-
Underpass: బంజారాహిల్స్ టు జూబ్లీహిల్స్!
మహానగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త ప్రభుత్వం రంగంలోకి దిగింది. ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉన్న జంక్షన్లలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేంచాలని, ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ జంక్షన్లలో తలెత్తుతున్న వాహన రద్దీని అదుపులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్పై జీహెచ్ఎంసీ, పోలీసులతో సమీక్ష నిర్వహించిన సీఎం నగరంలోనే అత్యధిక రద్దీతో రికార్డుల్లోకెక్కిన జూబ్లీహిల్స్ జంక్షన్పై దృష్టిపెట్టాలని సూచించారు. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్, నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్పోస్టు పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45, రోడ్డు నెంబర్–36తో పాటు జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, విరించి హాస్పటల్ చౌరస్తా, కేబీఆర్ పార్కు చౌరస్తాల్లో రెండు విడతలుగా పర్యటించారు. ► ట్రాఫిక్ ఎక్కడెక్కడ రద్దీగా ఉంటుందో పరిశీలించడమే కాకుండా అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఏమి చేస్తే బాగుంటుందనే దానిపై అప్పటికే ట్రాఫిక్పై అధ్యయనం చేసిన అధికారులతో చర్చించి డిజైన్లను పరిశీలించారు. అండర్పాస్లు.. ఫ్లైఓవర్లు... జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సమన్వయ పర్యటనలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు దాటి, రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా వరకు వెళ్లడానికి అండర్పాస్ నిర్మించాలని నిర్ణయించారు. ► ఇందులో భాగంగా అడ్డుగా ఉన్న డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్లను మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించారు. ► కేబీఆర్ పార్కులో ఒక్క చెట్టు కూడా నష్టపోకుండా గ్రీన్ ట్రిబ్యునల్ అథారిటీకి లోబడి 1.5 కిలోమీటర్ల మేర ఈ అండర్పాస్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీర్లను ఆదేశించారు. దీని ద్వారా బాలకృష్ణ ఇంటివైపు, ఫిలింనగర్ వైపు, రోడ్డు నెంబర్–45 వైపు వాహనదారులు కేబీఆర్ పార్కు నుంచి ఎలాంటి ఆటంకా>లు లేకుండా తేలిగ్గా ముందుకుసాగనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వరకు వన్వేలో వెళ్లేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు కిలోమీటరు మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నుంచి వాహనాలు దిగిన తర్వాత ఆ వెంటనే కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ మీదుగా బంజారాహిల్స్ వైపు వాహనదారులు వెళ్లేందుకు అనువుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే అటు అండర్పాస్, ఇటు ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం సంబంధిత ఇంజినీర్లు డిజైన్లు కూడా పూర్తిచేయగా, ఆ మ్యాప్లను జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్లు పరిశీలించారు. ► జర్నలిస్ట్ కాలనీ చౌరస్తాలో ప్రముక పాత్రికేయుడి శిలా విగ్రహం రోడ్డు మధ్యలోకి రావడంతో ఆ విగ్రహాన్ని సెంట్రల్ మీడియన్లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో ఓ దఫా చర్చించారు. మరోసారి సంబంధిత ప్రతినిధులతో సంప్రదించి ఈ విగ్రహాన్ని మరింత సుందరంగా చౌరస్తా మధ్యలో నిర్మించాలని నిర్ణయించారు. ► దీని ద్వారా జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు వెళ్లే వాహనదారులు మరింత తేలికగా ముందుకుసాగనున్నారు. ► కేబీఆర్ జంక్షన్, జూబ్లీహిల్స్ జంక్షన్, జర్నలిస్ట్కాలనీ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 జంక్షన్, సీవీఆర్ న్యూస్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 అగ్రసేన్ జంక్షన్లలో ఇరుకుగా ఉన్న సెంట్రల్ మీడియన్లను కొంతమర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ► నాలుగువైపులా వాహనాలు తేలిగ్గా వెళ్లేందుకు వీలుగా ఈ సెంట్రల్ మీడియన్లను కట్ చేయనున్నారు. 20 సంవత్సరాలు క్రితం అప్పటి ట్రాఫిక్కు అనుగుణంగా ఈ చౌరస్తాలు రూపుదిద్దుకోగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న మార్పు కూడా చేయకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా, రోడ్లు, జంక్షన్ల విస్తరణ కూడా చేపట్టలేదు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం జంక్షన్ల విస్తరణకు ముందుకురావడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేయాలని నిర్ణయించింది. ► కేబీఆర్ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా ఫిలింనగర్ వెళ్లే జూబ్లీహిల్స్ జంక్షన్ మలుపు వద్ద భారీ హైటెన్షన్ స్తంభాలు ఫుట్పాత్పై అడ్డుగా ఉన్నాయి. ఇక్కడ ఫుట్పాత్ కూడా చాలా వెడల్పుగా ఉంది. ఫిలింనగర్ వైపు 2, 3 బస్టాపులు అనవసరంగా నిర్మించారు. ► హైటెన్షన్ స్తంభాలను తొలగించి ఫుట్పాత్ వెడల్పును తగ్గించి మూడు బస్òÙల్టర్లను తీసేయడం ద్వారా ఫిలింనగర్ వైపు ప్రీలెఫ్ట్లో వాహనదారులు తేలికగా వెళతారని నిర్ణయించారు. ► ఇక కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పార్కింగ్ స్థలాల్లో మలీ్టలెవల్ పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే దిశలో కూడా అధికారులు చర్చించారు. -
చెరువు రక్షణకు 18 ఏళ్లు సరిపోలేదా?
సాక్షి, హైదరాబాద్: ‘రామంతాపూర్ చెరువు రక్షణకు సంబంధించి మీరు 2016లో రెవెన్యూ విభాగానికి ఒక లేఖ రాశారు. దాని తర్వాత కూడా గుర్తు చేశారు. ఎప్పుడు లేఖ రాశార న్నది మీకు కచ్చితమైన తేదీ తెలియదు. మరో ఇద్దరు ముగ్గురు బిల్డర్లు చెరువు పరిధిలో భవన నిర్మాణాలు చేపట్టా లని మీరు కోరుకుంటున్నారా? ఇలాంటి సమాధానా లిచ్చి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. తీవ్ర అహసనంతో చెబుతు న్నాం.. మీ చట్టబద్ధమైన విధిని నిర్వర్తించనందుకు మీపై చర్య తీసు కోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తాం. ఈ పిటిషన్ 2005 నుంచి పెండింగ్లో ఉంది. 18 ఏళ్లు గడిచినా చెరువు రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా ఎన్నాళ్లు సమయం కావాలి. మీ పనిని మరొకరిపై నెట్టి తప్పించుకో లేరు. భవిష్యత్ తరాలకు తాగునీటికి సంబంధించిన అంశంలోనూ ఇంత నిర్లక్ష్యమా? ఉన్న జలవనరులను రక్షించు కోలేకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు’ అని జీహెచ్ఎంసీ కమిష నర్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రామంతాపూర్ పెద్దచెరువును రియల్టర్లు, అక్ర మార్కులు ఆక్రమించకుండా అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్ఎంసీ కమిష నర్ రొనాల్డ్ రోస్ను ప్రశ్నించింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధి కారులకు 2016లోనే లేఖ రాశామని, వివ రాలు ఇంకా అందలేదని ఆయన చెప్పారు. దీంతో జీహెచ్ ఎంసీ కమిషనర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, అసహ నం వ్యక్తం చేసింది. తదు పరి విచారణకు కూడా హాజరు కావా లని తేల్చిచెప్పింది. ఈ పిటిషన్లో హెచ్ఎండీఏ కమిష నర్ ను ఇంప్లీడ్ చేయాలని రిజిస్ట్రీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణలోగా వివరాలు అందజేయండి.. హైదరాబాద్లో 532 చెరువులు క్షీణిస్తున్నాయని, 26 ఎకరాల్లోని రామంతాపూర్ పెద్దచెరువును డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని, ఈ కారణంగా నీటికాలుష్యం పెరిగి దుర్వాసన వ్యాపిస్తోందని ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ కెఎల్ వ్యాస్ 2005లో లేఖ రాశారు. చెరువు సమీపంలో చెత్త వేయడంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నా యని, తద్వారా వాతావరణం కలుషితమై, దుర్వాసనతో, దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ ప్రదేశంలో చెత్తను వేయకుండా జీహెచ్ఎంసీ అధికారు లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ లేఖను హైకోర్టు విచా రణకు స్వీకరించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరుకావా లని గత విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం ఆదేశించింది. దీనిలో భాగంగా మంగళవారం విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరయ్యారు. అయితే ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సరిగా సమాధానాలు ఇవ్వలేకపోవడంపై ప్రభుత్వ న్యాయవాది, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్పై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్లోని వివరాలను కమిషనర్కు వివరించడంలో వీరు విఫలమ య్యారని వ్యాఖ్యానించింది. ఇకపై న్యాయవాదులపై అధార పడకుండా, సబ్జెక్టుపై సిద్ధమై కోర్టుకు రావాలని ఆదేశించింది. రామంతాపూర్ పెద్దచెరువుకు కంచె ఎప్పుడు వేస్తారు.. చెత్తరహిత నీటి వనరుగా తీర్చిదిద్దడానికి, నీటి నిల్వ పెరిగేందుకు ఏం చర్యలు తీసుకున్నారు.. ఆక్రమణలను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు.. చెత్తను వేయకుండా స్థానికులకు అవగాహన కల్పించడం.. చెరువు సరిహద్దులు రూపొందించడం.. మట్టి కోతను అరికట్టేందుకు పరీవాహక ప్రాంతాల్లో చెట్ల పెంపకాన్ని చేపట్టడం.. ఎఫ్టీఎల్ నిర్ధారణకు నోటిఫికేషన్ ఇవ్వడం.. వీటన్నింటిపై వివరాలు తెలుసుకుని అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
గడువులోగా ఆ పనులు పూర్తి చేయకుంటే ఉద్యోగం ఊస్టే!
సాక్షి, సిటీబ్యూరో: ఈసారి వర్షాకాలంలో ప్రాణాపాయం వంటి ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్తో పాటు ఉన్నతాధికారులు కొత్త కాలంగా హెచ్చరికలు జారీ చేస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా వేటు తప్పదని హెచ్చరించడంతో ఆమేరకు చర్యలకూ ప్రభుత్వం వెనుకాడబోదని భావిస్తున్న ఉన్నతాధికారులు.. ముఖ్యంగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు సంబంధిత అధికారులు, సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 5లోగా రక్షణ చర్యలన్నీ తీసుకోవాలని.. నాలాలు, మ్యాన్హోళ్ల వంటి ప్రాంతాలతోపాటు రోడ్లు, ఫుట్పాత్ల మార్గాల్లో సైతం గోతులుండరాదని మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ మెమో జారీ చేసిన నేపథ్యంలో.. నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ప్రాణాపాయం జరిగితే ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తుందని పనులు సత్వరం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. నాలా సేఫ్టీలో భాగంగా చేపట్టాల్సిన పనులతో పాటు ఇతర ప్రాంతాల్లోని పనుల్ని సైతం వెంటనే పూర్తిచేయాలని, పూర్తయ్యే అవకాశం లేని ప్రాంతాల్లో బారికేడింగ్స్తో పాటు ఇతరత్రా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారుల టీమ్స్కు నాలుగైదు రోజుల క్రితమే సర్క్యులర్లు జారీ చేశారు. సేఫ్టీ ఆడిట్లో భాగంగా పైపైనే చూస్తే సరిపోదని తాము సర్వేచేయాల్సిన ప్రాంతాల్లో అన్ని ప్రదేశాలకూ నడిచి వెళ్లి, క్షేత్రస్థాయి పరిస్థితులు క్షుణ్నంగా పరిశీలించి, రక్షణ ఏర్పాట్లు నూరు శాతం ఉన్నట్లు నిర్ధారించుకొని ధ్రువీకరించాలని పేర్కొన్నారు. ఇవీ బాధ్యతలు.. ►మాన్సూన్ సేఫ్టీ ఆడిట్లో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన బృందాల్లో నియమించిన డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్ విభాగంలోని ఎస్ఈ, ఈఈలు, డీఈఈలు, ఏఈలు, టౌన్ప్లానింగ్ విభాగంలోని సీపీ, జోనల్ ఏసీపీలు, సర్కిల్స్థాయిల్లోని ఏసీపీలు, ఎస్ఓలు, శానిటేషన్ విభాగానికి సంబంధించిన ఏఎంఓహెచ్లు, డిప్యూటీఈఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు కిందివిధంగా పనులు పూర్తిచేయాలని సూచించారు. ►తాము సర్వే చేయాల్సిన ప్రాంతంలోని ప్రతి రోడ్డు, లేన్, బైలేన్లు, డ్రెయిన్ల వెంబడి నడచుకుంటూ వెళ్లి చూడాలి. వాహనాల్లో అయితే సరిగ్గా తెలియదని నడవాలని పేర్కొన్నారు. గుంతలు, రోడ్కటింగ్లు ఉంటే సంబంధిత ఈఈ దృష్టికి తెచ్చి వెంటనే పూడ్పించాలి. రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పున్న అన్ని నాలాలకు ఫెన్సింగ్ ఉండాలి. అంతకంటేతక్కువ వెడల్పున్న నాలాలకు పైకప్పులుండాలి. అన్ని క్యాచ్పిట్లపై మూతలుండాలి. మూతలకు పగుళ్లు ఉండరాదు. అలాంటివాటిని మార్చాలి. ►అన్ని కల్వర్టుల వద్ద రక్షణ కంచెలుండాలి.అవసరమైన అన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులుండాలి. ఈ పనులు పూర్తి చేశాక అన్ని ప్రాంతాల్లో నూరు శాతం సేఫ్టీ ఉన్నట్లు క్షేత్రస్థాయి అధికారి, డిప్యూటీ కమిషనర్, ఈఈలు ధ్రువీకరించాలి. నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం సహించే పరిస్థితి లేదని, తీవ్రంగా పరిగణించడంతో పాటు తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోనుందని, మరణాలు సంభవిస్తే క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయనున్నట్లు తీవ్రంగా హెచ్చరించారు. -
ఆరు నెలలైనా కౌంటర్ వేయరా?
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి హిమాయత్సాగర్ మీదుగా హుస్సేన్సాగర్ వరకు వర్షపునీరు ప్రవహించే కాలువలన్నీ కూల్చిన భవనాల వ్యర్థాలు, అక్రమ కట్టడాలతో నిండిపోయాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని లేకపోతే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వర్షం నీరు ప్రవహించే కాలువలన్నీ వ్యర్థపదార్థాలతో పూడుకుపోవడంతో పాటు, అక్రమ నిర్మాణాల వల్ల నీరు ప్రవహించే అవకాశం లేకుండా పోయిందని, కాల్వల్లో నీరు ప్రవహించేలా చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.ఇంద్ర ప్రకాష్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. -
జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్రెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తన దగ్గరకు జీహెచ్ఎంసీ అధికారులను పంపకపోవడంపై సీరియస్ అయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఫోన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. వరద సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారంటూ దుయ్యబట్టారు. కాగా హైదరాబాద్లో వరదల్లో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలను కిషన్ రెడ్డి బుధవారం సందర్శించారు. దోమల గూడలోని అరవింద్, సూరజ్ కాలనీలో పర్యటించి బాదిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో కిషన్రెడ్డి పర్యటన ఖైరతాబాద్ ముంపు ప్రాంతాల్లో కేంద్రంమంత్రి కిషన్రెడ్డి పర్యటించారు. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతితో ఫోన్లో మాట్లాడారు. నిత్యావసరాలు,పాలు, ఆహారం పంపిణీ చేయాలని కలెక్టర్కు సూచించారు. కిషన్రెడ్డి ముందే బీహెచ్ఎంసీ అధికారులను స్థానికులు నిలదీశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement