-
Israel-Hamas war: నెతన్యాహు, హమాస్ నాయకుల అరెస్టుకు ఆదేశాలు కోరతా
జెరూసలెం: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, హమాస్ అగ్రనేతలపై అరెస్టు వారెంట్లు కోరనున్నట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ సోమవారం వెల్లడించారు. గాజా, ఇజ్రాయెల్లో యుద్ధ నేరాలు, మానవాళిపై అకృత్యాలకు గాను నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్, హమాస్ నేతలు యోహియా సిన్వర్, మహ్మద్ దీఫ్, ఇస్మాయిల్ హనియేహ్లు బాధ్యులని ఆయన అన్నారు. ముగ్గురు జడ్జిల ప్యానెల్ అరెస్టు వారెంట్లు, కేసు కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా ఇలాంటి వాటిల్లో నిర్ణయానికి జడ్జిలు రెండు నెలల సమయం తీసుకుంటారు. వారెంట్లు జారీ అయినా నెతన్యాహు, గాలంట్లకు వచ్చే ఇబ్బందేమీ లేదు. కానీ నెతన్యాహు, గాలంట్లు విదేశీ పర్యటనలకు వెళ్లడం కష్టమవుతుంది. వారెంట్లు కోరడాన్ని యూదు వ్యతిరేక చర్యగా నెతన్యాహు అభివర్ణించారు. -
Israel-Hamas war: స్వతంత్ర పాలస్తీనాకు నెతన్యాహు నో
టెల్ అవీవ్: గాజాలో యుద్ధం ముగిశాక స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు చేయాలన్న అగ్ర రాజ్యం అమెరికా ప్రతిపాదనను తిరస్కరించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హమాస్ నిర్మూలన, బందీల విడుదలతో సంపూర్ణ విజయం లభించేదాకా గాజాలో యుద్ధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు. గాజాలోని 25 వేల మంది ప్రజలు మృత్యువాత, 85% మంది ప్రజలు వలసబాట పట్టిన నేపథ్యంలో యుద్ధం విరమించుకునేలా చర్చలు జరపాలంటూ ఇజ్రాయెల్పై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా సహా పలు దేశాలు ‘రెండు దేశాల’విధానాన్ని పునరుద్ధరించాలంటూ కోరుతున్నాయి. అయితే, నెతన్యాహు తాజా ప్రకటనతో యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ నిర్ణయంలో మార్పులేదని స్పష్టమైంది. నెతన్యాహు వ్యాఖ్యలపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ప్రతినిధి జాన్ కిర్బీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్, అమెరికాలు ఒకే అంశంపై భిన్నంగా ఆలోచించడం సహజమేనన్నారు. -
Israel-Hamas war: కాల్పులకు విరామం
జెరూసలేం/ఐరాస: తాత్కాలికంగానైనా ప్రార్థనలు ఫలించాయి. ప్రపంచ దేశాల విన్నపాలు ఫలితమిచ్చాయి. తీవ్ర ప్రతీకారేచ్ఛతో గాజాపై ఆరు వారాలుగా వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఓ మెట్టు దిగొచి్చంది. అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ‘‘ఇజ్రాయెల్ నాలుగు రోజుల పాటు కాల్పులను పూర్తిగా నిలిపేస్తుంది. బదులుగా హమాస్ తన చెరలో ఉన్న 240 మంది పై చిలుకు బందీల్లో 50 మందిని విడిచిపెడుతుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది. బందీలందరినీ విడిపించేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు సమాచారం. హమాస్ చెర నుంచి బయట పడేవారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉంటారని చెబుతున్నారు. ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా మహిళలు, పిల్లలను విడిచి పెట్టనుందని ఖతర్ వెల్లడించింది. ఈజిప్టు, అమెరికాతో పాటు ఖతర్ కూడా ఇరు వర్గాల చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించడం తెలిసిందే. నిత్యావసరాలతో సహా సర్వం నిండుకుని మానవీయ సంక్షోభంతో అల్లాడిపోతున్న గాజాకు ఈ నాలుగు రోజుల్లో అదనపు సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు ఖతర్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందం మలి దశలో భాగంగా మున్ముందు ఇరువైపుల నుంచి మరింత మంది బందీలు విడుదలవుతారని చెప్పుకొచి్చంది. కాల్పుల విరమణ గురువారం ఉదయం పదింటి నుంచి అమల్లోకి రానుంది. యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుండబద్దలు కొట్టారు! నాలుగు రోజుల విరామం ముగియగానే గాజాపై దాడులు పునఃప్రారంభం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ‘‘మేం ముట్టడిలో ఉన్నాం. హమాస్ను నిర్మూలించి మా లక్ష్యాలన్నింటినీ సాధించేదాకా యుద్ధాన్ని కొనసాగించి తీరతాం’’ అని ప్రకటించారు. దీర్ఘకాలిక యుద్ధానికి సైన్యం మరింతగా సన్నద్ధమయ్యేందుకు విరామం ఉపయోగపడుతుంది తప్ప సైనికుల స్థైర్యాన్ని తగ్గించబోదని ఆయన అన్నారు. అయితే హమాస్ చెరలోని బందీల్లో ప్రతి 10 మంది విడుదలకు ప్రతిగా కాల్పుల విరామాన్ని ఒక రోజు చొప్పున పెంచేందుకు ఇజ్రాయెల్ సమ్మతించింది. కాల్పుల విరమణను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు దేశాధినేతలు స్వాగతించారు. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న హమాస్ ఇస్లామిక్ మిలిటెంట్లు మెరుపు దాడికి దిగడం తెలిసిందే. 1,200 మందికి పైగా ఇజ్రాయెలీలను హతమార్చడంతో పాటు 240 మందికి పైగా బందీలుగా గాజాకు తరలించారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగి గాజాపై ఆరు వారాలుగా క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తోంది. ఏం జరగనుంది... ► ఇజ్రాయెల్, హమాస్ రెండూ నాలుగు రోజుల పాటు కాల్పులను పూర్తిగా నిలిపేస్తాయి. ►ముందు తమ వద్ద ఉన్న బందీల్లోంచి 50 మంది మహిళలు, చిన్నారులను రోజుకు 12 మంది చొప్పున హమాస్ విడుదల చేస్తుంది. ►అనంతరం ఇజ్రాయెల్ కూడా తన జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేస్తుందని ఖతర్ ప్రకటించింది. ►బహుశా గురువారమే బందీల విడుదల ప్రక్రియ మొదలవ్వొచ్చని వైట్హౌస్ అభిప్రాయపడింది. ►ఈ నాలుగు రోజుల్లో గాజాకు అదనపు మానవీయ సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతిస్తుంది. ఇప్పట్లో మళ్లీ కాల్పులుండనట్టే...! విరామానికి స్వస్తి చెప్పి ఇజ్రాయెల్ ఇప్పట్లో గాజాపై మళ్లీ దాడులకు దిగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘‘50 మంది బందీలు విడుదలైతే మిగతా వారినీ విడిపించాలంటూ కుటుంబీకుల నుంచి ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. అందులోనూ హమాస్ తన చెరలో ఉన్న సైనికులను చిట్టచివరన గానీ వదిలిపెట్టదు. అప్పటిదాకా దాడులు మొదలు పెట్టేందుకు వారి కుటుంబాలు ఒప్పుకోకపోవచ్చు’’ అని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో హమాస్ దీన్ని తమ విజయంగా చెప్పుకుంటే అది నెతన్యాహూ సర్కారుకు ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. మరోవైపు, గాజాపై ఇజ్రాయెల్ దాడులు బుధవారం కూడా తీవ్ర స్థాయిలో కొనసాగాయి. ఉత్తర గాజాలో జబాలియా శరణార్థి శిబిరం బాంబు దాడులతో దద్దరిల్లింది. హమాస్ కూడా రోజంతా ఇజ్రాయెల్పైకి రాకెట్ దాడులు కొనసాగించింది. -
ప్రపంచశక్తిగా భారత్ !
అహ్మదాబాద్: భారత్ను ప్రపంచశక్తిగా తీర్చిదిద్దేందుకు సృజనాత్మకత ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్పు తీసుకొస్తున్నారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. దూరదృష్టితో మోదీ భారత్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని కొనియాడారు. అటు ప్రధాని మోదీ కూడా ఇజ్రాయెల్ సృజనాత్మకతను ప్రశంసించారు. నవభారత నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సృజనాత్మకతను ప్రోత్సహించే వ్యవస్థను నెలకొల్పేందుకు కృషిచేస్తోందన్నారు. నెతన్యాహుతో కలిసి అహ్మదాబాద్ సమీపంలోని దియోధోలేరా గ్రామంలో ఏర్పాటుచేసిన ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ టెక్నాలజీ’ (ఐ క్రియేట్)ను మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మోదీ, నెతన్యాహు దంపతులు పతంగులు ఎగురవేశారు. భారత పర్యటన స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుందని నెతన్యాహు అన్నారు. మేమిద్దరం యువకులమే! పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన ఈ ఐ క్రియేట్ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం.. ఈ కార్యక్రమానికి హాజరైన యువ వ్యాపారవేత్తలు, వాణిజ్య ప్రముఖులనుద్దేశించి ఇరువురు నేతలు ప్రసంగించారు. ప్రతి రంగంలో భారత్తో భాగస్వామ్యం కోసం ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ యువత భారత్లో పర్యటించి ఐ క్రియేట్ ద్వారా శక్తిసామర్థ్యాలను పెంచుకోవాలని కోరారు. ‘ప్రధాని మోదీ దూరదృష్టి గల నాయకత్వంతో భారత్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. భవిష్యత్తులో ఈ మార్పు ద్వారా ప్రపంచశక్తిగా భారత్ మారేందుకు ఆయన పనిచేస్తున్నారు. నైపుణ్యత, సృజనాత్మకత ద్వారా దీన్ని సాధిస్తున్నారు’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ‘నేను, మోదీ ఇద్దరు యువకులమే. ఆశావాద ధృక్పథంతో ముదుకెళ్తున్నాం. మా ఆలోచనలు నిత్య యవ్వనం’ అని పేర్కొన్నారు. నవభారత నిర్మాణానికి... సృజనాత్మక వ్యవస్థ ద్వారా నవభారత నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకు నిధులు, స్థలాలు, మార్గదర్శకులను ఇవ్వటంతోపాటు ఇతర వసతులు కల్పించి వారిలోని సామర్థ్యానికి పదును పెట్టేందుకే ‘ఐ క్రియేట్’ను ఏర్పాటుచేశామన్నారు. అనంతరం, సబర్కంఠ జిల్లాలోని వాద్రాద్ గ్రామంలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్’ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మోదీ, నెతన్యాహు పాల్గొన్నారు. భారత్ ఓ స్వప్నంతో ముందుకెళ్తున్న దేశమని నెతన్యాహు ప్రశంసించారు. ఇజ్రాయెల్ సాంకేతికతతో గుజరాత్ రైతులు సాధిస్తున్న విజయాలను ఈ సందర్భంగా నెతన్యాహు ప్రశంసించారు. అట్టహాసంగా రోడ్ షో మోదీ, నెతన్యాహుల రోడ్ షో అహ్మదాబాద్ వీధుల్లో ఘనంగా సాగింది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు 8 కి.మీ. మేర పటిష్ట భద్రత నడుమ ఈ రోడ్ షో జరిగింది. రోడ్లకు ఇరువైపులా వేల సంఖ్యలో ప్రజలు భారత్, ఇజ్రాయెల్ పతకాలు చేతిలో పట్టుకుని బారులు తీరారు. మోదీకి కానుక భారత పర్యటన సందర్భంగా మోదీకి నెతన్యాహు ప్రత్యేకమైన కానుక అందజేశారు. నీటిలోని లవణాలు తొలగించి శుద్ధిచేసే ‘గాల్–మొబైల్ వాటర్ డీసాలినేషన్ అండ్ ప్యూరిఫికేషన్ జీప్’ను కానుకగా ఇచ్చారు. అహ్మదాబాద్ జిల్లా బావ్లా సమీపంలో జరిగిన కార్యక్రమంలో ఈ నీటి శుద్ధి యంత్రాన్ని మోదీకి అందజేశారు. ఈ వాహనాన్ని నెతన్యాహు సమక్షంలోనే బసకంఠ జిల్లా సుయిగామ్ (భారత్–పాక్ సరిహద్దుల్లోని గ్రామం) ప్రజలకు మోదీ అంకితం చేశారు. ‘గతేడాది ఇజ్రాయెల్ పర్యటనలో నాకు ఈ వాహనాన్ని చూపించారు. చెత్త నీటిని కూడా ఇది శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఆ వాహనాన్ని నెతన్యాహు కానుకగా ఇచ్చా రు. సరిహద్దుల్లోని సుయిగామ్లో ఇది ఉంటుంది. దీనిద్వారా సరిహద్దులోని జవాన్లకు శుద్ధమైన తాగునీరు అందుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. -
ఇస్లాం అతివాదంతో పెను ముప్పు
న్యూఢిల్లీ: ఇస్లాం అతివాదం, ఉగ్రవాదుల చర్యలు అంత్యంత ప్రమాదకరమైనవనీ, అంతర్జాతీయ వ్యవస్థపై ఇవి తీవ్ర దుష్పరిణామాలు చూపగలవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్–ఇజ్రాయెల్ మధ్య మరింత బలమైన బంధం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆరు రోజుల భారత పర్యటనలో ఉన్న నెతన్యాహు మంగళవారం ఢిల్లీలో రైసినా డైలాగ్ భౌగోళిక–రాజకీయ మూడో సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇజ్రాయెల్కు భారత్ సహజ భాగస్వామి, మిత్రదేశమని చెప్పడంతో అక్కడే ఉన్న నరేంద్ర మోదీ పెదవులపై నవ్వులు విరిశాయి. ఒకప్పుడు ఏమీ లేని ఇజ్రాయెల్ ఆర్థిక, సైనిక, రాజకీయ శక్తుల ద్వారానే నేడు బలమైన దేశంగా ఎదిగిందని నెతన్యాహు చెప్పారు. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు, కంపెనీల కార్యకలాపాల్లో ప్రభుత్వ పాత్రను పరిమితం చేసేందుకు మోదీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రజాస్వామ్య దేశాలు కూటమిగా ఏర్పడటం చాలా ముఖ్యమని నెతన్యాహు పేర్కొన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు రైసినా డైలాగ్ సదస్సును 2016 నుంచి విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) సంయుక్తంగా ప్రతి ఏడాది నిర్వహిస్తున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి మొత్తం 550 మంది ఈ ఏడాది హాజరవుతున్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబ, యూఎస్ పసిఫిక్ కమాండ్కు చెందిన కమాండర్ హ్యారీ హ్యారిస్ తదితరులు బుధవారం ప్రసగించనున్నారు. తాజ్ను సందర్శించిన నెతన్యాహు రైసినా డైలాగ్ను ప్రారంభించడానికి ముందు నెతన్యాహు తన భార్య సారాతో కలసి తాజ్మహల్ను సందర్శించారు. నెతన్యాహు దంపతులకు ఆగ్రా విమానాశ్రయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. నెతన్యాహు సందర్శన నేపథ్యంలో తాజ్మహల్లోకి రెండు గంటలపాటు సాధారణ ప్రజలను అనుమతించలేదు. కాగా, మోదీ గతేడాది ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు ఓల్గా బీచ్లో నెతన్యాహుతో కలసి నడిపిన గాల్–మొబైల్ జీప్ను నెతన్యాహు మోదీకి బహూకరించనున్నారు. దాదాపు రూ. 72 లక్షల విలువైన ఈ జీప్ సముద్రపు నీటిని నిర్లవణీకరణం చేసి తాగునీటిగా మారుస్తుంది. గాల్–మొబైల్ ఇప్పటికే భారత్కు చేరుకుంది. భారత్ ఇజ్రాయెల్ మధ్య 9 ఒప్పందాలు భారత్–ఇజ్రాయెల్ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా సోమవారం ఇరు దేశాల మధ్య సైబర్ భద్రత, గ్యాస్, ఆయిల్ తదితర రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల అధికారులు వీటిపై సంతకాలు చేశారు. అలాగే ఢిల్లీలో సోమవారం జరిగిన ఇండియా–ఇజ్రాయెల్ వాణిజ్య సదస్సులో మోదీ మాట్లాడుతూ కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత అబివృద్ధి చేసుకునేందుకు భారత్లో అపార అవకాశాలున్నాయన్నారు. ముంబైకి మోషే 2008 నవంబరు 26న ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఇజ్రాయెల్ యూదు బాలుడు మోషే హోల్జ్బర్గ్ మంగళవారం మళ్లీ ముంబైకి వచ్చాడు. ప్రస్తుతం 11 ఏళ్ల వయసున్న మోషే, ఆ దుర్ఘటన తర్వాత భారత్కు రావడం ఇదే తొలిసారి. తన తాతయ్య షిమోన్ రోజెన్బర్గ్తో కలసి వచ్చిన అతను...తన తల్లిదండ్రులు చనిపోయిన నారీమన్ హౌస్ను సందర్శించి నివాళి అర్పించాడు. భారత్కు రావడం ఆనందంగా ఉందన్నాడు. గతేడాది మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు మోషేను, అతని కుటుంబాన్ని కలసిన మోదీ...వారు భారత్కు ఎప్పుడైనా రావొచ్చంటూ ఆహ్వానించారు. తాజాగా నెతన్యాహు పర్యటన నేపథ్యంలో మోషే ముంబైకి విచ్చేశాడు. -
నెతన్యాహు సభలో అడుగుపెట్టొద్దు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తమ సభలో ప్రసంగించేందుకు ఆహ్వానించడాన్ని అమెరికాలోని సగంమందికి పైగా పౌరులు వ్యతిరేకించారు. అమెరికా అధికారిక భవనం వైట్ హౌస్ను సంప్రదించకుండానే ఎలా ఈ నిర్ణయాన్ని తీసుకుంటారని, దానిని తాము వ్యతిరేకిస్తున్నామని ముక్తకంఠంగా తెలిపారు. నెతన్యాహు పర్యటనపై అక్కడి కొన్ని టీవీ చానెళ్లు ఎన్బీసీ న్యూస్ వాల్ స్ట్రీట్ జర్నల్ పోల్ నిర్వహించగా 48శాతం మంది పౌరులు నేరుగా నెతన్యాహు పర్యటనను నిరసించగా.. మరో 22 మంది తమకు ఏమీ తెలియదని సమాధానమిచ్చారు. మిగితా వారు స్పీకర్ జాన్ బోనర్ ఇలాంటి పనులు చేయకూడదని సలహా ఇచ్చారు. ముందుగా ఈ విషయాన్ని అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఇక మళ్లీ భానుడి సెగ
విదేశీ ఉద్యోగాలతో జర భద్రం
ఈరోడ్లో వేడుకగా రెక్లాన్ పోటీలు
తంజావూరులో గురు పూజా మహోత్సవం
గెలుపే కరుణకు కానుక
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం
తిరుత్తణికి పోటెత్తిన భక్తజనం
పెరమానళ్లూరులో తాగునీరు కలుషితం
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement