breaking news
Khawaja Asif
-
ఆసియా కప్లో ‘6-0’ సంజ్ఞ వివాదం.. హారిస్ రవూస్పై పాక్ రక్షణ మంత్రి ప్రశంసలు
ఇస్లామాబాద్: ఆసియా కప్లో పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ ‘6-0’అని సంజ్ఞ చేయడం వివాదస్పదంగా మారింది. అయితే, హారిస్ రవూస్ అలా సంజ్ఞ చేయడాన్ని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్ధించాడు. భారత్తో అలా వ్యవహరించడం సరైందేనంటూ ట్వీట్ చేశాడు. ‘హారిస్ రవూఫ్ వారితో సరిగ్గా వ్యవహరిస్తున్నావు. దీన్ని ఇలాగే కొనసాగించండి. భారత్ 6-0ని మరచిపోదు. ప్రపంచం కూడా గుర్తుంచుకుంటుంది’ అంటూ ట్వీట్ చేశారు.గత ఆదివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ చెలరేగి బ్యాటింగ్తో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఒకానొక సమయంలో భారత్ బ్యాట్స్మెన్ దెబ్బకు పాక్ పేసర్ హారిస్ రవూఫ్ సహనం కోల్పోయి.. ‘6-0’ సంకేతంతో విమానాలు కూలుతున్నట్లు సంజ్ఞ చేశాడు. ఈ సంకేతానికి కారణంగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్. ఆపరేషన్ సిందూర్కు ప్రతిగా వారు భారత ఆరు ఫైటర్ జెట్లను కూల్చేశారట. కానీ, ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అంతర్జాతీయ వేదికలపై పాక్ పరువు పోగొట్టుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి.ఈ సంఘటనపై పాక్ కాలమిస్ట్ అయాబ్ అహ్మద్ చేసిన పోస్ట్ను ఖవాజా ఆసిఫ్ రీపోస్టు చేస్తూ కామెంట్స్ చేశారు. జెంటిల్మెన్ గేమ్ ఇలాంటి సంజ్ఞలు క్రీడా ఆచారాలకు విరుద్ధమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
భారత్ దాడి చేస్తే.. సౌదీ మాకు అండగా వస్తుంది
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాతో చేసుకున్న రక్షణ ఒప్పందం ఫలితంగా భారత్ తమపై దాడి చేసిన పక్షంలో ఆ దేశం రంగంలోకి దిగుతుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. ‘ఈ ఒప్పందం ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకున్నది కాదు. ఉమ్మడి రక్షణకు కుదిరిన అంగీకారం. దురాక్రమణ కోసం దీనిని వాడుకోబోం’అని ఆయన జియో టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మా అణు విధానం ప్రత్యేకంగా భారత్నుద్దేశించిందే అయినప్పటికీ సౌదీ అరేబియా అత్యవసరమైన పక్షంలో మా అణు పాటవం సహా సైనిక సామర్థ్యాలను అన్నింటినీ వాడుకునేందుకు ఈ సమగ్ర ఒప్పందంలో ఏర్పాట్లున్నాయి’అని ఆయన వివరించారు. రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దురాక్రమణ జరిగినా దానిని ఉమ్మడి దురాక్రమణగా పరిగణించేందుకు ఈ ఒప్పందంలో నిబంధనలున్నాయన్నారు. ఇలా ఉండగా, పాక్ ఆర్మీతో మరో దఫా తలపడాల్సి వస్తే భారత్ ఇప్పుడు సౌదీ అరేబియాను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మర్ చెబుతున్నారు. -
భారత్ టార్గెట్గా పాక్ చర్యలు.. ఆ దేశంతో సంచలన ఒప్పందం
ఇస్లామాబాద్: భారత్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవల కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందం నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారత్తో యుద్ధ పరిస్థితులు తలెత్తితే.. సౌదీ తప్పకుండా పాక్కు అండగా పోరాడుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవలే ఓ రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా రెండింటిపై దాడిగా భావించి ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో పాక్-సౌదీ మధ్య కుదిరిన ఒప్పందంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి స్పందిస్తూ..‘ఒకవేళ పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితులు ఎదురైతే.. మాకు సౌదీ అండగా పోరాడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక పరస్పర సహాయం ఉంటుంది. ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూడదన్న నిబంధన ఏమీ లేదు. మాకు ఉన్న అన్ని సామర్థ్యాలను వినియోగిస్తాం. పాకిస్తాన్ అణ్వాయుధ తనిఖీలకు ఎప్పుడూ సహకరిస్తుందని.. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడదని పేర్కొన్నారు. అయితే, ఇది కేవలం రక్షణాత్మక ఒప్పందం మాత్రమే అని పేర్కొన్నారు.Pakistan Defence Minister Khawaja Asif claims that Saudi Arabian troops will get involved if there is a military confrontation between India and Pakistan as part of new Pakistan-Saudi Military pact even though no countries have been named in the pact as aggressors. pic.twitter.com/AxPwHTNOef— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 19, 2025చాలా ఏళ్లుగా తాము సౌదీ సైనికులకు శిక్షణ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దానికి పొడిగింపుగా ఈ ఒప్పందాన్ని అభివర్ణించారు. ఇరు దేశాల్లో దేనిపై దాడి జరిగినా.. సమష్టిగా ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. అలాగే, అఫ్గానిస్థాన్ను తమ ప్రత్యర్థి దేశంగా అభివర్ణించారు. ఇదే సమయంలో అరబ్ దేశాలు కూడా ఈ డీల్ భాగం అవుతాయా అని ప్రశ్నించగా.. ముందస్తుగా దీనికి నేనేమీ సమాధానం చెప్పలేను అని క్లారిటీ ఇచ్చారు. ఈ ఒప్పందంలో మూడో దేశం చేరకుండా.. లేదా మరో దేశంతో ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోకూడదని ఎటువంటి క్లాజు లేదని చెప్పారు. పాకిస్తాన్కు బలహీనతలు ఉండటంతో.. నాటో వంటి ఏర్పాట్లు ఉండాలని తాను చాలా కాలంగా చెబుతున్నానన్నారు. ముఖ్యంగా ముస్లిం ప్రజలు, దేశాలు ఉన్నచోట సమష్టిగా దేశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.🇵🇰🇸🇦 Saudis are under defense by nuclear missiles now!Pakistani Defense Minister Khawaja Asif said Pakistan’s nuclear capabilities would be available under the new Pakistan-Saudi mutual defence pact“What we have, our capabilities, will absolutely be available under this pact” pic.twitter.com/V5MJrnKtDw— Unbiased, Unreported News (@Kiraguri254) September 20, 2025ఇక, కొన్ని నెలల క్రితం భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి బదులుగా మన బలగాలు పాక్లోని ఉగ్రమూకలను మట్టుపెట్టాయి. దాని తర్వాత రెండు దేశాల మధ్య కొన్నిరోజుల పాటు ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒప్పందం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా మరోసారి భారత్తో యుద్ధం విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. -
‘నీటిని బకెట్లలో నింపుకోండి’.. వరదల పరిష్కారానికి పాక్ మంత్రి వింత సలహా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి తన విచిత్రమైన వ్యాఖ్యలతో ట్రోల్ అవుతున్నారు. పాకిస్తాన్ను వరదలు ముంచెత్తిన వేళ.. ఆ వరదల్ని ప్రజలు వరంగా భావించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు వరద ప్రవాహనాన్ని అడ్డుకునేందుకు వరద నీటిని బకెట్లు,ట్యూబ్లలో నింపాలని విజ్ఞప్తి చేశారు.పాక్లో ఇటీవల రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఫలితంగా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పంజాబ్ ప్రావిన్స్ మొత్తం నీట మునిగింది. 24 లక్షల మంది పౌరులు వరద ముంపుకు గురయ్యారు. వేలాది గ్రాముల నీట మునిగాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం,ప్రాణ నష్టం సంభవించింది. ఈ క్రమంలో ఆదేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్థానిక మీడియా సంస్థ దున్యా న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ..వరద ముంపు గురైన ప్రజలే.. వరద నీటిని ఇంట్లోకి తోడుకోవాలి. ప్రజలు ఈ వరద నీటిని తమ ఇళ్లలో టబ్లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలి. వరద నీటిని దేవుడి ఆశీర్వాదంగా చూడాలి. అందుకే ఆ నీటిని నిల్వచేయాలని’ పిలుపునిచ్చారు. అంతేకాదు, పాకిస్తాన్ 10-15 సంవత్సరాలు మెగా ప్రాజెక్టుల కోసం వేచి ఉండకుండా త్వరగా పూర్తి చేయగల చిన్న,చిన్న డ్యామ్లను నిర్మించాలని ఆసిఫ్ సూచించారు.మనం నీటిని కాలువలోకి వదిలేస్తున్నాం.అలా వదిలేయకూడదు.ఆ నీటిని నిల్వ చేసుకోవాలన్నారు. పాకిస్తాన్లో భారీ వర్షాల కారణంగా, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో వరద పరిస్థితి నెలకొంది. 5 లక్షల మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రకారం జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు పాకిస్తాన్లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 854కి పెరిగింది. 1100 మందికి పైగా గాయపడ్డారు. NDMA ప్రకారం మరణాలలో మూడింట రెండు వంతుల మంది ఇళ్ళు కూలిపోవడం, ఆకస్మిక వరదల కారణంగా సంభవించగా వందలాది మంది మృతి చెందారు. పంజాబ్ చరిత్రలో ఇది అతిపెద్ద వరద అని పంజాబ్ మంత్రి ఔరంగజేబ్ అన్నారు. సట్లెజ్, చీనాబ్, రావి నదుల నీటి మట్టం ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి.Strongly condemn tone deaf comments by Defence Minister Khawaja Asif against the people of Sindh."Sindhis were blocking roads for the river. They should consider these floods as a blessing and keep the water in their homes." pic.twitter.com/UkKdBHCeis— Kumail Soomro (@kumailsoomro) September 1, 2025 -
IAF చీఫ్ వ్యాఖ్యలపై స్పందించిన పాక్
