-
ఆమె వయసు 60.. భర్తకు అనుమానం, నిత్యం వేధింపులు, పక్కా ప్లాన్తో..
సిరిసిల్లక్రైం: వృద్ధాప్యంలోనూ కట్టుకున్న భార్యను అనుమానించాడు. భర్త పదేపదే కొట్టడంతో విసిగిపోయింది. ఎలాగైనా తన భర్తను హతమార్చాలని రూ.రెండు లక్షలకు సుపారీ ఇచి్చంది. గత నెల 13వ తేదీన హత్య జరగ్గా, బుధవారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి చెందిన కనకవ్వ (60), కాశయ్య (65) బతుకుదెరువుకు సిరిసిల్లకు 25 ఏళ్ల క్రితం వచ్చారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కూతుళ్లకు పెళ్లిళ్లు జరగగా, కొడుకు మానసికస్థితి సరిగ్గా లేదు. వృద్ధ దంపతులిద్దరూ సిరిసిల్ల మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తారు. ఈ క్రమంలోనే భార్యపై భర్తకు అనుమానం కలిగింది. పలుమార్లు కనకవ్వను కొట్టాడు. ఆమె భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది. వరుసకు తమ్మునిగా పిలిచే ఒకరికి విషయాన్ని చెప్పింది. భర్తను చంపితే రూ.2లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. గత నెల 13న మద్యం మత్తులో కాశయ్య నిద్రిస్తుండగా, అనుకున్న పథకం ప్రకారం తను సంప్రదించిన వారికి సమాచారం ఇచి్చంది. వారు ఇంటికి చేరుకొని నిద్రలో ఉన్న కాశయ్య గొంతుకు దుప్పటి చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. మృతదేహాన్ని కారులో వేసుకొని సిరిసిల్లలోని మానేరువాగు చెక్డ్యామ్ వద్ద బొందలగడ్డలో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత రూ.2 లక్షలు తీసుకుని వెళ్లిపోయారు. డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చంపడానికి చేసుకున్న ఒప్పందంతోపాటు హత్య చేసిన విధానాన్ని నిందితుల్లో ఒకరు వీడియో తీసినట్టు తెలిసింది. హత్య చేసిన తర్వాత వచి్చన రూ.2లక్షలతో జల్సాలు చేసే సమయంలో మరో రూ.లక్ష కావాలంటూ కనకవ్వను డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే హత్యకు సంబంధించిన వీడియో బయటపెడతామని బెదిరించసాగారు. ఈ తతంగమంతా బయటకు పొక్కింది. దీనిపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్ విచారణ చేపట్టారు. కూరగాయల మార్కెట్ ఏరియాలో నిఘా పెట్టి అనుమానితుల నుంచి సమాచారం సేకరించారు. చివరికి వృద్ధుడి హత్య చేయడానికి సుపారీ తీసుకున్న ఇద్దరు నిందితులతోపాటు మృతుని భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. బొందలగడ్డలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తహసీల్దార్ సమక్షంలో బయటకు తీయించారు. ఈ విషయంపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్ను వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందని, వివరాలు ఉన్నతాధికారుల సమక్షంలో వెల్లడిస్తామని తెలిపారు. -
ఫోన్లో ఎక్సైజ్ కానిస్టేబుల్కు వేధింపులు..
