* ప్రభుత్వానికి సరెండర్ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్
* బీజేపీ ఎమ్మెల్యే దీక్షకు ‘ఇస్కాన్’ నుంచి భోజనం అందించారని ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె పరిష్కారం విషయంలో పంథాలు ఓ అధికారి కుర్చీకే ఎసరు పెట్టాయి! సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించలేదనే ఆరోపణలపై ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్(డీసీ)పై జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ వేటు వేయడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేసినందుకు సమ్మెలో పాల్గొన్న 1,300 మంది కార్మికులను జీహెచ్ఎంసీ తొలగించిన విషయం తెలిసిందే. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు, వామపక్షాలతో పాటు బీజేపీ సైతం ఆందోళనలు చేస్తోంది. ఇదే కోవలో ఉప్పల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గత 24 నుంచి 31 వరకు ఉప్పల్ సర్కిల్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేశారు. వారం పాటు కొనసాగించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళను విరమించారు. ధర్నాలో పాల్గొన్న వారికి ఒకరోజు ‘హరే రామ హరే కృష్ణ’ మఠం నిర్వాహకులు ఉచితంగా భోజనాన్ని సరఫరా చేశారు.
జీహెచ్ఎంసీ రాయితీతో ‘హరే రామ హేరే కృష్ణ’ మఠం రూ.5కే భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వారికి ఈ పథకం కింద భోజనం వడ్డించారని ఉన్నతాధికారులు భావించారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ శనివారం డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథ్ను వివరణ కోరారు. ఇందులో తన ప్రమేయం లేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అయితే విశ్వనాథ్ను ఉప్పల్ సర్కిల్ బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రసాదం పంపాలని కోరా..
దీనిపై ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ వివరణ ఇస్తూ.. ధర్నాలో పాల్గొన్న వారికి తన కోరిక మేరకే ఇస్కాన్ మఠం వాళ్లు ప్రసాదం పంపించారని చెప్పారు. ‘ఏకాదశి నాడు చాలా మంది ఉపవాస దీక్ష చేశారు. ఆ మరుసటి రోజు ధర్నా చేయడంతో మఠం నుంచి ప్రసాదాన్ని తెప్పించాను. రూ.5కే భోజనం పథకంతో ఈ ప్రసాదానికి ఎలాంటి సంబంధం లేదు.’ అని తెలిపారు.
ఉప్పల్ డీసీపై ‘సమ్మె’ట వేటు!
Published Tue, Aug 4 2015 2:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement