-
తెలంగాణలో 3 గ్రీన్ఫీల్డ్ కారిడార్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రహదారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్మాల పరియోజన–1 కింద గ్రీన్ఫీల్డ్ హైస్పీడ్ ఎక్స్ప్రెస్ కారిడార్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ మీదుగా మూడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఐదు గ్రీన్ఫీల్డ్ హైస్పీడ్ ఎక్స్ప్రెస్ కారిడార్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీ లింగయ్య యాదవ్ అడిగిన ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాద్– విశాఖపట్నం (222 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్, షోలాపూర్ – కర్నూల్ – చెన్నై (329 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఇండోర్–హైదరాబాద్ (525 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణం పాక్షికంగా పూర్తయిందని పేర్కొన్నారు. భారత్మాల పరియోజన –1 కింద తెలంగాణలో రూ.38,279 కోట్లతో 1,719 కి.మీ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.22,749 కోట్లతో 1,026 కి.మీ. పొడవైన రహదారుల నిర్మాణం జరుగుతోందని గడ్కరీ వివరించారు. -
Fact Check: బాబుకోసం ఓ ‘అబద్ధాల కథ’
సాక్షి, అమరావతి: ఏదైనా ప్రాజెక్టు గురించి చెప్పాలనుకుంటే ముందుగా వాస్తవాలను పరిశీలించాలి. అక్కడ జరుగుతున్న దానికి, తాము చెబుతున్న దానికీ పొంతన ఉండాలి. ఇలా ఏ పొంతనా కుదరకుండా చెప్పగలిగిన వారే రామోజీరావు. కేవలం చంద్రబాబును సీఎంను చేయాలన్న ఏకైక లక్ష్యంతో, సీఎం జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న దుగ్ధతో ఈనాడులో అబద్ధాలనే కథనాలుగా అచ్చేస్తున్నారు. తాజాగా విశాఖ – చెన్నై కారిడార్(వీసీఐసీ)పైనా ఇలాంటి విష కథనాన్ని ప్రచురించి మరోసారి అడ్డంగా దొరకిపోయారు. అసలు వాస్తవమేమిటంటే.. ఈ రోజుకు కూడా ఈ కారిడార్లో జరిగిన పనులు 64.82 శాతమే. కానీ, చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికే 78.5 శాతం పనులు పూర్తయిపోయాయంటూ రామోజీ వీరంగం వేశారు. వాస్తవంగా చంద్రబాబు సీఎంగా ఉండగా ఈ కారిడార్లో జరిగిన పనులు 25.70 శాతమే. మిగతా పనులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వం చేసినవే. అదీ కరోనా మహమ్మారి కారణంగా అనేక నెలలు పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత సీఎం జగన్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి, ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసి, త్వరితగతిన పూర్తి చేస్తోంది. ఇవన్నీ పరిశీలించకుండానే రామోజీ విషం కక్కేశారు. విశాఖ – చెన్నై కారిడార్లో మొత్తం 8 ప్రాజెక్టులను రూ.2,629.05 కోట్లతో చేపట్టారు. అందులో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి కేవలం 194.37 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. కానీ రూ.2,459 కోట్లు ఖర్చు చేశామంటూ సిగ్గు ఎగ్గూ లేకుండా ఈనాడులో రాసుకున్నారు. రూ.170 కోట్ల బిల్లుల పెండింగ్లో రాష్ట్ర వాటా కింద రూ.36 కోట్లు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై మరోసారి విషం కక్కారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,082 కోట్లు చెల్లించడమే కాకుండా మరో రూ.1,078.68 కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ జీవోలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. అయినా బాబు గ్రాఫిక్స్ రాజధానిలాగా రామోజీ వీసీఐసీ కారిడార్ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిపోయిందని రాసేసుకున్నారు. కోవిడ్తో తొలి దశ ఆలస్యం వాస్తవంగా వీసీఐసీ మొదటి దశ పనులు 2023 జూన్ 30కి పూర్తి కావాలి. కోవిడ్ మహమ్మారి వల్ల లాక్డౌన్తో కొంత కాలం పనులు ఆగిపోయాయి. ఆ కాలంలో స్వస్థలాలకు వెళ్లిపోయిన కూలీలు తిరిగి రాలేదు. దీంతో పనులు ఆలస్యమయ్యాయి. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) తొలి దశ గడువును మరో ఏడాది అంటే ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.32.61 కోట్లు ఈ నెలాఖరులోగా విడుదల చేస్తోంది. పెండింగ్లో ఉన్న రూ.154.76 కోట్ల విడుదల ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది. అంతేకాదు.. తొలి దశ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఏడీబీ.. రెండో దశ కింద రూ.1,468.12 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులకు రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆమేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. ఆగిపోయిన పనులు తిరిగి మొదలు పెట్టేలా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంటే నోటీసులతో బెదిరిస్తోందంటూ రామోజీ తన వక్రబుద్ధిని చాటుకున్నారు. నాయుడుపేట క్లస్టర్లో 95 శాతం పనులు పూర్తి కాగా మిగిలిన 5 శాతం పనులను లక్ష్యంలోగా పూర్తి చేయనున్నారు. -
భారత్- యూరప్ కారిడార్తో టర్కీకి ఇబ్బంది ఏమిటి? చైనా సాయంతో ఏం చేయనుంది?