మహబూబ్నగర్: ఓ యాప్ను ఉపయోగించి సెల్ నంబర్ కనిపించకుండా ఎవరికై నా ఫోన్ చేసే అవకాశం ఉంది. ఆ యాప్ను ఉపయోగించి ఉద్యోగినిని తరుచుగా ఫోన్లో వేధిస్తున్న యువకుడిని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన జడ్చర్ల పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ రమేశ్బాబు కథనం ప్రకారం.. జడ్చర్లకు చెందిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలోని మద్యం డిపోలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తన ఫోన్కు ఓ గుర్తు తెలియని ఫోన్ నంబర్తో ఓ వ్యక్తి మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఫోన్ చేసిన ప్రతి సారీ విదేశాల మాదిరిగా కొత్త నంబర్ రావడంతో ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో తెలియని పరిస్థితి. 5 నెలలుగా ఫోన్లో వేధింపులు భరించిన యువతి అపరిచిత వ్యక్తిని ఎలా గుర్తించాలో తెలియని సంకటస్థితిలో మానసిక వేదనకు గురైంది. తాను ఎప్పుడు ఎక్కడ ఉన్న విషయం ఫోన్లో వివరిస్తుండడంతో ఆశ్చర్యం, అయోమయం ఏర్పడింది. అసభ్యంగా మాట్లాడడంతో పాటు తాను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో ఈ విషయాన్ని ఆమె భర్తకు వివరించింది. ఓ సారి భర్త కూడా ఫోన్ వచ్చిన సమయంలో అతనితో మాట్లాడినా అతనిలో మార్పు రాలేదు. ఫోన్లో వేధింపులు ఎక్కువయ్యాయి. మద్యం డిపోలో పనిచేస్తున్న కూలీలను, ఉద్యోగులను అనుమానించినా గుర్తించే పరిస్థితి లేకపోయింది. చివరకు సదరు వ్యక్తికి అనుమానం రాకుండా తాను కూడా ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికింది. పెళ్లి చేసుకుందామని నమ్మించి అతనిని గుర్తించి ఒక్కసారిగా అవాక్కైంది. ఇన్నాళ్లు తనను ఫోన్లో వేధించిన వ్యక్తి తాను పనిచేసే మద్యం డిపోలో హమాలీ నాగరాజుగా గుర్తించడంతో వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి తిమ్మాజీపేటకు బదిలీ చేశామని సీఐ తెలిపారు. -
ఇన్స్టాలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. చివరికి బాలిక తల్లిదండ్రులు వెళ్లి
తిరువొత్తియూరు(చెన్నై): ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన ఓ బాలిక వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమంలో ఉంచుతానని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. కళ్లకురిచ్చి జిల్లా ఊలందూర్పేట ఉలుందాండవర్ ఆలయం వీధికి చెందిన సతీష్ కుమార్ (21)కు తేని జిల్లాకు చెందిన బాలిక (17)తో ఇన్స్ట్రాగామ్లో పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాలికకు మాయ మాటలు చెప్పి ఊలందూరుపేటకు రమ్మని పిలిచాడు. దీంతో ఈ ఏడాది మే 3వ తేదీ అక్కడికి వెళ్లింది. ఇద్దరూ కలిసి తిరిగినట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రులు మే 5వ తేదీ ఊలందూరుపేటకు వెళ్లి సతీష్ కుమార్ వద్ద నుంచి బాలికను తీసుకెళ్లారు. ఈ క్రమంలో బాలిక బంధువులతో మాట్లాడిన సతీష్ కుమార్ రూ.70 వేలు ఇవ్వాలని.. లేకపోతే వీడియోలను, ఫొటోలను సామాజిక మాధ్యమంలో విడుదల చేస్తానని బెదిరించాడు. దీనిపై బాలిక బంధువులు, తల్లిదండ్రులు పెరియకులం మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సతీష్ కుమార్ను గురువారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చదవండి కారు పార్కింగ్ వివాదం.. కర్రతో చితక్కొట్టుకున్న రెండు కుటుంబాలు.. -
షాకింగ్: నటి బ్లాక్మెయిల్.. భరించలేక సూసైడ్ యత్నం
డబ్బు కోసం తమపై ఓ ఎయిర్హోస్టెస్ కమ్ నటి వేధింపులకు పాల్పడటాన్ని భరించలేక.. ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముంబైకి చెందిన ఓ పోర్న్ స్టార్ తమ కుటుంబాన్ని డబ్బు కోసం గత కొంతకాలంగా బ్లాక్మెయిల్ చేస్తోందని, వివాహేతర సంబంధాలున్నాయని తనను బద్నాం చేసి తన కుటుంబానికి నరకం చూపిస్తోందని అషి ఖాన్ అనే వ్యక్తి(ఆ వీడియోలో ఉంది) ఆరోపించాడు. ఈ మేరకు తల్లీ, భార్యతో కలిసి విషం తాగి వీడియో తీసి ఆత్మహత్యకు యత్నించారు. నా పేరు అషి ఖాన్, ఉజ్జయినిలోని లోహె పుల్లో ఉంటున్నాం. ముంబైకి చెందిన రిమ్జిమ్ అనే పోర్న్స్టార్ గత కొంతకాలంగా నాపై వేధింపులకు పాల్పడుతోంది. ముంబైలో ఉన్నప్పుడు ఆమెతో నాకు పరిచయం అయ్యింది. అయితే కొంతకాలానికి ఆమె నాకు షాక్ ఇచ్చింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిపిస్తోంది. ఏం చేయాలో తెలియక.. నా పెళ్లి టైంలో కొంత డబ్బు ఇచ్చాను. మళ్లీ ఇప్పుడు ఇంకా డబ్బు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తోంది. ముంబైలో ఉన్నప్పుడు నాపై రేప్ కేసు పెట్టి జైలుకు పంపింది. ఇప్పుడు.. మళ్లీ పంపుతామని బెదిరిస్తోంది. ఆమె వేధింపులను భరించలేకపోతున్నాం. అందుకే కుటుంబంతో ఆత్మహత్యకు యత్నిస్తున్నాం అని అషి ఖాన్ అందులో పేర్కొన్నాడు. బాధితుడు స్థానికంగా ఓ బట్టల దుకాణం నడుపుతున్నట్లు సమాచారం. ఇక నిందితురాలు రిమ్జిమ్ స్వస్థలం అసోం గువాహతి. ముంబైలో ఎయిర్హోస్టెస్గా పని చేస్తోంది. అయితే.. తరచూ నీలి చిత్రాలు, అడల్ట్ యాప్ సినిమాల్లో నటిస్తూ.. వివాహితులను లక్ష్యంగా చేసుకుని ఆమె డబ్బు గుంజుతోందని తెలుస్తోంది. ఘటన జరిగాక.. బంధువులు అప్రమత్తం అయ్యి స్థానికుల సాయంతో ఆ కుటుంబాన్ని ఆస్పత్రిలో చేర్పించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
వాట్సాప్లో న్యూడ్ కాల్.. బ్లాక్మెయిల్
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన న్యాయవాది మంగేష్కుమార్కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ న్యూడ్ కాల్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడ్డారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఈ నెల 6న ఆయనకు పలుసార్లు వీడియోకాల్ వచ్చింది. మొదట వాట్సాప్లో హాయ్.. హయమ్ శివాని అంటూ చాటింగ్ చేయగా ఆ న్యాయవాది హూ ఆర్యూ అంటూ రిప్లే ఇచ్చాడు. ఆ తర్వాత పలుసార్లు వీడియో కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఎవరో అని లిఫ్ట్ చేస్తే న్యూడ్కాల్ రావడంతో వెంటనే ఆయన కట్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసు పేరిట కాల్ చేసి వారికి డబ్బులు ఇవ్వాలని, లేనట్లయితే కేసు నమోదు అవుతుందని బెదిరించారు. తాను న్యాయవాదినని, కేసు పెడతానని మందలించడంతో మిన్నకుండిపోయారు. ఈ విషయమై సైబర్ క్రైంలో ఈ నె ల 7వ తేదీన ఫిర్యాదు చేసినట్లు బాధితుడు గురువారం విలేకరులకు ఈ విషయం వెల్లడించాడు. చదవండి: (భార్య ఉందని హత్య జాప్యం.. మసూద్ హత్యకు ప్రతీకారంగానే?)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement