దేశంతో ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోకూడదని ఎటువంటి క్లాజు లేదని చెప్పారు. పాకిస్తాన్కు బలహీనతలు ఉండటంతో.. నాటో వంటి ఏర్పాట్లు ఉండాలని తాను చాలా కాలంగా చెబుతున్నానన్నారు. ముఖ్యంగా ముస్లిం ప్రజలు, దేశాలు ఉన్నచోట సమష్టిగా దేశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.🇵🇰🇸🇦 Saudis are under defense by nuclear missiles now!Pakistani Defense Minister Khawaja Asif said Pakistan’s nuclear capabilities would be available under the new Pakistan-Saudi mutual defence pact“What we have, our capabilities, will absolutely be available under this pact” pic.twitter.com/V5MJrnKtDw— Unbiased, Unreported News (@Kiraguri254) September 20, 2025ఇక, కొన్ని నెలల క్రితం భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి బదులుగా మన బలగాలు పాక్లోని ఉగ్రమూకలను మట్టుపెట్టాయి. దాని తర్వాత రెండు దేశాల మధ్య కొన్నిరోజుల పాటు ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒప్పందం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా మరోసారి భారత్తో యుద్ధం విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. -
‘నీటిని బకెట్లలో నింపుకోండి’.. వరదల పరిష్కారానికి పాక్ మంత్రి వింత సలహా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి తన విచిత్రమైన వ్యాఖ్యలతో ట్రోల్ అవుతున్నారు. పాకిస్తాన్ను వరదలు ముంచెత్తిన వేళ.. ఆ వరదల్ని ప్రజలు వరంగా భావించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు వరద ప్రవాహనాన్ని అడ్డుకునేందుకు వరద నీటిని బకెట్లు,ట్యూబ్లలో నింపాలని విజ్ఞప్తి చేశారు.పాక్లో ఇటీవల రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఫలితంగా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పంజాబ్ ప్రావిన్స్ మొత్తం నీట మునిగింది. 24 లక్షల మంది పౌరులు వరద ముంపుకు గురయ్యారు. వేలాది గ్రాముల నీట మునిగాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం,ప్రాణ నష్టం సంభవించింది. ఈ క్రమంలో ఆదేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్థానిక మీడియా సంస్థ దున్యా న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ..వరద ముంపు గురైన ప్రజలే.. వరద నీటిని ఇంట్లోకి తోడుకోవాలి. ప్రజలు ఈ వరద నీటిని తమ ఇళ్లలో టబ్లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలి. వరద నీటిని దేవుడి ఆశీర్వాదంగా చూడాలి. అందుకే ఆ నీటిని నిల్వచేయాలని’ పిలుపునిచ్చారు. అంతేకాదు, పాకిస్తాన్ 10-15 సంవత్సరాలు మెగా ప్రాజెక్టుల కోసం వేచి ఉండకుండా త్వరగా పూర్తి చేయగల చిన్న,చిన్న డ్యామ్లను నిర్మించాలని ఆసిఫ్ సూచించారు.మనం నీటిని కాలువలోకి వదిలేస్తున్నాం.అలా వదిలేయకూడదు.ఆ నీటిని నిల్వ చేసుకోవాలన్నారు. పాకిస్తాన్లో భారీ వర్షాల కారణంగా, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో వరద పరిస్థితి నెలకొంది. 5 లక్షల మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రకారం జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు పాకిస్తాన్లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 854కి పెరిగింది. 1100 మందికి పైగా గాయపడ్డారు. NDMA ప్రకారం మరణాలలో మూడింట రెండు వంతుల మంది ఇళ్ళు కూలిపోవడం, ఆకస్మిక వరదల కారణంగా సంభవించగా వందలాది మంది మృతి చెందారు. పంజాబ్ చరిత్రలో ఇది అతిపెద్ద వరద అని పంజాబ్ మంత్రి ఔరంగజేబ్ అన్నారు. సట్లెజ్, చీనాబ్, రావి నదుల నీటి మట్టం ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి.Strongly condemn tone deaf comments by Defence Minister Khawaja Asif against the people of Sindh."Sindhis were blocking roads for the river. They should consider these floods as a blessing and keep the water in their homes." pic.twitter.com/UkKdBHCeis— Kumail Soomro (@kumailsoomro) September 1, 2025 -
IAF చీఫ్ వ్యాఖ్యలపై స్పందించిన పాక్
ఆపరేషన్ సిందూర్ సమయంలో యుద్ధ విమానాల కూల్చివేతపై భారత వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ స్పందించింది. భారత్ దాడిలో ఒక్క సైనిక విమానం కూడా ధ్వంసం కాలేదంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పుకొచ్చారు. భారత వైమానిక దళ చీఫ్ వాదనల్లో వాస్తవం లేదంటూ పాక్ మంత్రి కొట్టిపారేశారు.కాగా, పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్ను నిర్వహించామని.. పాక్కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను, ఓ భారీ ఎయిక్రాఫ్ట్ మన సైన్యం కూల్చేసిందని ఏపీ సింగ్ అన్నారు. మన సైన్యం దాడి చేసిన పాక్ ప్రధాన ఎయిర్ఫీల్డ్లలో షహబాజ్ జకోబాబాద్ స్థావరం ఒకటి. అక్కడ ఎఫ్-16 హ్యాంగర్ ఉంది. మన సైన్యం దాడితో అది సగానికి పైగా దెబ్బతింది. అక్కడ కొన్ని యుద్ధ విమానాలు ఉన్నాయని, అవి తీవ్రంగా దెబ్బతిన్నాయని మేం అంచనాకు వచ్చాం. ఆపరేషన్ సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ, ఎస్-400 క్షిపణి వ్యవస్థ సమర్థంగా పనిచేశాయి’’ అని అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. -
మదర్సా విద్యార్థులే రక్షణ కవచాలు!
అతివాద నెట్వర్క్లతో పాక్ సైన్యానిది విడదీయరాని బంధమని మరోసారి రుజువైంది. దాయాది యుద్ధోన్మాదం చివరికి మత శిక్షణ సంస్థలను కూడా వదలడం లేదు. భారత్తో పోరులో సైన్యం చేతులెత్తేసే పరిస్థితి నెలకొనడంతో పాక్ ముసుగులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతు న్నాయి. అవసరమైతే మదర్సా విద్యార్థులను కూడా యుద్ధ రంగంలోకి పంపుతామని బాహాటంగా ప్రకటించేసింది. మతిలేని, వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడైన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శనివారం సాక్షాత్తూ పాక్ పార్లమెంటులోనే ఈ మేరకు ప్రకటన చేశారు. వారిని ‘సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్’గా ఆయన అభివర్ణించారు. అవసరమైనప్పుడు మదర్సా విద్యార్థులను యుద్ధ విధుల్లో 100 శాతం వాడుకుని తీరతామని కుండబద్దలు కొట్టారు. భారత డ్రోన్లన్నింటినీ ఎక్కడికక్కడ అడ్డుకుని కూల్చేశామని ఒకవైపు పాక్ సైన్యం ప్రకటించగా, అ లాంటిదేమీ లేదంటూ ఆసిఫ్ కొట్టిపారేయ డం తెలిసిందే. ‘‘భారత డ్రోన్లను కూల్చ కపోవడానికి కారణముంది. మా సైనిక స్థావరాలకు సంబంధించిన సున్ని తమైన సమాచారం లీక్ కావద్దనే అలా చేశాం’’ అంటూ విచిత్రమైన వివరణ ఇచ్చి ఇంటాబయటా నవ్వులపాలయ్యా రు. భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో చెప్పుకుని, రుజువులడిగితే, ‘అలాగని భారత సోషల్ మీడియాలోనే వస్తోందిగా’ అని చెప్పి అభాసు పాలయ్యారు. రక్షణ మంత్రి అయ్యుండి సోషల్ మీడియా వార్తల ఆధారంగా ప్రకటనలు చేస్తారా అంటూ సీఎన్ఎన్ విలేకరి ఆండర్సన్ నిలదీయడంతో నీళ్లు నమిలారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
లాహోర్, కరాచీ, రావల్పిండితో సహా పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకట్టవేయలేకపోయిందన్నారు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. తమ దళాలు అడ్డగించి కూల్చివేసాయని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. భారత డ్రోన్లను పాక్ అడ్డుకోలేకపోయిందంటూ క్లారిటీ ఇచ్చారు. ‘మన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలమైంది. పాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది. మన రక్షణ విభాగం పూర్తిగా విఫలమైంది. ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. గోప్యత పాటించాల్సిన కారణంగా ఇంకా వివరణ ఇవ్వలేను’ అని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు. దీనిపై పాక్ ప్రతిపక్ష ఎంపీలు(పీటీఐ పార్టీకి చెందిన వారు) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం పాకిస్తాన్ అన్ని రకాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్ఏ దాడులతో ఊపిరి తీసుకోలేని పరిస్థితికి చేరుకుంది. తెహ్రిక్ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు.పాక్ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్ చేశారు. పాక్ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని షెహబాజ్పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్ పిరికిపంద అంటూ పాక్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.“We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025 “We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025 -
Khawaja Asif: పూర్తిస్థాయి యుద్ధం వద్దు
ఇస్లామాబాద్: భారత్తో పూర్తిస్థాయి యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ బుధవారం చెప్పారు. పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భారత్–పాక్ మధ్య మొదలైన ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయని, అది తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. పరిస్థితి మారిపోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఉద్రిక్తతలు నివారించుకుందామని భారత్కు విజ్ఞప్తి చేశారు. భారత్తో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. భారత్ వెనక్కి తగ్గితే తాము సైతం వెనక్కి తగ్గి ఉంటామని సూచించారు. యుద్ధం ఇంకా కొనసాగడం మనకు మేలు చేయదని చెప్పారు. భారత్ మొండిగా ముందుకెళ్తే యుద్ధం చేయడం తప్ప తమకు మరో మార్గ లేదని ఖవాజా అసిఫ్ స్పష్టంచేశారు. ఆయుధాలు వదిలేసి భారత్కు లొంగిపోలేం కదా? అని వ్యాఖ్యానించారు. -
భారత్లో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్లో పాక్ జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడమరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్ ఐఎస్ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్ స్కూల్ ఉద్యోగులమంటూ ఐఎస్ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
ఇస్లామాబాద్: పహల్గాం ఘటన(Pahalgam Incident)పై పాకిస్థాన్ స్వరం మార్చింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్(Khawaja Asif) చేసిన వ్యాఖ్యలను ది న్యూయార్క్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించింది.‘‘పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది. ఈ దాడిపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగినట్లు కనిపించడం లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం’’ అని అసిఫ్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.పహల్గాం దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని.. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం, నీటి ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణంగా భారత్ ఉపయోగించుకుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా, దర్యాప్తు జరపకుండానే పాక్ను శిక్షించాలని అడుగులు వేస్తోంది. అయితే పరిణామాలు యుద్ధానికి దారి తీయాలని మేం కోరుకోవడం లేదు. ఎందుకంటే.. యుద్ధమంటూ జరిగితే ఈ ప్రాంతమంతా నాశనం అవుతుంది కాబట్టి’’ అని అసిఫ్ వ్యాఖ్యానించారు.ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే సంస్థ లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల అనుబంధ విభాగమని, వీటికి పాక్ ప్రభుత్వ అండదండలు.. అక్కడి నిఘా వ్యవస్థల సహకారమూ ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: అవును.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం!అయితే ఈ వ్యవహారంపై ది న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో అసిఫ్ స్పందించారు. పాక్లో లష్కరే తోయిబా నిష్క్రియ(defunct) గా ఉందని అన్నారు. వాళ్లలో (ఉగ్రవాదులు) కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు గృహ నిర్బంధాలలో ఉన్నారు. పాక్లో వాళ్లకు ఇప్పుడు ఎలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి దాడులు జరిపే అవకాశమే లేదని ప్రకటించారాయన.ఇదిలా ఉంటే.. పహల్గాం దాడి వెనుక పాక్ ప్రమేయం ఉందని భారత్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే ఇస్లామాబాద్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. అంతకు ముందు.. పహల్గాం దాడి జరిగిన రోజు ఓ స్థానిక మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ దాడిలో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్ను నిందించడం అలవాటుగా మారిపోయిందని అన్నారాయన. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. పహల్గాం దాడిలో మమ్మల్ని(పాక్ను) నిందించొద్దు’’ అంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు. -
ఔను, ఉగ్రవాదాన్ని పోషించాం
ఇస్లామాబాద్: ఉగ్రవాదమే తన అసలు ముఖమని పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఉగ్రవాదానికి దశాబ్దాలుగా అడ్డాగా మారినట్టు అంగీకరించింది. ఈ మేరకు సాక్షాత్తూ ఆ దేశ రక్షణ మంత్రే స్పష్టంగా ప్రకటన చేశారు. కనీసం 30 ఏళ్లుగా ఉగ్ర తండాలను పాక్ పెంచి పోషిస్తూ వస్తోందని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు! దాంతో ఈ విషయమై భారత్ ఇంతకాలంగా చెబుతూ వస్తున్నది అక్షరసత్యమని నిరూపణ అయింది. స్కై న్యూస్ మీడియాకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఉగ్రవాద సంస్థలకు దన్నుగా నిలిచిన సుదీర్ఘ చరిత్ర పాక్కు ఉంది. దీనిపై మీరేమంటారు?’ అని జర్నలిస్టు యాల్డా హకీం ప్రశ్నించారు. దానికి మంత్రి స్పందిస్తూ, ‘‘అవును. అది నిజమే’’ అంటూ అంగీకరించారు. అయితే, ‘‘అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాల కోసమే మేం కనీసం 30 ఏళ్లుగా ఈ చెత్త పని చేస్తూ వస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. తద్వారా ఉగ్ర పాపాన్ని అగ్ర దేశాలకూ అంటించే ప్రయత్నం చేశారు. తాము శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులను అఫ్గాన్లో సోవియట్పై పోరుకు అమెరికా వాడుకుందని ఖవాజా ఆరోపించారు. ‘‘మేం చేసింది నిజంగా దిద్దుకోలేని పొరపాటే. అందుకు పాక్ భారీ మూల్యమే చెల్లించుకుంది. పూడ్చుకోలేనంతగా నష్టపోయింది. సోవియట్ యూనియన్పై పోరులో, 2001 సెప్టెంబర్ 11 అల్కాయిదా ఉగ్ర దాడి అనంతర చర్యల్లో అమెరికాతో చేతులు కలపకపోతే పాక్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉండేది. మా చరిత్రే వేరుగా ఉండేది’’ అంటూ వాపో యారు. సోవియట్తో ప్రచ్ఛన్నయుద్ధంలో, న్యూయార్క్ జంట టవర్లపై ఉగ్ర దాడి తర్వాత అఫ్గానిస్తాన్పై ఆక్రమణలో అమెరి కాకు పాక్ దన్నుగా నిలవడం తెలిసిందే.లష్కరే లేనేలేదట!పహల్గాం ఉగ్ర దాడిని భారతే చేయించుకుందంటూ ఖవాజా వాచాలత ప్రదర్శించారు. కశ్మీర్తో పాటు పాక్లో సంక్షోభం సృష్టించడమే దాని లక్ష్యమంటూ సంధి ప్రేలాపనకు దిగారు. లష్కరే తొయిబా ఉగ్ర సంస్థ అసలు ఉనికిలోనే లేదంటూ బుకాయించారు. పహల్గాం దాడి తమ పనేనని ప్రకటించిన లష్కరే ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరైనా ఎప్పుడూ విన్లేదంటూ అమాయకత్వం ప్రదర్శించారు. పాక్ కూడా దశాబ్దాలుగా ఉగ్రవాద బాధితురాలేనంటూ మొసలి కన్నీరు కార్చారు. 2019 బాలాకోట్ మాదిరిగా భారత్ సైనిక చర్యకు దిగుతుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా, అలా చేస్తే పూర్తిస్థాయి యుద్ధం తప్పదంటూ ఖవాజా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.దురాక్రమణను ఎదుర్కొంటాంపహల్గాం దాడితో పాక్ సంబంధముందన్న భారత్ ఆరోపణలు నిరాధారాలంటూ ఆ దేశ సెనేట్ శుక్రవారం తీర్మానం చేసింది. ‘‘మాపై దురాక్రమణకు దిగితే దీటుగా ఎదుర్కొంటాం. ఆ సామర్థ్యం మాకుంది’’ అని పేర్కొంది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడాన్ని ఖండించింది. -
పాకిస్తాన్లో సంచలనం.. ఇమ్రాన్కు ఊహించని షాక్!
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. పాక్ ప్రభుత్వంపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరసన గళం విప్పుతుండగా, ఇందుకు ప్రతిగా ప్రభుత్వం కూడా ఇమ్రాన్ను టార్గెట్ చేసింది. ఈ పరిస్థితులు నేపధ్యంలో పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ ఊహించని విధంగా దెబ్బకొట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇమ్రాన్ పొలిటికల్ పార్టీ తహరీక్-ఏ-ఇన్సాఫ్(పీటీఐ)పై బ్యాన్ విధించాలని ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఈ విషయాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. వివరాల ప్రకారం.. ఖవాజా ఆసీఫ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు దేశంలో విధ్వంసం సృష్టించడమే కాక, దేశ మిలటరీ స్థావరాలపై దాడులకు తెగబడిన నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామన్నారు. పీటీఐని నిషేధించాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే దీనిపై సమీక్ష జరుగుతున్నదన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం కోసం పంపామని, అనంతరం పీటీఐ నిషేధంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ తరచూ దేశ రక్షణశాఖపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని, దేశ సైన్య విభాగాన్ని శత్రువుగా భావిస్తున్నారని ఆరోపించారు. పాక్ సైన్యం కారణంగానే ఇమ్రాన్ రాజకీయాల్లో కాలుమోపారని, ఇప్పుడు దీనిని మరచిపోయి ఆయన సైన్యాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. కాగా, మే 9న పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనంతరం దేశవ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. పీటీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు సైనికాధికారుల ముఖ్యకార్యాలయంపై దాడులు చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఇక, పలు అవినీతి ఆరోపణలతో మే 9న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసిన అనంతరం దేశంలో రాజకీయ అస్థిరత తలెత్తింది. Defence Minister Khawaja Asif said that the Federal government considering to impose ban on Imran Khan’s Party Pakistan Tehreek-e-Insaf.https://t.co/4YhnjJIAPR#imranKhanPTI #Ptiban #pdmgovt #DefenceMinister #KhawajaAsif #burjnews pic.twitter.com/3jMyTmzs7h — Burj News (@Burjnews) May 24, 2023 ఇది కూడా చదవండి: మరో మహమ్మారి పొంచి ఉంది.. WHO వార్నింగ్ ఇదే.. -
పాక్ విదేశాంగ మంత్రిపై వేటు
-
పాక్ రాజకీయాల్లో మరో సంచలనం!
ఇస్లామాబాద్: అస్థిరతకు మారుపేరుగా ఉండే పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ప్రభుత్వంలోని కీలక పాత్ర పోషిస్తున్న విదేశాంగమంత్రి ఖవాజా ఆసిఫ్ను ఇస్లామాబాద్ హైకోర్టు అనర్హుడిగా తేల్చింది. ఖవాజాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వర్క్ పర్మిట్ ఉన్న కారణంగా పార్లమెంటు సభ్యుడిగా ఉండటానికి అనర్హుడని హైకోర్టు తేల్చింది. దీంతో ఆయన కేంద్రమంత్రి పదవి నుంచి, ఎంపీ పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాక్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అయిన ఖవాజా విదేశాంగ బాధ్యతలను చూస్తున్నారు. కోర్టు ఆయనను అనర్హుడిగా తేల్చడం పాక్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే అవినీతి ఆరోపణల వల్ల పాక్ ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) పార్టీ షాహిద్ ఖకాన్ అబ్బాసీని ప్రధానిగా నియమించింది. ఈ నేపథ్యంలో తాజా కోర్టు ఉత్తర్వులు పీఎంఎల్కు మరో షాక్ నిచ్చాయని పాక్ మీడియా పేర్కొంటున్నది. -
‘ట్రంప్ భారత్ భాషలో మాట్లాడుతున్నారు’
న్యూఢిల్లీ : పాకిస్తాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను పరిశీలిస్తే ఆయన భారత్ బాట (భారత్ గొంతుక వినిపిస్తున్నారని) పట్టినట్లు కనపడుతోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. దేశ భద్రతపై పార్లమెంటరీ కమిటీతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్ఘనిస్తాన్లో విఫలం చెందడానికి పాక్ కారణమని అమెరికా ఎలా అంటుదని ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన పాక్ను బలిపశువును చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. పాక్కు అమెరికా అందిస్తున్న 33 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంపై ట్రంప్ మాట్లాడుతూ.. బదులుగా అబద్ధాలు, మోసం తప్పితే ఏమీ రావడం లేదన్న విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడిన ఆసిఫ్.. అమెరికా నాయకుల వ్యాఖ్యలు సత్యదూరమని అన్నారు. -
ట్రంప్ షాక్తో.. పాక్ గిలగిల
ఇస్లామాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఊహించని షాక్తో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. సహాయ నిధులను నిలిపేయడంతో పాటు ఉగ్రవాదుల విషయంలో అబద్దాలు చెబుతున్నారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం ముందు ఇరకాటంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీతో విదేశాంగ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరు నేతలు ట్రంప్ ట్వీట్ మీద, ఇకముందు అనుసరించాల్సిన విదేశాంగ విధానం గురించి సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. ట్రంప్ ట్వీట్పై త్వరలో స్పందిస్తామని, ప్రపంచానికి నిజాలు తెలుసని ట్విటర్లో ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. వాస్తవాలకు కల్పితాలకు ఉన్న తేడాను ప్రపంచం గుర్తిస్తుందన్న నమ్మకాన్ని ఆసిఫ్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇదిలావుండగా.. అమెరికా కోరుకుంటున్న ‘డూ మోర్’ పాలసీని పాకిస్తాన్ ఇదివరకే తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు స్పష్టం చేసినట్లు కూడా చెప్పారు. ‘డూ మోర్’ అనే పదానికి ప్రాముఖ్యత లేదన్నారు. గత 15 ఏళ్లుగా అమెరికా అందించిన సాయంపై పూర్తి వివరాలను ఖర్చులతో సహా వివరించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ట్రంప్ ట్వీట్పై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ షెర్రీ రెహమాన్ తీవ్రంగా స్పందించారు. సంకీర్ణ భాగస్వామ్యంలో ఇచ్చిన నిధులకు జమాఖర్చులు అడగడం పాకిస్తాన్ను అవమానిండమేనని అన్నారు. పాకిస్తాన్ సహాయ సహకారాలు లేకుండా ఆఫ్ఘన్తో నాటో దళాలు యుద్ధం చేసేవా? అని ఆయన ప్రశ్నించారు. అమెరికన్ రాయబారికి సమన్లు ట్రంప్ ట్వీట్పై వివరణ ఇవ్వాలంటూ పాకిస్తాన్లోని అమెరికా రాయబారి డేవిడ్ హాలేకి ఆ దేశం సోమవారం రాత్రి సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ సమన్లు జారీ చేసిన విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం సైతం ధ్రువీకరించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి తెహమీనియా జుంజువా ఈ సమన్లు పంపినట్టు తెలిపింది. -
నిజమే.. దూరం పెరిగింది..!
ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్తాన్ వివాదంతో.. ఇస్లామాబాద్-వాషింగ్టన్ మధ్య దూరం పెరిగిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆసిఫ్ ఖాజా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రస్తుతంఇరు దేశాల మధ్య విశ్వసనీయత లేదు.. అయితే.. దూరాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం..అని ఆసిఫ్ ఖాజా మీడియాకు తెలిపారు. మంగళవారం అమెరికా రక్షణ మంత్రి రెక్స్ టిల్లర్సన్తో సమావేశం అనంతరం ఆసిఫ్ ఖాజా మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదుల అడ్డా కాదని తెలిపారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంలా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా ఉన్నతాధికారు ఒకరు పాక్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ట్రంప్ అభిప్రాయాన్ని.. రెక్స్ టిల్లర్సన్ పాకిస్తాన్ ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతేకాక పాకిస్తాన్లోని ఉగ్రవాదుల ఏరివేతకు ప్రభుత్వం మరింత తీవ్రంగా కృషి చేయాలని టిల్లర్సన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఆసిఫ్ కాజా వీటిపై వివరణ ఇస్తూ.. ఉగ్రవాదులు 40 ఆఫ్ఘన్ భూభాగాన్ని ఆక్రమించుకుని ఉన్నారని ఆయన అన్నారు. , -
అణుదాడి చేస్తాం
ఇస్లామాబాద్ : మేం తల్చుకుంటే భారత్లో ఒక్క నగరం మిగలదు.. ఢిల్లీ సహా పలు నగరాలను నేల మట్టం చేస్తాం.. మా అణు శక్తిని తట్టుకోలేరు అంటూ భారత్ను పాకిస్తాన్ హెచ్చరించింది. అలాగే ఐఎస్ఐతో ఉగ్రవాదులకు సంబంధాలున్నాయన్న అమెరికా ప్రకటనపైనా స్పందించింది. అమెరికాలోని గన్ లాబీయిస్టులకే ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని పాక్ వ్యాఖ్యానించింది. ‘భారత ప్రభుత్వం ఆదేశిస్తే.. ఏకకాలంలో చైనా, పాకిస్తాన్లతో యుద్ధం చేయగలమని.. అవసరం అయితే పాకిస్తాన్లోని అణ్వాయుధ స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని’ ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా ప్రకటనపై పాక్ ప్రతిస్పందించింది. మేం తల్చుకుంటే భారత్లోని ఏ నగరాన్ని అయినా నేలమట్టం చేయగలని పాకిస్తాన్ విదేశాంగ శాఖమంత్రి ఖ్వాజా ఆసిఫ్ శుక్రవారం ప్రకటించారు. అంతేకాక మా అణుశక్తిని తట్టుకుని భారత్ నిలబడలేదని హెచ్చరించారు. సరిహద్దునుంచి లక్ష్యం నిర్ణయించి మా అణ్వాయుధాలను వదిలితే.. క్షణాల్లో ఢిల్లీ సహా పలు నగరాలు నేలమట్టం అవుతాయని ఆయన అన్నారు. ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. శక్తివంతమైన అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో పాక్ ఒకటని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న వ్యాఖ్యలను ఆసిఫ్ ఖండించారు. అసలు అమెరికాలోని గన్ లాబీసంస్థలకే ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని చెప్పారు. ఇందుకు లాస్వేగాస్ ఘటనే నిదర్శనమని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఉగ్రవాదం పెరగడానికి గన్ లాబీనే కారణమని ఆసిఫ్ అన్నారు. -
ప్రధాని మోదీ ఓ ఉగ్రవాది
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ టెర్రరిస్టు అని, భారత ప్రజలు ఓ ఉగ్రవాదిని తమ దేశ ప్రధానిగా ఎన్నుకున్నారని పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓ ఉగ్రవాద సంస్థ అని, అది రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్)కు అనుబంధ సంస్థగా పనిచేస్తోందని స్థానిక వార్తా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. గుజరాత్ అల్లర్లలో మోదీ ముస్లింల రక్తం కళ్ల చూశారని విమర్శించారు. భారత్లో గోవధ పేరుతో ముస్లింలు, దళితులను హతమారుస్తున్నారని ఆరోపించారు. వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలను ఉగ్రవాదులతో పోల్చి వారి దిష్టిబొమ్మలను తగలబెట్టడం హేయమైన చర్య అని అన్నారు. ఆసిఫ్ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు ఖండించారు. పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రపంచానికి చెబుతున్నారనే కారణంతో మోదీపై తమ అక్కసు వెల్లగక్కుతున్నారన్నారు. -
ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఉగ్రవాదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని ఐక్యరాజ్య సమితి సదస్సులో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను ఆసిఫ్ ఈ విధంగా తిప్పికొట్టారు. సోమవారం ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ ఉగ్రవాదన్ని ఎగుమతి చేస్తుందని సుష్మా స్వరాజ్ ఆరోపించిందని, కానీ వారి దేశం భారత్ ఓ ఉగ్రవాది చేతిలోనే నడుస్తుందన్నారు. ఉగ్రవాదైన మోదీని ప్రధానిగా ఎన్నుకున్నారని, మోదీ గుజరాత్లో ముస్లింల రక్తం కళ్ల చూశాడని గుజరాత్ అల్లర్లను ఆసిఫ్ ప్రస్తావించారు. అంతేకాకుండా ఆర్ఎస్సెస్ ఒక ఉగ్రవాద సంస్థ అని మండిపడ్డారు. -
ఉరి కరెక్టే.. ఉక్కుపిడికిలితో ఢీకొంటాం: పాక్
న్యూఢిల్లీ: భారత్ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్కు మరణ శిక్ష విషయంలో వెనక్కి తగ్గబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఈ శిక్ష విధించడాన్ని పాక్ సమర్థించుకుంది. జాదవ్ గూఢచర్యం నెరిపినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఉరి శిక్ష విధించడానికి ముందు అన్ని నియమనిబంధనలు పాటించామని, తమ చట్టాలకు లోబడే ఈ శిక్ష విధించామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ చెప్పారు. చట్టానికి విరుద్ధంగా ఒక్కటి కూడా చేయలేదని చెప్పారు. తమ దేశ సార్వభౌమత్వానికి విరుద్ధంగా పనిచేసే శక్తుల విషయంలో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీని ద్వారా జాదవ్ విషయంలో పాక్ మొండి వైఖరి స్పష్టమవుతోంది. ‘జాదవ్కు విధించిన ఉరి శిక్ష పూర్వాలోచనతో చేసిన పని భారత్ అంటోంది. కానీ, మేం మాత్రం చట్టానికి లోబడే కేసును విచారించాం. నియమ నిబంధనలు పాటించాం. పాకిస్థాన్ ఈ విషయంలో ఎలాంటి ప్రత్యేక కన్సెషన్ ఇవ్వబోదు. మా దేశ సార్వభౌమాధికారన్ని దెబ్బకొట్టాలని, తమ దేశ సుస్థిరతకు భంగంకలిగించాలనే చూసే శక్తులను ఉక్కు పిడికిలితో ఎదుర్కొంటాం’ అని అసిఫ్ మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. -
ఇదే మా హెచ్చరిక.. కుట్ర చేస్తే సహించం: పాక్
గూఢచర్యం ఆరోపణలపై భారత జాతీయుడు కులభూషణ్ జాధవ్కు ఉరిశిక్ష విధించడాన్ని పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్థించుకున్నారు. తమ దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారికి ఈ ఉరిశిక్ష హెచ్చరిక లాంటిందని ఆయన పేర్కొన్నారు. దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారిని వదిలిపెట్టబోమని, వారికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైన శక్తులన్నింటినీ వాడుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. ‘పాకిస్థాన్ సైనికులు, ప్రజలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఉగ్రవాదులు, వారికి సాయం చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలని ఈ త్యాగాలు కోరుతున్నాయి’ అని అన్నారు. జాధవ్ బహిరంగంగా తన నేరాన్ని ఒప్పుకొన్నాడని, ఈ విషయాన్ని భారత్ లేవనెత్తితే.. పాకిస్థాన్ తగిన సమాధానం ఇస్తుందని ఆయన చెప్పారు. కల్లోలిత బెలూచిస్థాన్ ప్రావిన్స్లో గూఢచర్యానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్భూషణ్ జాధవ్ (46)కు సోమవారం పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జాధవ్ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామని ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ పేర్కొంది. అయితే పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాధవ్కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.