ఆమధ్య రాజధాని ఢిల్లీలో జరిగిన జీ-20 సమావేశంలో ఇతర అంశాలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్ణయం భారత్ మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్కు చేరుకునేలా కొత్త కారిడార్ను నిర్మించడం. అమెరికా భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ కారిడార్లో సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ వంటి దేశాల సహకారం చేరింది. ఈ కారిడార్ గేమ్ ఛేంజర్గా, చైనా దూకుడు చూపుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే బీఆర్ఐకి భారత్, అమెరికాల పదునైన సమాధానం అని నిపుణులు అంటున్నారు. అయితే చైనా కంటే ముందు టర్కీ ఈ కారిడార్ విషయంలో టెన్షన్ పడుతోంది. దీంతో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటే ఐఎంఈసీని ఫ్లాప్ చేయడానికి ప్రత్యేక కారిడార్ను నిర్మించాలని యోచిస్తోంది. యూఎస్ నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో టర్కీ సభ్యదేశంగా ఉన్నప్పటికీ, ప్రధాన సమస్యల పరిష్కారం విషయంలో అమెరికాకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. దీనికి కారణం టక్కీ ఇస్లామిక్ దేశం అయినందున దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ పాకిస్తాన్కు సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో ఆయన భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. కార్గో రవాణాలో 40 శాతం సమయం ఆదా వాస్తవానికి ఐఎంఈసీ అనేది భారతదేశం నుండి ఐరోపాకు వస్తువులను రవాణా చేయడానికి మరొక మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్ట్. భారతదేశం, యుఎఇ, సౌదీ అరేబియా, జర్మనీ, ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్, జోర్డాన్ వంటి దేశాలు ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యమయ్యాయి. ఈ కారిడార్ ద్వారా భారతదేశం నుండి జర్మనీకి కార్గో రవాణాలో 40 శాతం సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం భారత సరుకులు షిప్పింగ్ కోసం జర్మనీ చేరుకోవడానికి 36 రోజుల సమయం పడుతుండగా, ఈ కారిడార్ నిర్మాణం తర్వాత ఈ దూరం 22 రోజుల్లో ఈ తతంగం పూర్తి కానుంది. ఇరాక్ మీదుగా కారిడార్ నిర్మించాలని.. ఈ కారిడార్ ఒక మెగా ప్రాజెక్ట్. దీనిలో గల్ఫ్ దేశాలలో రైల్వేల నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భారతదేశ ప్రాముఖ్యతను పెంచే ఈ ప్రాజెక్ట్తో టర్కీకి సమస్య ఏమిటనే విషయానికి వస్తే టర్కీ భౌగోళిక స్వరూపం యూరప్, పశ్చిమ ఆసియా మధ్య ఉంది. ఈ ప్రాజెక్ట్ సిద్ధమైతే మధ్యధరా సముద్ర ప్రాంతంలో టర్కీ ప్రాముఖ్యత తగ్గుతుంది. టర్కీ ఇంతకాలం తాను ఈ ప్రాంతానికి అలెగ్జాండర్గా పరిగణించుకుంటూ వచ్చింది. ఈ ప్రాంతంలోని గ్రీస్, సైప్రస్ వంటి దేశాలతో టర్కీకి శత్రు సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్కు పోటీగా, ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కొత్త కారిడార్ను నిర్మించాలనుకుంటున్నాడు. అయితే ఇది అంత సులభం కాదు. ఇరాక్ మీదుగా 1,200 కి.మీ కారిడార్ను నిర్మించాలని టర్కీ యోచిస్తోంది. ఇందులో హైస్పీడ్ రైలు నెట్వర్క్, రోడ్డు నిర్మాణం ఉండనున్నాయి. దీనికి దాదాపు 17 బిలియన్ డాలర్లు ఖర్చు కానుంది. టర్కీ యోచనకు అనేక అడ్డంకులు అయితే భారత్ను యూరప్కు అనుసంధానించే కారిడార్ ప్రాజెక్టుకు పోటీగా ప్రాజెక్టును సిద్ధం చేయాలన్న టర్కీ యోచనలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో టర్కీ తన మిత్రదేశం చైనాతో జతకట్టి ఐఎంఈసీ కారిడార్ నిర్మాణాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోంది. కాగా ఈ విషయంలో చైనా ఇంకా తన వైఖరిని వెల్లడించలేదు. ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో ఆర్బీఐ ప్రాజెక్ట్ చేపట్టిన చైనా.. భవిష్యత్తులో టర్కీతో చేతులు కలిపి, ఐఎంఈసీ కారిడార్ను దెబ్బతీసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: అక్టోబరు 14 నుంచి మరిన్ని విపత్తులు? -
భూముల కొనుగోళ్లకు టాప్–5 కారిడార్లు
న్యూఢిల్లీ: తెలంగాణలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్పేట, మహారాష్ట్రలోని నేరల్–మాతేరన్, గుజరాత్ లోని సనంద్–నల్సరోవర్ భూములపై పెట్టుబడులకు టాప్–5 కారిడార్లుగా కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. వచ్చే పదేళ్లలో వీటి నుంచి పెట్టుబడులపై ఐదు రెట్ల వరకు రాబడులు రావచ్చ ని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూములను కొనుగో లు చేసే ఇన్వెస్టర్లు.. వాటిని వీకెండ్ హోమ్స్, హాలీడే హోమ్స్, రిటైర్మెట్ హోమ్స్గా అభివృద్ధి చేయడం ద్వారా స్థిరమైన అద్దె ఆదాయం పొందొచ్చని పేర్కొంది. దీనికితోడు పెట్టుబడి సైతం వృద్ధి చెందుతుందని, తద్వారా మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ‘‘భూమి పై పెట్టుబడి పెట్టడం రాబోయే రోజుల్లో బంగారం గనిని వెలికి తీసినట్టే అవుతుంది. మెరుగైన రాబడులకు వీలుగా ఆ భూమిని వినయోగించుకోవడం తెలిస్తే పెట్టుబడి కలిసొస్తుంది’’అని కొలియర్స్ ఇండియా పేర్కొంది. మూడు రెట్లు హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్పేట కారిడార్లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. పెట్టుబడిని భూమి ఎన్నో రెట్లు పెంచగలదని, సరైన రీతిలో వినియోగిస్తే స్థిరమైన ఆదాయానికి వనరుగా మారుతుందని సూచించింది. అద్దె ఆదాయం, పెట్టుబడి వృద్ధి, వ్యాపార కార్యకలాపాల ద్వారా ఇలా ఎన్నో రూపాల్లో ఆదాయం పొందొచ్చని వివరించింది. దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో వచ్చే సూక్ష్మ మార్కెట్లకు రానున్న సంవత్సరాల్లో మంచి డిమాండ్ ఏర్పడుతుందని, స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఇవి మంచి రాబడులు ఇస్తాయని అంచనా వేసింది. -
కల్చరల్ కారిడార్ ఇన్ జీ20 కాన్ఫరెన్స్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement