హైదరాబాద్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో కేసీఆర్ పరిస్థితిని సమీక్షించారు.
హైదరాబాద్: హైదరాబాద్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటం, మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్కు కేసీఆర్ ఫోన్ చేసి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో, నాలాల వెంట ప్రమాదాలను నివారించేందుకు ముందుజాగ్రత్తగా తగిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.