ఆపరేషన్ సిందూర్ సమయంలో యుద్ధ విమానాల కూల్చివేతపై భారత వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ స్పందించింది. భారత్ దాడిలో ఒక్క సైనిక విమానం కూడా ధ్వంసం కాలేదంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పుకొచ్చారు. భారత వైమానిక దళ చీఫ్ వాదనల్లో వాస్తవం లేదంటూ పాక్ మంత్రి కొట్టిపారేశారు.కాగా, పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్ను నిర్వహించామని.. పాక్కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను, ఓ భారీ ఎయిక్రాఫ్ట్ మన సైన్యం కూల్చేసిందని ఏపీ సింగ్ అన్నారు. మన సైన్యం దాడి చేసిన పాక్ ప్రధాన ఎయిర్ఫీల్డ్లలో షహబాజ్ జకోబాబాద్ స్థావరం ఒకటి. అక్కడ ఎఫ్-16 హ్యాంగర్ ఉంది. మన సైన్యం దాడితో అది సగానికి పైగా దెబ్బతింది. అక్కడ కొన్ని యుద్ధ విమానాలు ఉన్నాయని, అవి తీవ్రంగా దెబ్బతిన్నాయని మేం అంచనాకు వచ్చాం. ఆపరేషన్ సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ, ఎస్-400 క్షిపణి వ్యవస్థ సమర్థంగా పనిచేశాయి’’ అని అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. -
మదర్సా విద్యార్థులే రక్షణ కవచాలు!
అతివాద నెట్వర్క్లతో పాక్ సైన్యానిది విడదీయరాని బంధమని మరోసారి రుజువైంది. దాయాది యుద్ధోన్మాదం చివరికి మత శిక్షణ సంస్థలను కూడా వదలడం లేదు. భారత్తో పోరులో సైన్యం చేతులెత్తేసే పరిస్థితి నెలకొనడంతో పాక్ ముసుగులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతు న్నాయి. అవసరమైతే మదర్సా విద్యార్థులను కూడా యుద్ధ రంగంలోకి పంపుతామని బాహాటంగా ప్రకటించేసింది. మతిలేని, వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడైన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శనివారం సాక్షాత్తూ పాక్ పార్లమెంటులోనే ఈ మేరకు ప్రకటన చేశారు. వారిని ‘సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్’గా ఆయన అభివర్ణించారు. అవసరమైనప్పుడు మదర్సా విద్యార్థులను యుద్ధ విధుల్లో 100 శాతం వాడుకుని తీరతామని కుండబద్దలు కొట్టారు. భారత డ్రోన్లన్నింటినీ ఎక్కడికక్కడ అడ్డుకుని కూల్చేశామని ఒకవైపు పాక్ సైన్యం ప్రకటించగా, అ లాంటిదేమీ లేదంటూ ఆసిఫ్ కొట్టిపారేయ డం తెలిసిందే. ‘‘భారత డ్రోన్లను కూల్చ కపోవడానికి కారణముంది. మా సైనిక స్థావరాలకు సంబంధించిన సున్ని తమైన సమాచారం లీక్ కావద్దనే అలా చేశాం’’ అంటూ విచిత్రమైన వివరణ ఇచ్చి ఇంటాబయటా నవ్వులపాలయ్యా రు. భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో చెప్పుకుని, రుజువులడిగితే, ‘అలాగని భారత సోషల్ మీడియాలోనే వస్తోందిగా’ అని చెప్పి అభాసు పాలయ్యారు. రక్షణ మంత్రి అయ్యుండి సోషల్ మీడియా వార్తల ఆధారంగా ప్రకటనలు చేస్తారా అంటూ సీఎన్ఎన్ విలేకరి ఆండర్సన్ నిలదీయడంతో నీళ్లు నమిలారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
లాహోర్, కరాచీ, రావల్పిండితో సహా పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకట్టవేయలేకపోయిందన్నారు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. తమ దళాలు అడ్డగించి కూల్చివేసాయని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. భారత డ్రోన్లను పాక్ అడ్డుకోలేకపోయిందంటూ క్లారిటీ ఇచ్చారు. ‘మన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలమైంది. పాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది. మన రక్షణ విభాగం పూర్తిగా విఫలమైంది. ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. గోప్యత పాటించాల్సిన కారణంగా ఇంకా వివరణ ఇవ్వలేను’ అని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు. దీనిపై పాక్ ప్రతిపక్ష ఎంపీలు(పీటీఐ పార్టీకి చెందిన వారు) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం పాకిస్తాన్ అన్ని రకాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్ఏ దాడులతో ఊపిరి తీసుకోలేని పరిస్థితికి చేరుకుంది. తెహ్రిక్ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు.పాక్ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్ చేశారు. పాక్ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని షెహబాజ్పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్ పిరికిపంద అంటూ పాక్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.“We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025 “We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025 -
Khawaja Asif: పూర్తిస్థాయి యుద్ధం వద్దు
ఇస్లామాబాద్: భారత్తో పూర్తిస్థాయి యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ బుధవారం చెప్పారు. పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భారత్–పాక్ మధ్య మొదలైన ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయని, అది తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. పరిస్థితి మారిపోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఉద్రిక్తతలు నివారించుకుందామని భారత్కు విజ్ఞప్తి చేశారు. భారత్తో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. భారత్ వెనక్కి తగ్గితే తాము సైతం వెనక్కి తగ్గి ఉంటామని సూచించారు. యుద్ధం ఇంకా కొనసాగడం మనకు మేలు చేయదని చెప్పారు. భారత్ మొండిగా ముందుకెళ్తే యుద్ధం చేయడం తప్ప తమకు మరో మార్గ లేదని ఖవాజా అసిఫ్ స్పష్టంచేశారు. ఆయుధాలు వదిలేసి భారత్కు లొంగిపోలేం కదా? అని వ్యాఖ్యానించారు. -
భారత్లో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్లో పాక్ జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడమరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్ ఐఎస్ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్ స్కూల్ ఉద్యోగులమంటూ ఐఎస్ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
ఇస్లామాబాద్: పహల్గాం ఘటన(Pahalgam Incident)పై పాకిస్థాన్ స్వరం మార్చింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్(Khawaja Asif) చేసిన వ్యాఖ్యలను ది న్యూయార్క్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించింది.‘‘పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది. ఈ దాడిపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగినట్లు కనిపించడం లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం’’ అని అసిఫ్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.పహల్గాం దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని.. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం, నీటి ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణంగా భారత్ ఉపయోగించుకుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా, దర్యాప్తు జరపకుండానే పాక్ను శిక్షించాలని అడుగులు వేస్తోంది. అయితే పరిణామాలు యుద్ధానికి దారి తీయాలని మేం కోరుకోవడం లేదు. ఎందుకంటే.. యుద్ధమంటూ జరిగితే ఈ ప్రాంతమంతా నాశనం అవుతుంది కాబట్టి’’ అని అసిఫ్ వ్యాఖ్యానించారు.ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే సంస్థ లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల అనుబంధ విభాగమని, వీటికి పాక్ ప్రభుత్వ అండదండలు.. అక్కడి నిఘా వ్యవస్థల సహకారమూ ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: అవును.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం!అయితే ఈ వ్యవహారంపై ది న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో అసిఫ్ స్పందించారు. పాక్లో లష్కరే తోయిబా నిష్క్రియ(defunct) గా ఉందని అన్నారు. వాళ్లలో (ఉగ్రవాదులు) కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు గృహ నిర్బంధాలలో ఉన్నారు. పాక్లో వాళ్లకు ఇప్పుడు ఎలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి దాడులు జరిపే అవకాశమే లేదని ప్రకటించారాయన.ఇదిలా ఉంటే.. పహల్గాం దాడి వెనుక పాక్ ప్రమేయం ఉందని భారత్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే ఇస్లామాబాద్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. అంతకు ముందు.. పహల్గాం దాడి జరిగిన రోజు ఓ స్థానిక మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ దాడిలో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్ను నిందించడం అలవాటుగా మారిపోయిందని అన్నారాయన. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. పహల్గాం దాడిలో మమ్మల్ని(పాక్ను) నిందించొద్దు’’ అంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు. -
ఔను, ఉగ్రవాదాన్ని పోషించాం
ఇస్లామాబాద్: ఉగ్రవాదమే తన అసలు ముఖమని పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఉగ్రవాదానికి దశాబ్దాలుగా అడ్డాగా మారినట్టు అంగీకరించింది. ఈ మేరకు సాక్షాత్తూ ఆ దేశ రక్షణ మంత్రే స్పష్టంగా ప్రకటన చేశారు. కనీసం 30 ఏళ్లుగా ఉగ్ర తండాలను పాక్ పెంచి పోషిస్తూ వస్తోందని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు! దాంతో ఈ విషయమై భారత్ ఇంతకాలంగా చెబుతూ వస్తున్నది అక్షరసత్యమని నిరూపణ అయింది. స్కై న్యూస్ మీడియాకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఉగ్రవాద సంస్థలకు దన్నుగా నిలిచిన సుదీర్ఘ చరిత్ర పాక్కు ఉంది. దీనిపై మీరేమంటారు?’ అని జర్నలిస్టు యాల్డా హకీం ప్రశ్నించారు. దానికి మంత్రి స్పందిస్తూ, ‘‘అవును. అది నిజమే’’ అంటూ అంగీకరించారు. అయితే, ‘‘అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాల కోసమే మేం కనీసం 30 ఏళ్లుగా ఈ చెత్త పని చేస్తూ వస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. తద్వారా ఉగ్ర పాపాన్ని అగ్ర దేశాలకూ అంటించే ప్రయత్నం చేశారు. తాము శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులను అఫ్గాన్లో సోవియట్పై పోరుకు అమెరికా వాడుకుందని ఖవాజా ఆరోపించారు. ‘‘మేం చేసింది నిజంగా దిద్దుకోలేని పొరపాటే. అందుకు పాక్ భారీ మూల్యమే చెల్లించుకుంది. పూడ్చుకోలేనంతగా నష్టపోయింది. సోవియట్ యూనియన్పై పోరులో, 2001 సెప్టెంబర్ 11 అల్కాయిదా ఉగ్ర దాడి అనంతర చర్యల్లో అమెరికాతో చేతులు కలపకపోతే పాక్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉండేది. మా చరిత్రే వేరుగా ఉండేది’’ అంటూ వాపో యారు. సోవియట్తో ప్రచ్ఛన్నయుద్ధంలో, న్యూయార్క్ జంట టవర్లపై ఉగ్ర దాడి తర్వాత అఫ్గానిస్తాన్పై ఆక్రమణలో అమెరి కాకు పాక్ దన్నుగా నిలవడం తెలిసిందే.లష్కరే లేనేలేదట!పహల్గాం ఉగ్ర దాడిని భారతే చేయించుకుందంటూ ఖవాజా వాచాలత ప్రదర్శించారు. కశ్మీర్తో పాటు పాక్లో సంక్షోభం సృష్టించడమే దాని లక్ష్యమంటూ సంధి ప్రేలాపనకు దిగారు. లష్కరే తొయిబా ఉగ్ర సంస్థ అసలు ఉనికిలోనే లేదంటూ బుకాయించారు. పహల్గాం దాడి తమ పనేనని ప్రకటించిన లష్కరే ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరైనా ఎప్పుడూ విన్లేదంటూ అమాయకత్వం ప్రదర్శించారు. పాక్ కూడా దశాబ్దాలుగా ఉగ్రవాద బాధితురాలేనంటూ మొసలి కన్నీరు కార్చారు. 2019 బాలాకోట్ మాదిరిగా భారత్ సైనిక చర్యకు దిగుతుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా, అలా చేస్తే పూర్తిస్థాయి యుద్ధం తప్పదంటూ ఖవాజా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.దురాక్రమణను ఎదుర్కొంటాంపహల్గాం దాడితో పాక్ సంబంధముందన్న భారత్ ఆరోపణలు నిరాధారాలంటూ ఆ దేశ సెనేట్ శుక్రవారం తీర్మానం చేసింది. ‘‘మాపై దురాక్రమణకు దిగితే దీటుగా ఎదుర్కొంటాం. ఆ సామర్థ్యం మాకుంది’’ అని పేర్కొంది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడాన్ని ఖండించింది. -
పాకిస్తాన్లో సంచలనం.. ఇమ్రాన్కు ఊహించని షాక్!
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. పాక్ ప్రభుత్వంపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరసన గళం విప్పుతుండగా, ఇందుకు ప్రతిగా ప్రభుత్వం కూడా ఇమ్రాన్ను టార్గెట్ చేసింది. ఈ పరిస్థితులు నేపధ్యంలో పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ ఊహించని విధంగా దెబ్బకొట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇమ్రాన్ పొలిటికల్ పార్టీ తహరీక్-ఏ-ఇన్సాఫ్(పీటీఐ)పై బ్యాన్ విధించాలని ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఈ విషయాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. వివరాల ప్రకారం.. ఖవాజా ఆసీఫ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు దేశంలో విధ్వంసం సృష్టించడమే కాక, దేశ మిలటరీ స్థావరాలపై దాడులకు తెగబడిన నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామన్నారు. పీటీఐని నిషేధించాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే దీనిపై సమీక్ష జరుగుతున్నదన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం కోసం పంపామని, అనంతరం పీటీఐ నిషేధంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ తరచూ దేశ రక్షణశాఖపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని, దేశ సైన్య విభాగాన్ని శత్రువుగా భావిస్తున్నారని ఆరోపించారు. పాక్ సైన్యం కారణంగానే ఇమ్రాన్ రాజకీయాల్లో కాలుమోపారని, ఇప్పుడు దీనిని మరచిపోయి ఆయన సైన్యాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. కాగా, మే 9న పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనంతరం దేశవ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. పీటీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు సైనికాధికారుల ముఖ్యకార్యాలయంపై దాడులు చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఇక, పలు అవినీతి ఆరోపణలతో మే 9న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసిన అనంతరం దేశంలో రాజకీయ అస్థిరత తలెత్తింది. Defence Minister Khawaja Asif said that the Federal government considering to impose ban on Imran Khan’s Party Pakistan Tehreek-e-Insaf.https://t.co/4YhnjJIAPR#imranKhanPTI #Ptiban #pdmgovt #DefenceMinister #KhawajaAsif #burjnews pic.twitter.com/3jMyTmzs7h — Burj News (@Burjnews) May 24, 2023 ఇది కూడా చదవండి: మరో మహమ్మారి పొంచి ఉంది.. WHO వార్నింగ్ ఇదే.. -
పాక్ విదేశాంగ మంత్రిపై వేటు
-
పాక్ రాజకీయాల్లో మరో సంచలనం!
ఇస్లామాబాద్: అస్థిరతకు మారుపేరుగా ఉండే పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ప్రభుత్వంలోని కీలక పాత్ర పోషిస్తున్న విదేశాంగమంత్రి ఖవాజా ఆసిఫ్ను ఇస్లామాబాద్ హైకోర్టు అనర్హుడిగా తేల్చింది. ఖవాజాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వర్క్ పర్మిట్ ఉన్న కారణంగా పార్లమెంటు సభ్యుడిగా ఉండటానికి అనర్హుడని హైకోర్టు తేల్చింది. దీంతో ఆయన కేంద్రమంత్రి పదవి నుంచి, ఎంపీ పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాక్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అయిన ఖవాజా విదేశాంగ బాధ్యతలను చూస్తున్నారు. కోర్టు ఆయనను అనర్హుడిగా తేల్చడం పాక్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే అవినీతి ఆరోపణల వల్ల పాక్ ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) పార్టీ షాహిద్ ఖకాన్ అబ్బాసీని ప్రధానిగా నియమించింది. ఈ నేపథ్యంలో తాజా కోర్టు ఉత్తర్వులు పీఎంఎల్కు మరో షాక్ నిచ్చాయని పాక్ మీడియా పేర్కొంటున్నది. -
‘ట్రంప్ భారత్ భాషలో మాట్లాడుతున్నారు’
న్యూఢిల్లీ : పాకిస్తాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను పరిశీలిస్తే ఆయన భారత్ బాట (భారత్ గొంతుక వినిపిస్తున్నారని) పట్టినట్లు కనపడుతోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. దేశ భద్రతపై పార్లమెంటరీ కమిటీతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్ఘనిస్తాన్లో విఫలం చెందడానికి పాక్ కారణమని అమెరికా ఎలా అంటుదని ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన పాక్ను బలిపశువును చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. పాక్కు అమెరికా అందిస్తున్న 33 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంపై ట్రంప్ మాట్లాడుతూ.. బదులుగా అబద్ధాలు, మోసం తప్పితే ఏమీ రావడం లేదన్న విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడిన ఆసిఫ్.. అమెరికా నాయకుల వ్యాఖ్యలు సత్యదూరమని అన్నారు. -
ట్రంప్ షాక్తో.. పాక్ గిలగిల
ఇస్లామాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఊహించని షాక్తో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. సహాయ నిధులను నిలిపేయడంతో పాటు ఉగ్రవాదుల విషయంలో అబద్దాలు చెబుతున్నారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం ముందు ఇరకాటంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీతో విదేశాంగ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరు నేతలు ట్రంప్ ట్వీట్ మీద, ఇకముందు అనుసరించాల్సిన విదేశాంగ విధానం గురించి సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. ట్రంప్ ట్వీట్పై త్వరలో స్పందిస్తామని, ప్రపంచానికి నిజాలు తెలుసని ట్విటర్లో ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. వాస్తవాలకు కల్పితాలకు ఉన్న తేడాను ప్రపంచం గుర్తిస్తుందన్న నమ్మకాన్ని ఆసిఫ్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇదిలావుండగా.. అమెరికా కోరుకుంటున్న ‘డూ మోర్’ పాలసీని పాకిస్తాన్ ఇదివరకే తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు స్పష్టం చేసినట్లు కూడా చెప్పారు. ‘డూ మోర్’ అనే పదానికి ప్రాముఖ్యత లేదన్నారు. గత 15 ఏళ్లుగా అమెరికా అందించిన సాయంపై పూర్తి వివరాలను ఖర్చులతో సహా వివరించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ట్రంప్ ట్వీట్పై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ షెర్రీ రెహమాన్ తీవ్రంగా స్పందించారు. సంకీర్ణ భాగస్వామ్యంలో ఇచ్చిన నిధులకు జమాఖర్చులు అడగడం పాకిస్తాన్ను అవమానిండమేనని అన్నారు. పాకిస్తాన్ సహాయ సహకారాలు లేకుండా ఆఫ్ఘన్తో నాటో దళాలు యుద్ధం చేసేవా? అని ఆయన ప్రశ్నించారు. అమెరికన్ రాయబారికి సమన్లు ట్రంప్ ట్వీట్పై వివరణ ఇవ్వాలంటూ పాకిస్తాన్లోని అమెరికా రాయబారి డేవిడ్ హాలేకి ఆ దేశం సోమవారం రాత్రి సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ సమన్లు జారీ చేసిన విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం సైతం ధ్రువీకరించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి తెహమీనియా జుంజువా ఈ సమన్లు పంపినట్టు తెలిపింది. -
నిజమే.. దూరం పెరిగింది..!
ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్తాన్ వివాదంతో.. ఇస్లామాబాద్-వాషింగ్టన్ మధ్య దూరం పెరిగిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆసిఫ్ ఖాజా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రస్తుతంఇరు దేశాల మధ్య విశ్వసనీయత లేదు.. అయితే.. దూరాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం..అని ఆసిఫ్ ఖాజా మీడియాకు తెలిపారు. మంగళవారం అమెరికా రక్షణ మంత్రి రెక్స్ టిల్లర్సన్తో సమావేశం అనంతరం ఆసిఫ్ ఖాజా మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదుల అడ్డా కాదని తెలిపారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంలా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా ఉన్నతాధికారు ఒకరు పాక్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ట్రంప్ అభిప్రాయాన్ని.. రెక్స్ టిల్లర్సన్ పాకిస్తాన్ ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతేకాక పాకిస్తాన్లోని ఉగ్రవాదుల ఏరివేతకు ప్రభుత్వం మరింత తీవ్రంగా కృషి చేయాలని టిల్లర్సన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఆసిఫ్ కాజా వీటిపై వివరణ ఇస్తూ.. ఉగ్రవాదులు 40 ఆఫ్ఘన్ భూభాగాన్ని ఆక్రమించుకుని ఉన్నారని ఆయన అన్నారు. , -
అణుదాడి చేస్తాం
ఇస్లామాబాద్ : మేం తల్చుకుంటే భారత్లో ఒక్క నగరం మిగలదు.. ఢిల్లీ సహా పలు నగరాలను నేల మట్టం చేస్తాం.. మా అణు శక్తిని తట్టుకోలేరు అంటూ భారత్ను పాకిస్తాన్ హెచ్చరించింది. అలాగే ఐఎస్ఐతో ఉగ్రవాదులకు సంబంధాలున్నాయన్న అమెరికా ప్రకటనపైనా స్పందించింది. అమెరికాలోని గన్ లాబీయిస్టులకే ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని పాక్ వ్యాఖ్యానించింది. ‘భారత ప్రభుత్వం ఆదేశిస్తే.. ఏకకాలంలో చైనా, పాకిస్తాన్లతో యుద్ధం చేయగలమని.. అవసరం అయితే పాకిస్తాన్లోని అణ్వాయుధ స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని’ ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా ప్రకటనపై పాక్ ప్రతిస్పందించింది. మేం తల్చుకుంటే భారత్లోని ఏ నగరాన్ని అయినా నేలమట్టం చేయగలని పాకిస్తాన్ విదేశాంగ శాఖమంత్రి ఖ్వాజా ఆసిఫ్ శుక్రవారం ప్రకటించారు. అంతేకాక మా అణుశక్తిని తట్టుకుని భారత్ నిలబడలేదని హెచ్చరించారు. సరిహద్దునుంచి లక్ష్యం నిర్ణయించి మా అణ్వాయుధాలను వదిలితే.. క్షణాల్లో ఢిల్లీ సహా పలు నగరాలు నేలమట్టం అవుతాయని ఆయన అన్నారు. ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. శక్తివంతమైన అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో పాక్ ఒకటని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న వ్యాఖ్యలను ఆసిఫ్ ఖండించారు. అసలు అమెరికాలోని గన్ లాబీసంస్థలకే ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని చెప్పారు. ఇందుకు లాస్వేగాస్ ఘటనే నిదర్శనమని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఉగ్రవాదం పెరగడానికి గన్ లాబీనే కారణమని ఆసిఫ్ అన్నారు. -
ప్రధాని మోదీ ఓ ఉగ్రవాది
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ టెర్రరిస్టు అని, భారత ప్రజలు ఓ ఉగ్రవాదిని తమ దేశ ప్రధానిగా ఎన్నుకున్నారని పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓ ఉగ్రవాద సంస్థ అని, అది రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్)కు అనుబంధ సంస్థగా పనిచేస్తోందని స్థానిక వార్తా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. గుజరాత్ అల్లర్లలో మోదీ ముస్లింల రక్తం కళ్ల చూశారని విమర్శించారు. భారత్లో గోవధ పేరుతో ముస్లింలు, దళితులను హతమారుస్తున్నారని ఆరోపించారు. వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలను ఉగ్రవాదులతో పోల్చి వారి దిష్టిబొమ్మలను తగలబెట్టడం హేయమైన చర్య అని అన్నారు. ఆసిఫ్ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు ఖండించారు. పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రపంచానికి చెబుతున్నారనే కారణంతో మోదీపై తమ అక్కసు వెల్లగక్కుతున్నారన్నారు. -
ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఉగ్రవాదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని ఐక్యరాజ్య సమితి సదస్సులో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను ఆసిఫ్ ఈ విధంగా తిప్పికొట్టారు. సోమవారం ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ ఉగ్రవాదన్ని ఎగుమతి చేస్తుందని సుష్మా స్వరాజ్ ఆరోపించిందని, కానీ వారి దేశం భారత్ ఓ ఉగ్రవాది చేతిలోనే నడుస్తుందన్నారు. ఉగ్రవాదైన మోదీని ప్రధానిగా ఎన్నుకున్నారని, మోదీ గుజరాత్లో ముస్లింల రక్తం కళ్ల చూశాడని గుజరాత్ అల్లర్లను ఆసిఫ్ ప్రస్తావించారు. అంతేకాకుండా ఆర్ఎస్సెస్ ఒక ఉగ్రవాద సంస్థ అని మండిపడ్డారు. -
ఉరి కరెక్టే.. ఉక్కుపిడికిలితో ఢీకొంటాం: పాక్
న్యూఢిల్లీ: భారత్ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్కు మరణ శిక్ష విషయంలో వెనక్కి తగ్గబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఈ శిక్ష విధించడాన్ని పాక్ సమర్థించుకుంది. జాదవ్ గూఢచర్యం నెరిపినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఉరి శిక్ష విధించడానికి ముందు అన్ని నియమనిబంధనలు పాటించామని, తమ చట్టాలకు లోబడే ఈ శిక్ష విధించామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ చెప్పారు. చట్టానికి విరుద్ధంగా ఒక్కటి కూడా చేయలేదని చెప్పారు. తమ దేశ సార్వభౌమత్వానికి విరుద్ధంగా పనిచేసే శక్తుల విషయంలో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీని ద్వారా జాదవ్ విషయంలో పాక్ మొండి వైఖరి స్పష్టమవుతోంది. ‘జాదవ్కు విధించిన ఉరి శిక్ష పూర్వాలోచనతో చేసిన పని భారత్ అంటోంది. కానీ, మేం మాత్రం చట్టానికి లోబడే కేసును విచారించాం. నియమ నిబంధనలు పాటించాం. పాకిస్థాన్ ఈ విషయంలో ఎలాంటి ప్రత్యేక కన్సెషన్ ఇవ్వబోదు. మా దేశ సార్వభౌమాధికారన్ని దెబ్బకొట్టాలని, తమ దేశ సుస్థిరతకు భంగంకలిగించాలనే చూసే శక్తులను ఉక్కు పిడికిలితో ఎదుర్కొంటాం’ అని అసిఫ్ మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. -
ఇదే మా హెచ్చరిక.. కుట్ర చేస్తే సహించం: పాక్
గూఢచర్యం ఆరోపణలపై భారత జాతీయుడు కులభూషణ్ జాధవ్కు ఉరిశిక్ష విధించడాన్ని పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్థించుకున్నారు. తమ దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారికి ఈ ఉరిశిక్ష హెచ్చరిక లాంటిందని ఆయన పేర్కొన్నారు. దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారిని వదిలిపెట్టబోమని, వారికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైన శక్తులన్నింటినీ వాడుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. ‘పాకిస్థాన్ సైనికులు, ప్రజలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఉగ్రవాదులు, వారికి సాయం చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలని ఈ త్యాగాలు కోరుతున్నాయి’ అని అన్నారు. జాధవ్ బహిరంగంగా తన నేరాన్ని ఒప్పుకొన్నాడని, ఈ విషయాన్ని భారత్ లేవనెత్తితే.. పాకిస్థాన్ తగిన సమాధానం ఇస్తుందని ఆయన చెప్పారు. కల్లోలిత బెలూచిస్థాన్ ప్రావిన్స్లో గూఢచర్యానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్భూషణ్ జాధవ్ (46)కు సోమవారం పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జాధవ్ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామని ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ పేర్కొంది. అయితే పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాధవ్కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.