తెలంగాణ సీఎస్ తో పలు జిల్లా కలెక్టర్లు భేటీ


రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో చెత్త సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ నేపథ్యంలో చెత్త వేసేందుకు కొత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ అంశంపై చర్చించేందుకు మంగళవారం ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల కలెక్టర్లు భేటీ అయ్యారు. హైదరాబాద్ నగర శివారులలో నూతన డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై ఈ సందర్బంగా చర్చిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top