తండ్రి కొడుకుల ఘాతుకం...మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి... | Woman's Complaint Against Father And Son At Mysore | Sakshi
Sakshi News home page

తండ్రి కొడుకుల ఘాతుకం...మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి...

Jul 3 2022 8:18 AM | Updated on Jul 3 2022 8:33 AM

Woman's Complaint Against Father And Son At Mysore - Sakshi

మైసూరు: మహిళ స్నానం చేస్తుండగా చాటుగా వీడియోలు తీసి తద్వారా బెదిరింపులకు పాల్పడతున్న తండ్రీ కొడుకుపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెబ్బాలలో సదరు మహిళ ఇంటి పక్కన ఉండే ప్రమోద్, అతని తండ్రి గోవిందరాజు నిందితులు.

బాధితురాలి భర్త పనికి వెళ్ళిన సమయంలో ఇంటి ముందు బాత్‌రూంలో స్నానం చేస్తున్న సమయంలో తండ్రీ కొడుకు కలిసి గుట్టుగా మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశారు. దానిని ఆమె మొబైల్‌ఫోన్‌కు పంపి లైంగికంగా వేధించడంతో పాటు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయసాగారు. దీంతో బాధితురాలు, ఆమె భర్త హెబ్బాల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

(చదవండి: రక్షకుడే భక్షకుడై దారుణకాండ)

Advertisement
 
Advertisement
Advertisement