జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పెద్దఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని యోగాసనాలు వేశారు.
సినీ నటులు నవీన్ పొలిశెట్టి, డింపుల్ హయాతి, పాయల్ రాధాకృష్ణ హాజరై యోగా చేశారు.


