breaking news
Anna Canteen
-
నాగబాబు పర్యటనలో రసాభాసా.. తీవ్ర ఉద్రిక్తత
కాకినాడ, సాక్షి: ఎమ్మెల్సీగా జనసేన నేత కొణిదెల నాగబాబు తొలి అధికారిక ప్రకటన ఉద్రిక్తతకు దారి తీసింది. గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్ను శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. అయితే ప్రారంభ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ‘‘జై వర్మ’’ అంటూ నినాదాలు చేశారు. దీంతో.. తమ్ముళ్లకు కౌంటర్గా జనసైనికులు జై జనసేన అంటూ కౌంటర్ నినాదాలు చేశారు. నాగబాబు ప్రారంభ హడావిడిలో ఉండగానే కాసేపు ఆ పోటాపోటీ నినాదాల పర్వం కొనసాగింది. దీంతో ఆయన వాళ్ల వంక ఓ లుక్కేసి.. ఏమీ పట్టనట్లు తన కార్యక్రమంలో మునిగిపోయారు. ఈలోపు బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతపరిచే ప్రయత్నం చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ నెగ్గినప్పటి నుంచి టీడీపీ ఇంఛార్జి వర్మకు రాజకీయ ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో.. ఆ మధ్య వర్మ చేసి, ఆపై డిలీట్ చేసిన ఓ పోస్టు తీవ్ర దుమారం రేపింది. ఈలోపు ఈ మధ్య జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ గెలుపునకు ఎవరూ కారణం కాదని.. అలా ఎవరైనా అనుకుంటే వాళ్ల ‘ఖర్మ’ అని నాగబాబు వ్యాఖ్యానించడం దుమారం రేపింది. టీడీపీ కార్యకర్తలు, వర్మ అనుచరులు నాగబాబును సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ తరుణంలో నాగబాబు తాజా పర్యటనలో జరిగిన పరిణామం ఇరు వర్గాల మధ్య విబేధాలను మరోసారి బయటపెట్టింది. -
కడప అన్నా క్యాంటీన్ లో భారీ పేలుడు
-
అన్నా క్యాంటీన్లో భారీ పేలుడు..
సాక్షి, వైఎస్సార్: అన్నా క్యాంటీన్ తయారీ వంటశాలలో భారీ పేలుడు ఘటన సంభవించింది. పేలుడు థాటికి వంటశాల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. భారీ పేలుడుతో కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అయితే, పేలుడు ఘటన బయటకు రాకుండా పచ్చ మీడియా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.వివరాల ప్రకారం.. కడపలో అన్నా క్యాంటీన్ తయారీ వంటశాలలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ వంటశాలలో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పేలుడు సంభవించింది. వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పేలుడు థాటికి వంటశాల షెడ్ ధ్వంసమైంది. 200 అడుగుల మేరా ఎగిరిపడ్డ బాయిలర్, వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి.పేలుడు రాత్రి సమయంలో సంభవించడంతో ప్రాణ నష్టం తప్పింది. వంటలు వండకపోవడం.. సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, భారీ పేలుడుతో కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. పేలుడు ఘటనను ఎవరి కంట పడకుండా పచ్చ నేతలు కప్పి ఫుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. -
అన్నా క్యాంటీన్లకు టీడీపీ రంగులు
-
అన్న క్యాంటీన్లో అపరిశుభ్రత.. వీడియో వైరల్!
పశ్చిమ గోదావరి, సాక్షి: తణుకులోని అన్న క్యాంటీన్లో అపరిశుభ్రమైన నీటితో తినేసిన ప్లేట్లు కడుగుతున్నట్లు ఓ వీడియో నిన్నటి నుంచి వైరల్ అవుతోంది. స్థానిక సొసైటీ రోడ్డులోని అన్న క్యాంటీన్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన సెల్ఫోన్ ద్వారా వీడియో తీసినట్లు తెలుస్తోంది. అన్న క్యాంటీన్లో పేదలు ఉదయం టిఫిన్ తిన్న ప్లేట్లను వాష్ బేసిన్లో వేసి పూర్తి అపరిశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతున్న విషయం ఆ వీడియోలో ఉంది. తినేసిన ప్లేట్లను చేతులు కడుక్కునే వాష్ బేసిన్లో.. నిల్వ ఉన్న మురికి నీటిలో ఉంచి శుభ్రం చేస్తున్న విషయం ఆ వీడియోను చూస్తే అర్థమవుతోంది. #***Rs 5/- Anna Canteen in Tanuku***#This is how the KGF Taliban government treats poor People. Dirty water is used to clean the plates . YEllow goons can go now from HYD to check the quality of food ! @India_NHRC #AndhraPradesh #AnnaCanteen pic.twitter.com/gT9aF5b5uL— Howdy @ Murali Reddy ! ( Jagan కుటుంబం) (@Muralipmr) August 26, 2024 పేదలు తింటున్న అన్నం ప్లేట్లు ఎలా కడిగినా.. ఎవరు చూస్తారులే అనుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మున్సిపల్ కమిషనర్ బీవీ రమణను వివరణ కోరగా తినేసిన ప్లేట్లు సాధారణంగా వాష్ బేసిన్లో వేస్తుంటారని, అయితే ఆ రోజు ఒకేసారి తాకిడి రావడంతో మిగిలిన వ్యర్థాలు వాష్ బేసిన్లో ఉండిపోవడం వల్ల నీరు నిలిచిపోయి ఉండొచ్చని అన్నారు. అక్కడి నుంచి ప్లేట్లు తీసి వేరే చోట కడుగుతారని చెప్పారాయన. లోకేష్ స్పందనఇక తణుకు అన్న క్యాంటీన్ వీడియో వైరల్ కావడంపై ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. అది తప్పుడు ప్రచారమని, ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారని ట్వీట్ చేశారు. -
అన్నా క్యాంటీన్ మోసాన్ని బయటపెట్టిన పెద్దాయన
-
గట్టి ఇడ్లీలు... నూనె కారుతున్న పూరీలు
మదనపల్లె: రాళ్ల లాంటి గట్టి ఇడ్లీలు... నూనె కారుతూ, పచ్చిగా ఉన్నటువంటి పూరీలు.. రుచి పచీ లేని సాంబార్. ఇదీ తొలిరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లె అన్నా క్యాంటీన్లో వడ్డించిన టిఫిన్ మెనూలోని పదార్థాల నాణ్యత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఎన్నికల హామీ నిలబెట్టుకునే క్రమంలో ఆగస్టు 16 నుంచి ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు తొలిరోజే ప్రజలను నిరాశపరిచాయి. రూ.5కే ఇడ్లీ, పూరీ తినవచ్చని ఆశగా వెళ్లినవారు పదార్థాల నాణ్యత, రుచిని చూసి పెదవి విరిచారు. వడ్డించిన పదార్థాల్లో కేసరి స్వీట్ మాత్రమే బాగుందని, మిగిలిన పదార్థాలు చల్లగా ఉండటంతో ఎప్పుడు తయారుచేశారో అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై అన్నా క్యాంటీన్ సూపర్వైజర్ని అడిగితే...తమకు ఆహారపదార్థాలు 115 కిలోమీటర్ల దూరంలోని చిత్తూరుజిల్లా కుప్పం నుంచి వస్తున్నాయన్నారు. అక్కడి నుంచి ఇక్కడకు వచ్చేందుకు కనీసం మూడు గంటల సమయమైనా పడుతుందని చెప్పుకొచ్చారు. భోజనం తినేందుకు ఎంతో ఆశగా, ఆకలితో వచ్చిన పేదలు...ఎర్రటి ఎండలో ముప్పావుగంటకు పైగా క్యూలో నిల్చుని ఎదురుచూశారు. తొలిరోజు అన్నా క్యాంటీన్లో ఆహారపదార్థాల నాణ్యతపై మున్సిపల్ ఆర్డీ పీ.వి.వి.ఎస్.మూర్తి, రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్రాజు పరిశీలించారు.అన్నమే రాలేదుగతంలో 12 గంటలకే మధ్యాహ్న భోజనం పెట్టేవారు. ఇప్పుడు 1 గంట అయినా అన్నం రాలేదు. ఆకలిగా ఉంది. అందుకే వెళ్లిపోతున్నాం. – కృష్ణానాయక్, అనంతపురం -
అన్న క్యాంటీన్లకు పసుపు రంగులు దిద్దిన టీడీపీ
-
అన్నా క్యాంటీన్ కోసం 100 ఏళ్ల వేప చెట్టు నరికేశారు
-
కుప్పంలో టీడీపీ మరో డ్రామా
-
Kuppam: కుప్పంలో టీడీపీ మరో డ్రామా
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ మరో నాటకానికి తెరలేపింది. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆ పార్టీ నేతలు తాత్కాలిక టెంట్లో అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆ తాత్కాలిక టెంట్ ఓ వైపు ఒరిగిపోయింది. కూలిపోయిన టెంట్తో ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. దీంతో మున్సిపల్ సిబ్బంది కూలిపోయిన టెంట్ను ఉదయాన్నే తొలగించారు. దీన్ని కూడా టీడీపీ తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవాలని చూస్తోంది. ఆ టెంపరరీ టెంట్ వర్షంతో కూలిపోవడంతో దాన్ని తొలగించినటు మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. చదవండి: (Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి రేసులో ఎంపీ శశిథరూర్!) -
తమాషా చేస్తే ఇంటికొచ్చి కొడతా
సాక్షి, చిత్తూరు: ‘‘ఏం తమషా చేస్తున్నారా? మీ ఇంటికే వచ్చి కొడతా? వైసీపీ రౌడీలకు ఎక్స్పైరీ డేట్లు అయిపోయాయి. మగాళ్లైతే ఇప్పుడు రండి. రౌడీలు, గూండాలు, ముఠాలు, అణచివేసిన పార్టీ టీడీపీ. నేనూ రోడ్డు మీదకి వస్తా, ఎవరు వస్తారో చూస్తా’’.. అని ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుప్పం బస్టాండ్ ప్రాంతంలోని అన్న క్యాంటీన్ వద్ద గురువారం ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అన్న క్యాంటీన్పై దాడిచేయడం పేదలపై దాడి చేయడమేనన్నారు. తన హయాంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇచ్చానని.. వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు. దాడులు చేసిన వారిని పోలీస్స్టేషన్కు కాకుండా ఇంటికి పంపడం దారుణమన్నారు. కుప్పంలో జరిగింది ఏమిటో డీజీపీ వచ్చి చూడాలని డిమాండ్ చేశారు. కొల్లుపల్లిలో తన మీటింగ్ దగ్గరికి వచ్చి జెండాలు ఎగరేస్తారా? ఎంత కొవ్వు, ఎంత కండకావరం? అని చంద్రబాబు మండిపడ్డారు. తన ఇంటి గేటుకు తాళాలు వేసి, తాళ్లు కట్టారని, ఎయిర్పోర్టులోనూ అడ్డుకున్నారని, కోర్టు నిలదీస్తే డీజీపీ తలదించుకున్నారని తెలిపారు. మరోవైపు.. తన ఇంటికొచ్చిన రౌడీలకు ప్రమోషన్ ఇచ్చి మంత్రులు చేశారని ఆయన చెప్పారు. 40 ఏళ్లల్లో ఎందరినో చూశానని.. కరుడుకట్టిన నేరస్తుడు సీఎం అయ్యారంటే తప్పు వ్యవస్థదా, ప్రజాస్వామ్యానిదా? అని ప్రశ్నించారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోరాడతామని ఆయన చెప్పారు. టీడీపీ వారికి ఏమైనా అయితే అది పోలీసుల హత్యేనన్నారు. కొట్టినా, కేసులు పెట్టినా భయపడేది లేదని, వెనక్కిపోయే సమస్యేలేదన్నారు. ప్రజలే ముందుకు రావాలి.. ఇక తనను కుప్పానికి రాకుండా కుట్రలు పన్నుతున్నారని.. తాను సంకల్పం చేస్తే ప్రాణాలను సైతం లెక్కచేయనని చంద్రబాబు అన్నారు. ప్రాణాలు, ఆస్తులు, మానాలు కాపాడుకోవాలంటే ప్రజలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ వాళ్ల జోలికొస్తే వారి ఇంటికి వేల మందితో తాను వస్తానన్నారు. ధైర్యంగా ఉండండని, ప్రైవేటు కేసులు వేస్తామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఏ రోజు ఎవరిని కొడతారో తాడోపేడో తేల్చుకోవడానికే ఇక్కడకు వచ్చానని.. తాను పిలుపిస్తే కుప్పానికి రెండు లక్షల మంది వస్తారన్నారు. -
'ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు'
సాక్షి, తూర్పుగోదావరి : శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హెచ్చరించారు. తునిలో శుక్రవారం జరిగిన ఆందోళనకారుల దాడిలో అన్నక్యాంటీన్ ద్వంసమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఏర్పడ్డ అన్నక్యాంటీన్లు అవినీతిమయంగా మారాయని, టీడీపీకి చేందిన వారే క్యాంటీన్లను ద్వంసం చేసి దానిని ప్రభుత్వం మీదకు నెట్టివేస్తున్నారని ఆరోపించారు. -
‘నువ్వు తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తాం’
సాక్షి, పశ్చిమ గోదావరి : రూ. 10 లక్షలు ఖర్చు అయ్యే అన్నా క్యాంటీన్ల వ్యయాన్ని రూ. 35 లక్షలకు పెంచి టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు దోచేశాడని రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ ఆరోపించారు. ‘‘నువ్వ తిన్న అవినీతి సొమ్ము మొత్తాన్ని కక్కిస్తాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక అర్హత రామానాయుడుకు లేదంటూ మండిపడ్డారు. ఆరు నెలలు అన్నా క్యాంటీన్ డబ్బులు చెల్లించకుండా గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. -
రాష్ట్రంలో 183 అన్నాక్యాంటీన్లు ఉన్నాయి
-
టీడీపీ వాళ్లు ప్రచారానికి వాడుకున్నారు
-
అవును.. ఆయనేం పట్టించుకోరు..!
సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): ఎన్నికల సమయంలో కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతున్న ఎమ్మెల్యే స్వామి.. ఈ ఐదేళ్లలో ఆయన దగ్గరకు వచ్చిన ఏ సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవు. సమస్యను పరిష్కరించాలని ఆయన చుట్టూ ప్రదిక్షణలు చేసినా ఫలితం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితారామయ్య శ్రేష్టి సత్రంపై అంతులేని నిర్లక్ష్యం.. సింగరాయకొండలో అయితారామయ్య శ్రేష్టి అనే ఆర్యవైశ్యుడు యాత్రికుల కోసం పట్టణ నడిబొడ్డులో సుమారు 1.50 ఎకరా స్థలంలో సత్రం, వ్యాపార సముదాయాన్ని నిర్మించి వాటిపై వచ్చే ఆదాయంతో యాత్రికులకు వసతులు కల్పించే ఏర్పాటు చేశాడు. తరువాత ఈ సత్రం ఎండోమెంటు శాఖ పరమైంది. సత్రం స్థలంలో ఉన్న దుకాణదారులకు, ఎండోమెంట్ శాఖకు మధ్య అద్దె విషయంలో వివాదం చెలరేగింది. దీంతో ఎండోమెంట్ శాఖ 2013 ఏప్రిల్లో సత్రం స్థలంలోని వ్యాపార సముదాయాన్ని కూల్చేశారు. అప్పటివరకు వ్యాపార కూడలికి నిలయంగా మారిన ఆ సత్రం ప్రస్తుతం మల మూత్ర విసర్జనకు నిలయంగా మారింది. దీంతో ఏటా లక్షలాది రూపాయలను అద్దెల రూపంలో నష్టపోతున్నారు. ఈ సత్రం విషయమై న్యాయం చేయాలని ఆర్యవైశ్యులు కాళ్లు అరిగేటట్లు తిరగ్గా న్యాయం చేస్తానన్న ఎమ్మెల్యే ఐదేళ్లు కాలయాపన చేశారు. గతంలో ఈ సత్రం స్థలంలో 42 దుకాణాలు ఉండగా మరో 24 దుకాణాలకు 2013 సంవత్సరం వేలం పాటలు నిర్వహించారు. తరువాత వివాదం కారణంగా వేలంపాటలు రద్దయ్యాయి. సత్రం శిథిలావస్థకు చేరిందన్న నెపంతో అందులోని షాపులను దేవాదాయ శాఖ అధికారులు కూల్చేశారు. అయితే దుకాణదారులు 24 మంది తరువాత మాకు న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. వీరికి న్యాయం చేస్తారన్న ఆశతో ఆర్యవైశ్యులు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఐదేళ్లు గడిచినా ఎటువంటి ప్రయోజనం లేదు. పెరిగిన షాపుల బాడుగలు.. సత్రం స్థలంలోని వ్యాపారసముదాయాన్ని కూల్చేయడంతో గ్రామంలో షాపులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో అప్పటి వరకు రూ.3 వేలు ఉన్న షాపుల అద్దెలు ఒక్కసారిగా రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగాయి. దీనికితోడు సత్రం స్థలం ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందన్న సాకుతో సుమారు 9 నెలల క్రితం సత్రం స్థలం చుట్టూ సుమారు రూ.30 వేల అంచనా వ్యయంతో దేవస్థాన అధికారులు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. లక్షలాది రూపాయలు నష్టపోతున్న దేవాదాయశాఖ.. గ్రామ నడిబొడ్డున ఉన్న ఈ సత్రానికి ఒక పరిష్కారం చూపించి అందులో దుకాణాలు నిర్మిస్తే దేవాదాయశాఖకు ఇప్పటి వరకు షాపుకు సరాసరి 6 వేల రూపాయలు అద్దె వచ్చినా సుమారు రూ.2.60 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సత్రం స్థలంలో దుకాణాలు నిర్మించినట్లయితే అటు దేవాదాయశాఖకు ఇటు ప్రజలకు ఉపాధి లభించేదని, కానీ ప్రస్తుతం రెంటికి చెడ్డ రేవడిగా ఎవరికి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా మారాయని ప్రజలు అటు దేవాదాయశాఖ, ఇటు నాయకుల పనితీరును విమర్శిస్తున్నారు. అడ్డగోలుగా అన్నా క్యాంటీన్ నిర్మాణం.. కందుకూరు రోడ్డు సెంటర్లో విలువైన స్థలాలను ఆర్యవైశ్యులు కొనుగోలు చేశారు. వారు తమ స్థలంలో షాపులు నిర్మించుకుంటున్నారు. ఈ స్థలం ముందు ఆర్అండ్బీకి చెందిన స్థలం ఉంది. ఈ స్థలంలో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. దీనిపై ఆర్యవైశ్యులు ఎంత వేడుకున్నా ప్రయోజనం లేదు. చివరికి ఎన్నికల తేది ప్రకటించడంతో తాత్కాలికంగా అన్నా క్యాంటిన్ నిర్మాణం ఆపేశారు. పార్కును కూల్చేశారు.. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఉన్న పంచాయతీ స్థలంలో శికాకొల్లు సుబ్బారావు అనే పారిశ్రామికవేత్త ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పార్కును నిర్మించాడు. తరువాత ఈ పార్కును తొలగించి అందులో షాపులు నిర్మిద్దామని ఎమ్మెల్యే స్వామిపై పంచాయతీ అధికారులు ఒత్తిడి తెచ్చారు. కానీ మొదట్లో ససేమిరా అన్నాడు. తరువాత ఏమైందో ఏమో గానీ రోడ్ల అభివృద్ధి పేరుతో పార్కును తొలగించి ఆ స్థలంలో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు సైకిల్ స్టాండు నిర్మించారు. ఈ పార్కు వల్ల బాటసారులకు ఉపయోగంగా ఉండటమే కాక పండగ సమయంలో ఆర్యవైశ్యులు ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగంగా ఉండేది. మండలంలో రూర్బన్ నిధులతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పార్కులు నిర్మిస్తుండగా ఈ విధంగా దాతల సహాయంతో నిర్మించిన పార్కును పడగొట్టడమేందని ప్రశ్నిస్తున్నారు. -
అన్నదానం కాదు..
సాక్షి, శ్రీకాకుళం : ఈ ఫొటోలో మీకు కన్పించేంది అన్నదాన కార్యక్రమమో.. శుభకార్యంలో ఏర్పాటు చేసిన భోజనాలు అనుకుంటే మనం పొరపడినట్లే. ఎన్నికలు సమీపించడంతో ప్రభుత్వం పలుచోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. అయితే అక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ పరిస్థితి ఇలా ఉంది. దీంతో తినడానికి వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. -
రచ్చకెక్కిన టీడీపీ విభేదాలు
పశ్చిమగోదావరి , జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవం కార్యక్రమం బుధవారం రసాభాసగా మారింది. స్థానిక వారపుసంత సమీపంలో నగర పంచాయతీ కార్యాలయ నూతన భవన సమీపంలో అన్నక్యాంటిన్ భవన నిర్మాణం చేపట్టినా ఇంకా పూర్తికాలేదు. అయితే ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల షెడ్యూల్ గురువారం వస్తుందని భావించిన టీడీపీ నేతలు హడావుడిగా అన్నక్యాంటిన్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల షెడ్యూల్, వెనువెంటనే సాధారణ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావించిన నేతలు ఇక అన్న క్యాంటిన్ తమ హయాంలో ప్రారంభించే అవకాశం లేదని భవన నిర్మాణం పూర్తికాకపోయినా హడావుడిగా శిలాఫలకాన్ని ఏర్పాటుచేశారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే పీతల సుజాత హాజరయ్యారు. అయితే శిలాఫలకంపై ఒక్క కౌన్సిలర్ పేరు మాత్రమే ఉండటంతో మిగిలిన టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహించి ప్రారంభోత్సవానికి ముందే శిలాఫలకాన్ని తొలగించారు. తమ పేర్లు లేకుండా అన్న క్యాంటిన్ ప్రారంభించేది లేదని భీష్మించారు. దీంతో ఎమ్మెల్యే సుజాత స్వపక్ష కౌన్సిలర్లను శాంతింపచేసే ప్రయత్నాలు చేశారు. చివరకు కౌన్సిలర్లు పెకిలించిన శిలాఫలకాన్ని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరింపచేసి రాత్రి సమయంలో హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
‘అన్నా’ ఇదేం క్యాంటీన్?
తూర్పుగోదావరి , కొత్తపల్లి (పిఠాపురం): ప్రభుత్వ స్థలానికి బదులు పేదలకు కేటాయించిన స్థలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఉప్పాడలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఉప్పాడలోని చంద్రబాబు ఫిషర్మెన్ కమిటీ భవనం వద్ద ఎరిపల్లి తాతారావు, ఎరిపల్లి లక్ష్మణరావు, ఎరిపల్లి రాంబాబులకు 2002 జనవరి 8న ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేశారు. ఈ స్థలంలో అన్న క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఆదివారం ప్రయత్నించారు. వారిని పట్టాదారులు అడ్డుకున్నారు. ఒక దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు, అధికారుల తీరును నిరసిస్తూ గ్రామ మాజీ సర్పంచ్, లబ్ధిదారుల తల్లి అప్పలకొండ కుటుంబ సభ్యులతో కలిసి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించింది. వారికి వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు మాట్లాడుతూ, ప్రైవేటు స్థలంలో అన్న క్యాంటీన్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. పంచాయతీలోని ప్రధాన కూడళ్లలో ప్రభుత్వ స్థలాలుండగా, పట్టాలిచ్చిన స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించడం అధికార పార్టీ అహంకారానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ తన ప్రయత్నాలు మానుకోవాలన్నారు. పట్టాదారులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. బాధితులకు మద్దతు తెలిపిన వారిలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, ఎంపీటీసీ సభ్యులు తోటకూర మారెమ్మ, ఉమ్మిడి జాన్, తొమ్మండ్ర సురేష్, సీహెచ్ ప్రసాద్, జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, శేషుకుమారి తదితరులున్నారు. -
ఏపీ అధికారుల అత్యుత్సాహం..!!
సాక్షి, వైఎస్సార్ కడప : అధికార పార్టీ అండతో ఏపీ ప్రభుత్వాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రొద్దుటూరు బస్టాండ్లోని దుకాణాలను కూల్చి అన్నా క్యాంటీన్ నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా, ప్రొద్దుటూరు బస్టాండ్లో అన్నా క్యాంటీన్ నిర్మాణం చేపట్టొద్దంటూ మున్సిపల్ కౌన్సిల్ గతంలోనే తీర్మానం చేసింది. దుకాణాలు కూల్చి క్యాంటీన్ నిర్మించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ విషయంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆందోళన కూడా చేపట్టారు. దీంతో క్యాంటీన్ నిర్మాణంపై వెనక్కి తగ్గిన అధికారులు టీడీపీ నేతల ఒత్తిడితో మరోమారు క్యాంటీన్ నిర్మించేందుకు సమాయత్తం కావడం చర్చనీయాంశమైంది. -
అన్నా క్యాంటీన్లో వ్యభిచార బాగోతం!
సాక్షి, హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురంలోని అన్నా క్యాంటీన్లో వ్యభిచార బాగోతం బట్టబయలు అయ్యింది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అన్నా క్యాంటీన్లో రాత్రి వేళల్లో వ్యభిచారం జరుగుతోందన్న ఆరోపణలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. కాగా శనివారం రాత్రి వాచ్మెన్ జయరాం ఓ మహిళతో రాసలీలలు జరుపుతుండగా స్థానికులు పట్టుకున్నారు. అనంతరం మీడియాకు సమాచారమిచ్చారు. అన్నా క్యాంటీన్ మేనేజర్ కృష్ణా, వాచ్మెన్ జయరాంలను మీడియా ప్రతినిధులు నిలదీయటంతో వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వటం పలు అనుమానాలకు తావిస్తోంది. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చినా కనీసం విచారించకుండానే అందర్నీ వదిలేయటం చర్చనీయాంశంగా మారింది. -
నిమ్మల X అంగర
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: పాలకొల్లు తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోడ్డెక్కాయి. పార్టీ సీనియర్ నేత తొండెపు దశరథ జనార్దన్ సాక్షిగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహనరావు బూతులు తిట్టుకున్నారు. నీ బతుకు నాకు తెల్సంటే... నీ బతుకు నాకు తెల్స ని దూషించుకున్నారు. నీ సొంత ఊర్లో వంద ఓట్లు కూడా వేయించలేవు. నీకు రెండోసారి ఎమ్మెల్సీ ఇవ్వడమే దండుగ అంటూ ఎమ్మెల్సీ అంగర రామమోహనరావుపై నిమ్మల రామానాయుడు విరుచుకుపడ్డారు. ఈ వివాదానికి పాలకొల్లులోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం వేదికగా మారింది. దీంతో టీడీ జనార్ధన్ ఇరువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న విషయానికి రోడ్డెక్కడం ఏంటని, రేపు మాట్లాడుకుందామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే... పాలకొల్లు పట్టణంలో శుక్రవారం సాయంత్రంఅన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత టి.డి జనార్ధన్ హాజరయ్యారు. ముందుగా క్యాంటీన్ వద్ద రోడ్డుపై సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశం అనంతరం టి.డి జనార్ధన్ వెళ్లి పోతుండగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆయన్ను సాగనంపేందుకు కూడా వెళ్లారు. జనార్ధన్ కారు ఎక్కుతుండగా ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ వెళ్లి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిపై ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో తాను కట్టించిన ఫ్లెక్సీలను తీయించి వేశారని, ఇదేం పద్ధతని చెబుతుండగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జోక్యం చేసుకోవడంతో ఇరువురి మధ్య వివాదం ముదిరింది. తాను ముందు నుంచి పార్టీలో ఉంటున్నానని అంగర చెబుతుండగా అయితే ఏంటి నేను ఇక్కడ ఎమ్మెల్యేని అని నిమ్మల సమాధానం ఇచ్చారు. దీంతో నీ బతుకు నాకు తెలుసు, నీ అంత బోకు లేడంటూ ఒకరిపై మరొకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో వందల కోట్లు అవినీతి చేశాడని ఎమ్మెల్సీ అంగర ఆరోపించగా, గత ఎన్నికల్లో నువ్వు ఎవరికి పనిచేశావో తెలుసులే, నీ సొంత ఊర్లో వంద ఓట్లు వేయించడం చేతకాలేదంటూ ఎమ్మెల్యే ప్రత్యారోపణ చేశారు. ఒకదశలో అసభ్య పదజాలంతో దూషించుకోవడంతో జనార్ధన్ జోక్యం చేసుకుని ఇరువురిపై ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫ్లెక్సీల తొలగింపే కారణం అధికార పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వివాదానికి ఫ్లెక్సీల తొలగింపు కారణంగా మారిందని సమాచారం. ప్రచారానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రజాప్రతినిధుల్లో జిల్లాలో నిమ్మలదే పైచేయి. బీసీ నాయకుడిగా, వరుసగా జిల్లాలో రెండవసారి ఎమ్మెల్సీ అయిన అంగర రామమోహన్ వివాదరహితునిగా ఉంటారు. టీడీ జనార్ధన్ పాలకొల్లు వస్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ అంగర పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద, లాకు సెంటర్ వద్ద రెండు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసి దగ్గరుండి అ రెండు ఫ్లెక్సీలను ఎమ్మెల్యే నిమ్మల తొలగించారని అంగర వర్గం ఆరోపిస్తోంది. వివాదాలకు దూరంగా ఉండే ఎమ్మెల్సీ అంగర తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే తీరుతో విసుగు చెందిన ఎమ్మెల్సీ అన్న క్యాంటీన్ సమావేశం తర్వాత తన ఆవేశాన్ని, ఆవేదనను వెళ్లగక్కారు. ఈ సమావేశంలో కూడా ఆయన అసహనంగా, అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. -
అన్న క్యాంటీన్లో...భోజనం ఇంతేనా!
విజయనగరం రూరల్: తెలుగుదేశం ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్ పథకంలో ప్రజలకు చాలీచాలని భోజనం వడ్డిస్తున్నారు. కార్మికులు, రోజూ కూలీలు, పట్టణాలకు వివిధ అవసరాల మీద వచ్చే ప్రజలు ఈ క్యాంటీన్లలో భోజనం చేద్దామని వెళ్తే కడుపు నింపని భోజనంతో పథక నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 5లకే భోజనం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు వారి ఇంట్లో సొమ్ము ఏమైనా తీసుకువచ్చి పెడుతున్నారా? అని ప్రజలు మండిపడుతున్నారు. కడుపు నింపని భోజనం పెట్టే బదులు పూర్తిగా పెట్టకుండా ఉంటే బాగుంటుందని పేర్కొంటున్నారు. విజయనగరం పట్టణంలో నెల రోజుల కిందట అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా, మున్సిపల్ కార్యాలయం సమీపం ప్రకాశం పార్కు వద్ద వీటిని నిర్వహిస్తున్నారు. ఘోషా ఆసుపత్రి వద్ద మరో క్యాంటీన్ ప్రారంభించాల్సి ఉంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం వడ్డించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో నాలుగు వందల గ్రాముల భోజనం వడ్డీంచాల్సి ఉండగా అతి తక్కువుగా వడ్డిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. పెరుగు 75 గ్రాములు అందించాల్సి ఉండగా మజ్జిగకు ఎక్కువ, పెరుగుకు తక్కువుగా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా చాలీచాలని అన్నం పెట్టి అర్థాకలితో సరిపెట్టేస్తున్నారని కార్మికులు, ప్రజలు పేర్కొంటున్నారు. ఉదయం అంతా పనిచేసుకుని వచ్చి కప్పు అన్నం ఏమి సరిపోతుందని ప్రశ్నిస్తే మీరిచ్చే రూ.5లకు అదే ఎక్కువని సిబ్బంది కసురుకుంటున్నారని వారు వాపోతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఏదో చేసేస్తున్నామన్న ప్రచారం కోసమే క్యాంటీన్లు నిర్వహిస్తున్నారని ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ప్రజల సొమ్ముతో నిర్వహించే పథకానికి కడుపునిండా అన్నం పెట్టకపోతే ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. చాలీచాలని భోజనానికి గంటల తరబడి వరుస నిలబడాల్సి వస్తుందని పేద, కార్మికులు పేర్కొంటున్నారు. నేలపైనే భోజనాలు రోజుకు కేవలం మూడు వందల మందికే భోజనాలు అందించే అన్న క్యాంటీన్లు వద్ద భోజనం చేసేందుకు సరిపడా కుర్చీలు, బల్లలు లేకపోవడంతో భోజనం చేసేవారు నేలపై అపరిశుభ్ర వాతావరణంలో భోజనాలు చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్ వద్ద ఆరుబయట స్థలం ఎక్కువుగా బెంచీలు ఏర్పాటు చేసుంటే బాగుంటుందని పేర్కొంటున్నారు. -
అన్న క్యాంటీన్లో అరకొర భోజనం
కర్నూలు (టౌన్): ఐదు రూపాయలకే కడుపు నిండా నాణ్యమైన భోజనం అందిస్తామంటూ టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లు అందరి ఆకలి తీర్చడం లేదు. అసలు భోజనం టోకెన్ పట్టాలంటేనే గంటకుపైగా నిరీక్షించాల్సిన పరిస్థితి. అప్పటికీ అందరికీ టోకెన్లు ఇస్తారన్న గ్యారంటీ లేదు. దీంతో చాలా మంది క్యూలో నిల్చొని కూడా టోకెన్ అందక వెనక్కు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. అధికారం చేపట్టిన తర్వాత నాలుగేళ్లు పట్టించుకోకుండా ఉండి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎట్టకేలకు పథకాన్ని పట్టాలెక్కించింది. అయితే డిమాండ్ మేరకు కాకుండా ప్రచారం కోసమే అన్నట్లు కొనసాగిస్తుండడం గమనార్హం. అందరికీ కాకుండా కొద్ది మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి మిగతా వారిని వెనక్కు పంపుతున్నారు. దీంతో అందరికీ కడుపు నిండా భోజనం అంటే ఇదేనా అని జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది అన్నారు.. నాల్గింటితో సరిపెట్టారు.. కర్నూలు మున్సిపాల్టీకి 8 అన్న క్యాంటీన్లు మంజూరు చేసిన ప్రభుత్వం నాల్గింటిని మాత్రమే గత జూన్లో ప్రారంభించింది. ఉల్చాల రోడ్డు, కల్లూరు ఇండస్ట్రియల్ ఏరియా, పాతబస్టాండ్, కలెక్టరేట్ వద్ద క్యాంటీన్లు నడుస్తున్నాయి. తక్కువ ధరకే భోజనం కావడంతో తినేందుకు జనం క్యూ కడుతున్నా నిర్వాహకులు కొందరికి మాత్రమే టోకెన్లు ఇచ్చి అయిపోయాయంటూ వెనక్కు పంపుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టోకెన్లు ఇచ్చిన వారికి కూడా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని తెలుస్తోంది. టిఫిన్కు ఇడ్లి తప్ప ఏమీ ఉండడం లేదు. మూడొందల మందికే టోకెన్లు.. అన్న క్యాంటీన్లలో డిమాండ్కు తగ్గట్టు టిఫిన్ కానీ, భోజనం కాని అందడం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. పాతబస్టాండ్, కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన క్యాంటీన్లకు పేదల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. అందరికీ టోకన్లు అందుతాయన్న గ్యారంటీ లేకపోవడంతో పేదలు గంట ముందే వచ్చి క్యూ కడుతున్నారు. అయితే క్యూలైన్లో నిలిచి ఉన్నా అందరికీ టోకెన్లు రావడం లేదు. దీంతో గంటలకొద్ది క్యూలో నిల్చున్న వారు చివరకు టోకెన్ అందక వెనక్కు వెళ్తుండడం గమనార్హం. అన్నం చాల్లేదు.. బంధువులు ఆసుపత్రిలో ఉంటే చూసేందుకు వచ్చిన. మధ్యాహ్నం రూ.5 ఇచ్చి భోజనం చేసిన. అన్నం తక్కువగా పెట్టడంతో కడుపు నిండలేదు. –సరోజమ్మ, బుధవారపేట గంటకు పైగా నిల్చున్నా.. కలెక్టరేట్లో పని ఉండి వచ్చిన. రూ. 5కే భోజనం పెడతారంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి క్యూలో నిల్చున్న. టోకెన్ తీసుకుని కూర్చుంటే కొంచెం అన్నం, కొంచెం పప్పు, అరస్పూన్ చట్నీ, కూరగాయ ఇస్తున్నారు. రెండు టోకెన్లు ఇస్తే కానీ అన్నం కడుపు నిండదు. – రాముడు, ఎమ్మిగనూరు టోకెన్లు ఇవ్వడం ఆలస్యమవుతోంది.. ప్రతి ఒక్కరినీ కంప్యూటర్లో ఫొటో తీసి టోకెన్ ఇస్తున్నారు. దీంతో ఆలస్యమవుతోంది. మధ్యాహ్నం గంటకు పైగా క్యూలో ఉండాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలు అంతసేపు నిల్చోలేకపోతున్నారు. మరొకరిని నియమించి టోకెన్లు త్వరగా ఇస్తే పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. –నాగరాజు, నందికొట్కూరు -
టోపీ ఉంటే టోకెన్ ఇవ్వం
నరసరావుపేట టౌన్: ‘నారా హమారా–టీడీపీ హమారా’ పేరుతో ఎన్నికల వేళ ఓట్ల కోసం సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు సర్కారు నిజ స్వరూపం తేటతెల్లమైంది. ఆయన పాలనలో ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్ష మరోసారి బయటపడింది. నమాజ్ చేసే టోపీ ధరిస్తే అన్న క్యాంటీన్లో భోజనం పెట్టబోమంటూ వృద్ధుడైన ఓ నిరుపేద ముస్లింను గెంటివేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు పూటలా నమాజ్ చేస్తానన్న గాలిబ్.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదతురకపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గాలిబ్సాహెబ్ రెండు రోజుల క్రితం భోజనం చేసేందుకు సత్తెనపల్లి రోడ్డులోని కోడెల స్టేడియం వద్ద ఉన్న అన్నక్యాంటీన్కు వెళ్లాడు. టోకెన్ కోసం క్యూలో నిలబడగా తలపై ఉన్న టోపీని తొలగించాలని కౌంటర్లో ఉన్న సిబ్బంది పేర్కొన్నారు. గాలిబ్సాహెబ్ ఇందుకు నిరాకరిస్తూ తాను నిత్యం అల్లాను స్మరిస్తూ ఐదు పూటలా నమాజ్ చేస్తానని, టోపీ తీయడం సరికాదని బదులిచ్చాడు. సెల్ నంబరు చెప్పాలని సిబ్బంది సూచించగా తాను 70 ఏళ్ల వయసులో రోజువారీ కూలీకి అరటికాయల వ్యాపారం చేస్తుంటానని, తనకు సెల్ లేదని, అది ఎలా వాడాలో కూడా తెలియదని తెలిపాడు. అయితే భోజనం టోకెన్ ఇచ్చేది లేదంటూ బయటకు వెళ్లాలని క్యాంటీన్ నిర్వాహకులు ఆయన్ను ఆదేశించారు. తాను 1983 నుంచి టీడీపీ కార్యకర్తనని, ప్రభుత్వం పేదల కోసం అన్న క్యాంటీన్ నిర్వహిస్తుంటే భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టడం ఏమిటంటూ గాలిబ్ సాహెబ్ అభ్యంతరం తెలపడంతో సెక్యూరిటీ గార్డును పిలిచి బలవంతంగా గెంటేశారు. గాలిబ్సాహెబ్ తనకు జరిగిన ఈ అవమానం గురించి విలేకరులకు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. -
అన్న క్యాంటీన్లలోనూ బొజ్జ నింపుకున్నారు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల అవినీతి పర్వానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చివరకు అన్న క్యాంటీన్ల ఏర్పాటులోనూ కక్కుర్తి పడుతున్నారు. పెద్ద పెద్ద ప్రైవేటు హోటళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు కాకుండా అడ్డుకుంటున్నారు. ఇందుకోసం సదరు హోటళ్ల యాజమాన్యాల నుంచి భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. కర్నూలు ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్యార్డులో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని మొదట నిర్ణయించారు. మార్కెట్కు జిల్లా నలుమూలల నుంచి వచ్చే రైతులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావించారు. అదేవిధంగా రోగులను చూసేందుకు వచ్చే బంధువుల సౌకర్యార్థం పెద్దాస్పత్రిలోనూ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అయితే, ప్రైవేటు హోటళ్ల యాజమాన్యాలతో అధికార పార్టీ నేతలు చేతులు కలిపారు. కుంటిసాకులు చూపుతూఅన్న క్యాంటీన్లు ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారు. మార్కెట్యార్డులో స్థలం లేదని, ఆసుపత్రిలో పారిశుద్ధ్య సమస్య వస్తుందనే నెపంతో క్యాంటీన్లు రద్దు చేయించడం గమనార్హం. ఊరికి దూరంగా... ప్రస్తుతం అన్న క్యాంటీన్లు రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఊరికి దూరంగా ప్రైవేటు హోటళ్లు ఎక్కువగా లేని ప్రాంతాలను ఎంపిక చేస్తున్నారు. కర్నూలులో ఏకంగా ఉల్చాల గ్రామానికి వెళ్లే దారిలో వీకర్ సెక్షన్ కాలనీ సమీపాన ఏర్పాటు చేశారు. ఇక్కడికి పెద్దగా వచ్చే వారు కూడా ఉండరు. ఇక కలెక్టర్లో క్యాంటీన్ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఉల్చాల దారిలో క్యాంటీన్ నిర్మాణ పనులు సగం కూడా కాకముందే ప్రారంభించిన అధికారులు.. కలెక్టరేట్లో మాత్రం ప్రారంభించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తద్వారా ఇక్కడ ప్రైవేటు హోటళ్లకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ముఖ్యనేతలు క్యాంటీన్ల నిర్మాణంలో భారీ అవినీతికి పాల్పడడమే కాకుండా.. వాటి కోసం ప్రాంతాల ఎంపికలోనూ స్వార్థానికి ఒడిగట్టడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రారంభించిన క్యాంటీన్లలో రోజూ చాలామంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. అన్నం అయిపోయిందంటూ నిర్వాహకుల నుంచి సమాధానం వస్తోందని వారు పెదవి విరుస్తున్నారు. కమీషన్ల కోసమే.. ప్రైవేటు హోటళ్ల వారు ఇచ్చే కమీషన్ల కోసమే మార్కెట్యార్డులో అన్న క్యాంటీన్ రద్దు చేశారు. రైతులు అసలే దూరాభారం నుంచి వ్యయ ప్రయాసలకోర్చి మార్కెట్కు సరుకు తెస్తున్నారు. ఒక్కోసారి రోజంతా ఇక్కడే ఉండాల్సి వస్తోంది. మూడు పూటలా బయట తినాలంటే రూ.300 వరకు ఖర్చు వస్తుంది. అదే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఖర్చు చాలావరకు తగ్గుతుంది. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వెంటనే ఏర్పాటు చేయాలి. – ఈరన్న, కోడుమూరు -
నాకు అన్యాయం జరిగితే బాధ్యత చంద్రబాబుదే
-
హవ్వ.. అన్న క్యాంటీన్లు!
‘పావలా కోడికి ముప్పావలా మసాలా’ అన్నట్టు ఉంది ప్రభుత్వం నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ల తీరు. ఐదు రూపాయలకే భోజనం, అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఇవి అవినీతికి ఆలవాలంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటినిర్మాణానికి భారీ అంచనాలు రూపొందించి నిధుల విడుదల చేసిన ప్రభుత్వం కమీషన్లు దండుకోవడానికి తెర తీసిందని జనం చర్చించుకుంటున్నారు. అమలాపురం టౌన్: అన్న క్యాంటీన్ భవన నిర్మాణాలు సొమ్ములు ఎక్కువ సోకులు తక్కువ అన్నట్టుగా ఉన్నాయి. అధిక అంచనాలతో భవనం కోసం వెచ్చించిన వ్యయం అనుమానాలకు తావిస్తోంది. కేవలం రెండు సెంట్ల లోపు స్థలంలో అన్న క్యాంటీన్ భవనాన్ని ఏకంగా రూ.36 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. రాష్ట్రమంతా ఒకే డిజైన్తో..ఒకే అంచనా వ్యయంతో వీటిని రూపొందిస్తున్నారు. భవన నిర్మాణాలను కూడా ప్రభుత్వం తమకు కావా ల్సిన కొన్ని కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించింది. అన్న క్యాంటీన్లు నిర్మిస్నున్న స్థలం విస్తీర్ణం 83.33 గజాలు. అదే రెండు సెంట్ల స్థలమంటే 96.44 గజాలు. 83.33 గజాల స్థలాన్ని ఇంజనీరింగ్ పరిభాషలో 750 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణం అంటారు. ఇంత చిన్న స్థలంలో రూ.36 లక్షల వ్యయంతో భవవ నిర్మాణమంటే అంత వ్యయం అవసరమా..? అనే ప్రశ్న..సందేహం ఎవరికైనా కలుగుతాయి. లే అవుట్స్లో నాలుగు లేదా అయిదు సెంట్ల భూమిలో అన్ని హంగులతో ఇల్లు నిర్మించుకుంటే రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ వ్యయమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అన్న క్యాంటీన్లు కేవలం రెండు సెంట్ల స్థలంలో నిర్మించే భవనం కోసం రూ.36 లక్షల వ్యయం అవసరమా...? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. క్యాంటీన్ సదుపాయాలన్నీఆ వ్యయంలోనే అంటున్న అధికారులు అన్న క్యాంటీన్ నిర్మాణ వ్యయంగా నిర్దేశించిన రూ.36 లక్షలతో భవన నిర్మాణంతో పాటు భవనం పూర్తయ్యాక అందులో క్యాంటీన్కు అవసరమైన పొయ్యిలు, భోజనాలు చేసేందుకు అవసరమైన ఫర్నీచర్, పాత్రలు తదితర వ్యయాలన్నీ అందులోనే ఉంటాయని అధికారులు వివరణ ఇస్తున్నారు. నాలుగు లేదా అయిదు సెంట్ల భూమిలో ఏదైనా లే అవుట్ స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారు రూ.30 నుంచి రూ.40 లక్షల వ్యయంలోనే భవన నిర్మాణ ఖర్చులతో పాటు ఎలివేషన్, ఇంటిరీయర్ డెకరేషన్, ఆల్టెక్, గ్రానైట్, మార్బుల్తో రెండు బెడ్ రూమ్లతో ఇల్లు పూర్తి చేయడం గమనార్హం. జిల్లాలో రెండు నగరాలు, ఏడు పట్టణాల్లో 14 అన్న క్యాంటీన్లు నిర్మించేందుకు రంగం సిద్ధం అయింది. కాకినాడలో అయిదు, రాజమహేంద్రవరంలో రెండు, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పిఠాపురం, సామర్లకోట, ముమ్మిడివరం, గొల్లప్రోలులో ఒక్కొక్కటి వంతున ఈ క్యాంటీన్లు నిర్మించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటి వరకూ రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో చెరో రెండు మొత్తం నాలుగు అన్న క్యాంటీన్ల భవనాలు పూర్తయి ప్రారంభమయ్యాయి. కాకినాడ నగరంలో ఇంకా మూడు క్యాంటీన్లు, మూడు మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో క్యాంటీన్ల నిర్మాణానికి అవసరమైన రెండు సెంట్ల స్థలాలను అక్కడి పాలకవర్గాలు ఇంకా చూపించలేకపోయాయి. అమలాపురం మున్సిపాలిటీలో అయితే ఇప్పటికే రెండుచోట్ల ఎంపిక చేసిన స్థలాలు వివాదాస్పదమయ్యాయి. మాకు ఇక్కడ అన్న క్యాంటీన్ వద్దు అంటూ వ్యతిరేకత, అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మూడో ప్రయత్నంగా అధికారులు స్థల అన్వేషణలో పడ్డారు. రాష్ట్ర స్థాయిలోనే అన్న క్యాంటీన్ల భవనాల నిర్మాణ అంచనాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అదే తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహా క్యాంటీన్ల నిర్మాణం సమంజసమైన అంచనా వ్యయాలతో...ఎకానమీ కోణంలో ఉన్నాయని అంటున్నారు. కేవలం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు మించని వ్యయాన్ని ఏకంగా రూ.36 లక్షల అధిక అంచనాలతో రూపొందించింది అందిన కాడికి దోచుకోవడానికే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాధనం దోచుకోవడానికి పక్కా వ్యూహంతో అన్న క్యాంటీన్ల నిర్మాణాల పరంపర సాగుతోందని ప్రైవేటు సివిల్ ఇంజనీర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. -
మార్చురీ పక్కన అన్నా క్యాంటీన్పై తీవ్ర విమర్శలు
-
హంగూ..ఆర్భాటాలకే టీడీపీ సర్కార్ పెద్దపీట
-
‘అన్న’మో రామచంద్రా!
అనంతపురం న్యూసిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లో పేదలకు సరిపడ భోజనం దొరకడం లేదు. అల్పాహారమైనా, భోజనమైనా ఐదు రూపాయలకే అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా డిమాండ్ మేరకు ఆహారం అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. అనంతపురంలోని బళ్లారి బైపాస్ సర్కిల్లో ఆదివారం అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి, మేయర్ స్వరూప ప్రారంభించారు. ప్రారంభించి 24 గంటలు కాకముందే క్యాంటీన్లో అన్నం దొరక్క ప్రజలు అవస్థలు పడటం చర్చనీయాంశమైంది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకే క్యాంటీన్లో భోజనం అయిపోయింది. దీంతో ప్రజలు నిర్వాహకులను నిలదీశారు. కనీసం 200 మందికి కూడా భోజనం పెట్టకుండా ఏవిధంగా అయిపోయిందంటూ ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ‘అన్నా క్యాంటీన్’ను పరిశీలించారు. ప్రజలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. నిర్వాహకులు 12 గంటలకే భోజనం ఏర్పాటు చేశామని, గంటలోనే 300 మందికి ఇచ్చామని సమాధానం చెప్పారు. మెనూ బోర్డులో ఉదయం 7.30 నుంచి 10 గంటలు, మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటలు, డిన్నర్ 7.30 నుంచి 9.00 గంటలలోపు భోజనాలు అందజేస్తారని ఉంది. అయితే మధ్యాహ్నం 12 గంటలకే ఎందుకు ప్రారంభించామని చెప్పారో అర్థం కావడం లేదు. ఇంటి నుంచి తీసుకురాలేదు రోజూ బయట తినాలంటే రూ.40 ఖర్చు అయ్యేది. అన్నా క్యాంటీన్లో రూ. 5కే భోజనం ఇస్తామని చెప్పారు. చాలా సంతోషమేసింది. తక్కువ ధరకే భోజనం చేయవచ్చనుకున్నా. ఇక్కడ చూస్తే మధ్యాహ్నం 1.30 గంటలకే అయిపోయిందన్నారు. – కొండమ్మ, చిరు వ్యాపారి బోర్డు చూసి షాక్ అయ్యా అన్నా క్యాంటీన్లో రూ.5కే మంచి భోజనం పెడుతున్నారని విన్నా. ఎంతో ఆశతో ఇక్కడి వచ్చా. తీరా చూస్తే అయిపోయిందని బోర్డు తిప్పేశారు. ప్చ్ ఏం చేద్దాం. మాలాంటోళ్లకు మామూలే కదా? – రామకృష్ణ తాగుబోతులకు అడ్డా అన్నా క్యాంటీన్ తాగుబోతులకు అడ్డాగా మారుతోంది. క్యాంటీన్ ఎదురుగా వైన్ షాపు ఉంది. కొందరు మద్యం తాగి నేరుగా క్యాంటీన్లో భోజనం కోసం వస్తున్నారు. ఉదయం ఓ వ్యక్తి పూటుగా మద్యం తాగి క్యాంటీన్లోనే పడుకున్నాడు. చివరకు సిబ్బంది మోసుకుని బయటకు పంపారు. -
మరోసారి అడ్డంగా బుక్కైన చంద్రబాబు
సాక్షి, అమరావతి : దేనినైనా మసిపూసి మారేడు కాయ చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. బాబు చేసేది గోరంత చెప్పుకొనేది కొండంత. ఇందులో ఆయనకు ఉన్న అనుభవం ముందు ఎంతటి వారైనా దిగదుడుపే. కేంద్ర సంక్షేమ పథకాలను సైతం ప్రభుత్వం పేరు చెప్పుకొని ప్రచారం చేసుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఇటీవల ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన పథకాన్ని చంద్రన్న భీమా పేరుతో ప్రమోట్ చేసుకోవాలని ప్రయత్నించిన చంద్రబాబు అడ్డంగా బుక్కైపోయారు. తాజాగా ప్రచార బాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి దొరికిపోయారు. విషయం ఏంటంటే అన్న క్యాంటీన్ పేరుతో ఇటీవల చంద్రబాబు నాయుడు కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు. అయితే ప్రారంభించిన రెండో రోజునే ఆహారం లేదంటూ కొన్ని చోట్ల క్యాంటీన్లను మూసివేశారు. మరికొన్ని చోట్ల ఆకలి తీర్చుకుందామని వచ్చిన పేదలపై తెలుగుదేశం నాయకులు జులుం చూపించారు. పట్టెడు మెతుకుల కోసం వచ్చిన వారిపై నిర్థాక్ష్యణ్యంగా దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. అయితే చేసిన గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకొనే చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రమోట్ చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఆయన చేసిన అసలు ఘనత బయటపడింది. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాలుగు రూపాయలకే భోజనం అంటూ రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు రూపాలయకే నాణ్యమైన భోజనం పేదలకు అందించాలనే లక్ష్యంతో ఆళ్ల ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఆ సందర్భంగా రాజన్న క్యాంటీన్ దగ్గర కడుపు నింపుకుంటున్న కొన్ని ఫొటోలను ఫేస్బుక్లో పోస్టు చేశారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను ప్రమోట్ చేసుకోవడానికి ప్రచార మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చారు. ఆ చిత్రంలో కొంత మంది పేదలు భోజనం చేస్తున్న ఫొటోలను కూడా పొందు పరిచారు. కానీ వాటిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన రాజన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఫొటోలను ఉపయోగించుకున్నారు. దీన్ని గ్రహించిన సోషల్ మీడియా కార్యకర్తలు చంద్రబాబు పనితీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రచారం తప్ప పనిలేదని మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రచార చిత్రాలను పరిశీలించండి పై చిత్రం 11-07-2018 రోజున ప్రచార మధ్యమాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన. ఇందులో బ్లూకలర్లో ఉన్న వృత్తాన్ని పరిశీలించండి. ముగ్గురు వ్యక్తలు భోజనం చేస్తున్నారు. ఇప్పుడు కింద ఉన్న మరో చిత్రాన్ని పరీక్షించండి. ఈ ఫొటో 14-05-2017 రోజున మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన రోజున ఫేస్బుక్లో చేసిన పోస్ట్. ఈ ఫొటోనే చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ప్రచార చిత్రంగా వాడుకుంది. -
అన్నం లెక్కల్లో తిరకాసు!
పేదవాడికి కడుపునిండా నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని రాష్ట్రప్రభుత్వం అంటోంది. కేవలం రూ.5 నామమాత్రపు ధరకు అల్పాహారం, భోజనం సరఫరా చేస్తున్నామని, ఇందుకోసం కోట్లాది రూపాయలు సబ్సిడీ భారం మోస్తున్నామని ఆర్భాటం చేస్తోంది. క్యాంటీన్ల నిర్మాణంలోనే పెద్దఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. కాగా ఇప్పుడు నిర్వాహకులు అధికారులు కూడబలుక్కొని తప్పుడు లెక్కలతో భారీ అవినీతికి తెరలేపుతున్నారనే అనుమానాలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. క్యాంటీన్ల నిర్వహణలో పారదర్శకత లోపించడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. కడప సెవెన్రోడ్స్: మూడు రోజు ల క్రితం జిల్లాలోని కడప, ప్రొద్దుటూరులో ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెడుతున్నారు. ఒక్కోపూట 500 మంది చొప్పున రోజుకు 1,500 మందికి ఆహారం సరఫరా చేస్తున్నామని కడప మున్సిపల్ కమిషనర్ లవన్న అంటున్నా రు. అయితే క్యాంటీన్లో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం పూటకు 300మందికి మాత్రమే ఆహారం సరఫరా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇలా అధికారులు, సిబ్బంది చెబుతున్న మాటలకు పరస్పరం పొంతన లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సిబ్బంది చెబుతున్న విధంగా పూటకు 300 చొప్పున రోజుకు మూడు పూటల కలిపి 900మందికి టిఫెన్లు, భోజ నాలు సరఫరా చేసి 1,500మందికి సరఫరా చేసినట్లు బిల్లులు చూపి ఆ మేరకు ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసే అవకాశం లేకపోలేదని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. టొకెన్లు కనిపించవ్! ప్రజలు డబ్బు చెల్లించినపుడు ఎలాంటి టోకెన్లు ఇవ్వకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. ఇలా డబ్బు తీసుకుని అలా పేపర్ ప్లేట్లు ఇచ్చేస్తున్నారు. ఇందువల్ల ఖచ్చితత్వం లోపిస్తోంది. ఒక వ్యక్తి మూడు పూటలా తింటే క్యాంటీన్ నిర్వాహకులకు రూ.25 ఖర్చు వస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో వ్యక్తిపై రూ.60 సబ్సిడీ నిర్వాహకులకు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక ఒక్కో వ్యక్తి మూడు పూటలా చెల్లించే రూ.15లను కలిపితే రూ.75లు వస్తుంది. ఇందులో క్యాంటీన్ నిర్వాహకులకు అయిన రూ.25 ఖర్చును తీసి వేస్తే రూ.50 ఉంటుంది. భోజనం రవాణా, నిర్వహణకు మరో రూ.10 వేసుకున్నా రూ.40 నికరంగా మిగులుతుంది. మూడు పూటలా కలిపి 600 మందిని అధికంగా చూపెడితే రూ.24వేలు మిగులుతుంది. అంటే రోజుకు 900 మందికే ఆహారం సరఫరా చేస్తూ 1,500 మందికి చేశామని దొంగ లెక్కలు రాసుకోవడం ద్వారా రోజుకు రూ.24వేలు నొక్కేస్తున్నారు. ఒక కౌంటర్..భారీగా క్యూ అవకతవకలకు అవకాశం లేకుండా క్యాంటీన్ నిర్వహణ పారదర్శకంగా జరగాలంటే కంప్యూటర్ బిల్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలంటున్నారు. ఇందువల్ల రోజుకు ఎంతమంది క్యాంటీన్లో భోజనం చేస్తున్నారో స్పష్టంగా తెలిసిపోతుంది. క్యాంటీన్కు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. అయితే ఒక కౌంటర్ మాత్రమే ఉండడంతో చాలాసేపు క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. కనుక రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తే సౌలభ్యంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాగునీరు లేక అవస్థలు కడప జెడ్పీ ఆవరణంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లో తాగునీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. భోజనం చేస్తున్న సమయంలో గొంతు పట్టుకుంటే అందుబాటులో నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. నామమాత్రపు ధరకే భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం తాగునీటి విషయాన్ని పట్టించుకోకపోవడం సబబు కాదంటున్నారు. క్యాంటీన్ ఆవరణంలో పారిశుద్ధ్యం కూడా లోపించింది. అన్నం ప్లేట్లు ఇష్టానుసారంగా పడేసి ఉండడం కనిపించింది. చేతులు కడుక్కునే నీళ్లే తాగునీరు క్యాంటీన్లో సమస్యల గురించి మున్సిపల్ కమిషనర్ లవన్నను ‘సాక్షి’ వివరణ కోరింది. ఇందుకు ఆయన బదులిస్తూ పూటకు 500 మందికి ఆహారాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. క్యాంటీన్లో ప్రజలు చేతులు కడుక్కుంటున్న నీళ్లనే తాగాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డీఈని నియమించామని చెప్పారు. అన్న పేరు చెడగొట్టవద్దు పేదవాడికి తక్కువ ధరకే అన్నం సరఫరా చేయడం మంచిదే. క్యాంటీన్కు వచ్చిన వారు భోజనం లభించక వెనుదిరిగి పోయే పరిస్థితి వద్దు. నిర్వహణలో పారదర్శకత పాటించడం ద్వారా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలి. ఎన్టీఆర్ పేరు చెడగొట్టవద్దు. – కొండూరు జనార్దన్రాజు, కడప నిర్ణీత సమయమంతా భోజనం పెట్టాలి ఉదయం టిఫెన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశిత వేళలను ప్రకటించింది. ఆ సమయాల్లో ఎంతమంది వచ్చినా భోజనం పెట్టాలి. అలాకాకుండా మేం ఇంతమందికి మాత్రమే పెడతామనడం సరైంది కాదు. ప్రతిరోజు చాలామంది భోజనం లభించక వెనుకదిరిగిపోతున్నారు. – ఎన్.వెంకట శివ, సీపీఐ నగర కార్యదర్శి, కడప -
అన్నా క్యాంటీన్ల అంచనాలు పెంచి కోట్లు కొట్టేశారు
-
అన్న క్యాంటీన్లలో అన్నం కొరత
ఏలూరు (మెట్రో) : పేదవాడి ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకునే నాయకులు నిర్వహణలో విఫలమవుతున్నారు. కొద్ది మందికే టిఫిన్, భోజనం పెట్టి మమ అనిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు అన్నక్యాంటీన్లు మూడురోజుల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తే జిల్లాలోని తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాలు, ఏలూరు నగరంలో జిల్లా నాయకులు అట్టహాసంగా ప్రారంభించారు. అయితే అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం అందించాల్సి ఉంది. ఈ మూడు ఒక్కోటి రూ.5 చొప్పున అందించాల్సి ఉంది. ఊకదంపుడు ఉపన్యాసాలు క్యాంటీన్లు ప్రారంభించే సమయంలో ఊకదంపుడు ప్రసంగాలు చేసిన నాయకులు ఒక మనిషి రోజుకు ఉదయం అల్ఫాహారంతో పాటుగా రెండు పూటలా భోజనం చేయాలంటే రూ.73 ఖర్చు అవుతుందని, అన్న క్యాంటిన్లో కేవలం రూ.15 చెల్లించి ఉద యం, మధ్యాహ్నం, రాత్రికి పేదోడు కడుపు నింపుకోవచ్చునని ప్రకటించారు. ఒక్కో మనిషికి రాష్ట్ర ప్రభుత్వం రూ.58 సబ్సిడీ భరించి పేదోడికి మూడు పూటలా కడుపునింపుతుందని చెప్పుకొచ్చారు. వాస్తవ దూరం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడు క్యాంటీన్లలో మధ్యాహ్నం 12.30 గంటలకే భోజనం అయిపోయిందనే సమాధానం వస్తుంది. రూ.5కే భోజనం ఆశించి కిలో మీటర్ల దూరం నుంచి కాలినడకన వెళ్లే పేదోడికి భోజనం లేదనే సమాధానం వినిపిస్తుంది. శుక్రవారం జిల్లా కేంద్రమైన ఏలూరులో ఇదే సమాధానం ఎదురైంది. దీంతో భోజనం తిందామని వచ్చిన పేదలు ఆగ్రహంతో వెనుతిరిగారు. ప్రచారానికే క్యాంటీన్లు ఏర్పాటు చేశారని పేదవాడు పెదవి విరుస్తున్నాడు. భీమవరం, తాడేపల్లిగూడెంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. అన్న క్యాంటీన్లు ప్రచార ఆర్భాటమే భీమవరం: జిల్లాలో అన్న క్యాంటీన్ల పేరుతో మధ్యతరగతి, పేదలను మోసం చేస్తున్నారని కేవీపీఎస్ డెల్టా జిల్లా కార్యదర్శి కారుమంచి క్రాంతిబాబు మండిపడ్డారు. గురువారం భీమవరంలోని అన్న క్యాంటీన్లను ఆయన పరిశీలించారు. రెండు రోజుల క్రితం ప్రారంభించిన క్యాంటీన్ల వద్ద సరైన సదుపాయాలు లేవని, గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుందని దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. కొద్దిమందికే అల్పాహారం, భోజనం అందించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. క్యాంటీన్ల వద్ద సదుపాయాలు కల్పించి నిత్యం ఒక్కో క్యాంటీన్ వద్ద వెయ్యి మందికి భోజనం, టిఫిన్ అందించాలని క్రాంతిబాబు డిమాండ్ చేశారు. ప్రచారం కోసమేనా ప్రచారం కోసం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పేదోడి కడుపు నింపుతానని చెప్పారు. ఇదేనా నింపడం అంటే. కనీసం మధ్యాహ్నం 12.30 గంటలకే భోజనం అయిపోయిందని చెబుతున్నారు. కుటుంబం లేని వాడి పరిస్థితి ఏమిటి.– వెంకటేశ్వరరావు, స్థానికుడు, ఏలూరు నాకు ఎవరూ లేరు నేను కుటుంబం లేని పేదవాడిని. ఐదు రూపాయలకే భోజనం అంటే వచ్చాను. ఇక్కడ భోజనం లేదని చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం. ఆశతో వచ్చాను. భోజనం లేదని చెబితే నా పరిస్థితి ఏమిటి. – అశోక్, స్థానికుడు, ఏలూరు -
అన్న క్యాంటీన్లో ఉద్రిక్తత
-
అన్న క్యాంటీన్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, ఎమ్మిగనూరు : అన్నక్యాంటీన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకుంది. సామాన్య ప్రజలపై మున్సిపల్ కమిషనర్ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో గురువారం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం రావడంతో సిబ్బంది కంట్రోల్ చేయలేకపోయ్యారు. దీంతో కమిషనర్ వచ్చిన వారిపై అసహనం వ్యక్తం చేశారు. భోజనం చేయడానికి వచ్చిన వారిపై మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి చేయి చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ తీరును జనం తప్పుబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అన్న క్యాంటీన్లను ప్రారంభించి విషయం తెలిసిందే. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాబు వస్తున్నారని బార్కు ముసుగేశారు!
భవానీపురం (విజయవాడ పశ్చిమ) : విద్యాధరపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డులోని రాగమయి బార్ అండ్ రెస్టారెంట్ బోర్డుకు ముసుగు వేశారు. బార్ పక్కనే ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ను బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నందున ఆయనకు కనబడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తగా బార్కు రెండు వైపులా పేరుతో ఉన్న బోర్డుకు ముసుగు వేయించేశారు. బుధవారం మాత్రం మద్యం దుకాణాన్ని మూసివేయాల్సిందిగా అధికారులు బార్ యజమానిని హెచ్చరించటంకూడా జరిగింది. కాగా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీకి వెళ్లిన సందర్భంలో కాలనీకి వెళ్లే రోడ్డు ప్రారంభంలో ఒక వైన్ షాపు ఉండటాన్ని గమనించి ఆ వైన్ షాప్ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఆ తరువాత జిల్లాకు చెందిన మంత్రి ఒకరు దానిని పునఃప్రారంభించేలా లాబీయింగ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందుగానే అన్న క్యాంటిన్ పక్కనే ఉన్న బార్ను చంద్రబాబుకు కనబడకుండా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. -
అన్నా.. ఏమిటీ క్యాంటీన్లు!
సాక్షి, కాకినాడ : పేదలకు తక్కువ ధరకే భోజనం అందించే లక్ష్యంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ వాటికి సంబంధించిన పనులు మాత్రం నత్తను తలపిస్తున్నాయి. కాకినాడ నగరంలోని పలుచోట్ల అన్న క్యాంటీన్ల కోసం రూ.లక్షలు ఖర్చు చేసి, కంటైనర్ తరహాలో ప్రత్యేక ఇనుప బాక్సులు తయారు చేయించారు. కానీ వాటిని ఇప్పటివరకూ వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో అవి తుప్పుపట్టి పాడైపోతున్నాయి. అసలే కాకినాడ సముద్రతీరాన ఉండడంతో ఉప్పుగాలికి ఇనుము మరింత వేగంగా పాడైపోతోంది. నగరంలోని వెంకట్నగర్, సాంబమూర్తినగర్, వీర్కమల్, జగన్నాథపురం, పీఆర్ కళాశాల రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్లు ఏడాది కాలంగా ఇలాగే దర్శనమిస్తున్నాయి. వీటిని ఎప్పటికి వినియోగంలోకి తెస్తారో వేచి చూడాలి. – ఫొటోలు : సతీష్కుమార్ పేపకాయల, సాక్షి, కాకినాడ -
మందుబాబులకు భలే మంచి చౌకబేరం!
ప్రజావసరాలను అనుగుణంగా పాలకులు పాలన చేయాలి. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. పేదలు నివసించే ప్రాంతాల్లో తక్కువ ధరకే భోజనం అందించేందుకు ప్రభుత్వం రూపొందించిన అన్నక్యాంటీన్లను పేదలు లేని ప్రాంతాల్లో ఏర్పాటుచేసి పథక లక్ష్యాలను విస్మరిస్తున్నారు. భవానీపురం ఆర్టీసీ వర్క్షాపు రోడ్డులో ఓ బార్ పక్కన ఏర్పాటుచేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. భవానీపురం: ‘భలే మాంచి చౌక బేరం..మించినన్ దొరకదూ...’ మందుబాబులారా త్వరపడండి అన్నటుగా ఉంది త్వరలో ప్రారంభించనున్న అన్న క్యాంటీన్ను చూస్తుంటే. బార్లో తాగి హోటల్కెళ్లి తినాలంటే చాలా ఎక్కువైపోతుంది. ఎంచక్కా బార్ పక్కనే అన్న ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటుచేస్తున్న క్యాంటీన్కు వెళ్లి ఐదు రూపాయలకే శుభ్రంగా లాగించేయవచ్చు. మందు ఎక్కువై అడుగులు తడబడి అన్న క్యాంటీన్ ముందున్న అవుట్ఫాల్ డ్రెయిన్లో పడిపోతామన్న భయం లేదు. డ్రెయిన్పై బారున చప్టా కట్టేశారు. మందు ఎక్కువైతే దానిపైనే ఓ కునుకు తీయవచ్చు. ఇదీ గట్టు వెనుక ప్రాంతం విద్యాధరపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డులో ప్రారంభానికి సిద్ధం అవుతున్న అన్న క్యాంటీన్పై స్ధానికులు వేస్తున్న చలోక్తులు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ల తరహాలో ఆంధ్రప్రదేశ్లోకూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు నామమాత్రపు ధరకు టిఫిన్, భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉద్దేశ్యం మంచిదే అయినా క్యాంటీన్ ఏర్పాటుకు గట్టు వెనుక ప్రాంతంలో ఎన్నుకున్న ప్రదేశాలపైనే విమర్శలు వస్తున్నాయి. ఐరన్ యార్డ్, హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ వంటి ప్రదేశాలలో అయితే అక్కడి ముఠా కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి సరుకు కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులు, చిరువ్యాపారులకు సదుపాయంగా ఉంటుంది. గొల్లపూడి బైపాస్ రహదారిపై అయితే ఆ మార్గంలో ప్రయాణించేవారికి హోటల్స్ లేవు కాబట్టి వారికి సదుపాయంగా ఉంటుంది. అంతేగానీ ఖాళీగా స్థలాలు ఉన్నాయి కదా అని ఉపయోగం లేని ప్రదేశాలలో ఏర్పాటు చేయడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డులో పోలీస్ కాలనీ లేఅవుట్లో కామన్ సైట్ (కాలనీవాసుల ప్రయోజనార్థం)గా వదిలిన ప్రదేశంలో క్యాంటీన్ ఏర్పాటుపై తొలుత కాలనీవాసులు అభ్యంతారాలు వ్యక్తం చేశారు. ఓపెన్ సైట్లపై తమకు అధికారం ఉందని నగరపాలక సంస్థ అధికారులు వారి అభ్యంతరాలను పక్కన పెట్టి యుద్ధప్రాతిపదికన క్యాంటీన్ నిర్మిస్తున్నారు. పైగా ఒక బార్ అండ్ రెస్టారెంట్ పక్కనే నిర్మించడంపై బార్లో పూటుగా తాగి పక్కనే ఉన్న క్యాంటీన్లో ఏదో ఒకటి తినేయవచ్చని స్థానికులు జోకులు వేసుకుంటున్నారు. రెస్టారెంట్లో తినేందుకు అయ్యే ఖర్చుతో అదనంగా మరికొంత మద్యం సేవించి క్యాంటీన్లో తక్కువ ఖర్చుతో భోజనం చేయవచ్చని మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆర్టీసీ వర్క్షాప్, టైర్షాప్, డిపోలు ఉన్నప్పటికీ వారికి లోపల క్యాంటీన్లు ఉండటంతో వారు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. నివాసాలు, గోడౌన్లు, దుకాణాలు ఉన్న ఈ రోడ్డులో వారెవరూ అన్న క్యాంటీన్కు వచ్చే అవకాశం లేదు. భవానీపురం హౌసింగ్బోర్డు కాలనీలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ పక్కన మరొక క్యాంటీన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడికికూడా ప్రజలు వచ్చే అవకాశం లేదు. లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డులో రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన నిర్మాణాన్ని ప్రభుత్వం ఎల్ అండ్ టి సంస్థకు అప్పగించింది. అయితే క్యాంటీన్ చుట్టూ ప్రహరి, క్యాంటీన్ ముందున్న అవుట్ఫాల్ డ్రెయిన్పై శ్లాబ్తో ఫుట్పాత్ నిర్మాణాన్ని నగరపాలక సంస్థకు అప్పగించింది. భారీ అవుట్ఫాల్ డ్రెయిన్పై దాదాపు వంద మీటర్లకుపైగా శ్లాబ్ వేసి ఫుట్పాత్గా తయారుచేశారు. దీనిని లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేయడమేమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో అభివృద్ధి పనులు చేయమంటే కార్పొరేషన్ అప్పుల్లో ఉందని మొత్తుకునే మేయర్ కోనేరు శ్రీధర్, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఇవి కనిపించవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
గూడు చెదిరిపోయే..గుండెలదిరిపాయే!
కందుకూరు అర్బన్: కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు నిరంకుశ పాలన పరాకాష్టకు చేరింది. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది అన్న క్యాంటీన్ పేరుతో పేదల పొట్టకొట్టారు. పట్టణంలోని పాత చేపల మార్కెట్ వద్ద ఉన్న బంకుల తొలగింపుపై వారం రోజులుగా రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారం మున్సిపల్ కమిషనర్ కె.అనూష పోలీసు బలగాలతో బంకుల తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే బంకులు తొలగించాలని కమిషనర్ను కోరారు. అన్న క్యాంటీన్కు అవసరమైన స్థలం పోను మిగిలి ఉన్న ఫుట్పాత్పై, లేదా గుండం కట్టపై బంకులు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయినా కమిషనర్ పట్టించుకోలేదు. ముందు ఖాళీ చేయాల్సిందేని ఒత్తిడి చేయడంతో కనీసం ఐదు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే సమయం మించి పోయిందంటూ కమిషనర్ తక్షణమే బొంకులు తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. అన్యాయం..అక్రమం అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల నుంచి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసుకుని నెలనెలా బిల్లులు కట్టడంతో పాటు 20 కుటుంబాలు మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నా ఎందుకు పేదల పొట్టకొడుతున్నారని అధికారులను నిలదీశారు. క్యాంటీన్ 10 గదుల్లో నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలున్నా ప్రైవేటు వ్యక్తులకు స్థలాన్ని ధారాదత్తం చేయడం కోసం బంకులు తొలగించడం భావ్యం కాదన్నారు. కొంత సమయం ఇస్తే బంకులు తొలగిస్తామని చిరువ్యాపారులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నాయకులు అధికారులను నిలదీశారు. ఆందోళనకు దిగిన గౌస్, బాలకోటయ్య, రఫీతో పాటు మరి కొంతమందిని ఆరెస్టు చేసి పొన్నలూరు పోలీసుస్టేషన్కు తరలించారు. ఆ తర్వాత జేసీబీలతో బంకులు గుల్ల చేసి బయటకు తరలించారు. స్థలం చూట్టూ కంచె నిర్మించారు. బంకుల్లో ఉన్న సామగ్రి కూడా తీసుకొనే సమయం ఇవ్వకుండా తొలగించడంతో రోడ్డున పడ్డామని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్టేసింది ఇందుకేనా? బాధితులు తమకు జురిగిన అన్యాయంపై మండిపడుతున్నారు. బంకులు తొలగించొద్డని ఎమ్మెల్యేను కలిసి వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. ఆయనకు ఓట్లేసింది ఇందుకేనా అని నిలదీస్తున్నారు. వెంటనే బంకుల నిర్వాహకులకు నష్టపరిహారం చెల్లించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో యాసిన్, జిలానీ, మాజీ కౌన్సిలర్ ఖాదర్బాషా ఉన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు గణేషం గంగిరెడ్డి, పంది కోటేశ్వరరావు, తన్నీరు రమేష్, నగళ్ల నారయ్య, సుల్తాన్, జహీంగీర్బాషా, జె.కోటేశ్వరరావు, సీపీఐ నాయకులు బి.సురేష్బాబు పాల్గొన్నారు. -
ఫలించిన పోరాటం
ప్రొద్టుటూరు టౌన్ : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న దీక్ష ఎట్టకేలకు ఫలించింది. చిరు వ్యాపారులైన పేదలపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాన్ని నిలువరించారు. గత ఐదు రోజులుగా ప్రొద్దుటూరు పాతబస్టాండులో చిరువ్యాపారులతో కలిసి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి దీక్ష చేపట్టారు. అన్న క్యాంటిన్ ఏర్పాటు పేరుతో పాతబస్టాండ్లో ఉన్న రెండు మున్సిపల్ దుకాణాలను, బస్షెల్టర్ను అక్కడ వ్యాపారాలు చేస్తున్న 30 మందిని ఖాళీ చేయాలంటూ మున్సిపల్ అధికారులు నెల రోజులుగా బెదిరిస్తున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యాపారులు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వెనుతిరిగి వెళ్లారు. మరల దుకాణాలను తొలగించాలంటూ కొలతలు వేసి భయాందోళనకు గురి చేశారు. దీనిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే పాతబస్టాండ్కు వెళ్లి చిరువ్యాపారులకు అండగా నిలిచారు. వరదరాజులరెడ్డి చెప్పినట్లు చేస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. ఐదు రోజుల క్రితం.. మున్సిపల్ కమిషనర్ ఐదు రోజులక్రితం పాతబస్టాండ్లో ఉన్న బస్షెల్టర్ను, దుకాణాలను తొలగించేందుకు పోలీసు బందోబస్తు కోరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఉదయం ఏడు గంటలకే చిరు వ్యాపారులతో కలిసి దీక్ష చేపట్టారు. కౌన్సిల్ తీర్మానం లేకుండా యాభైఏళ్ల క్రితంనిర్మించిన బస్టాండును ఎలా తొలగిస్తారంటూ కమిషనర్ను నిలదీశారు. వ్యాపారులకు 24వ తేదీ నోటీసులు ఇచ్చి 9వ తేదీ ఇచ్చారంటూ ఎందుకు మోసం చేశారని కమిషనర్ను ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే రాచమల్లు జిల్లా కలెక్టర్ హరికిరణ్కు ఫోన్ చేసి వివరించారు. బస్టాండుకు పది అడుగుల దూరంలో త్రీటౌన్ పోలీస్స్టేషన్ పక్కనే 75 సెంట్ల మున్సిపల్ స్థలం ఉందని అక్కడ అన్న క్యాంటిన్ కడితే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. పరిశీలిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. కమిషనర్ దీక్షా శిబిరానికి వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడారు. రాత్రివేళ దుకాణాలను కూల్చబోమని హామీ ఇచ్చారు. ఐదవ రోజుకు చేరిన దీక్ష: మంగళవారానికి దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరానికి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆర్ఓ మునికృష్ణారెడ్డి, ఇతర శాఖల అ«ధికారులు వచ్చారు. జిల్లా కలెక్టర్ తమను పిలిపించి ఈ విషయాన్ని చర్చించారని చెప్పారు. చిరువ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని చెప్పినట్లు వివరించారు. మున్సిపల్ గదులను, బస్షెల్టర్ను తొలగించి అన్న క్యాంటిన్తోపాటు బస్షెల్టర్ను ఆధునికీకరిస్తామని చెప్పారు. చిరు వ్యాపారులు తిరిగి వారి స్థానాల్లో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వ్యాపారులతో మాట్లాడారు. ప్రభుత్వం మనకోసం ముందుకు వచ్చి సహకరిస్తామన్నప్పుడు మనం కూడా సహకరించాల్సిన బాధ్యత ఉందన్నారు. అన్న క్యాంటిన్ను మొదలు పెట్టిన రోజు బస్షెల్టర్ ఆధునికీకరణ పనులు మొదలు పెడతారని, నెలలోపు ఆ రెండు పూర్తవుతాయని, తిరిగి మీరు యధాస్థానాల్లో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. దీంతో వ్యాపారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. -
'ఎన్టీఆర్ క్యాంటీన్లు' పై టీడీపీ ఎమ్మెల్సీ సెటైర్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ల ఏర్పాట్లుపై టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చలోక్తులు విసిరారు. శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో మూర్తి మాట్లాడుతూ ఆరు నెలల క్రితం మంత్రి సునీత క్యాంటిన్ల విషయంలో ఏ సమాధానం చెప్పారో.. ప్రస్తుత మంత్రి పుల్లారావు కూడా అదే సమాధానం చెప్పారన్నారు. రోజులు మారుతున్నాయి.. మంత్రులు మారారు గానీ పథకం మాత్రం అమలు కావడం లేదని వ్యాఖ్యానించారు. పేదల ఆకలిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖపై మూర్తి ధ్వజమెత్తారు. ఏపీ రోగాలకు నిలయంగా మారిందని, ప్రసూతి మరణాలలో ఏపీ ప్రథమ స్దానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డెంగీ, మలేరియా విజృంభణతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, దయచేసి రాష్టాన్ని వ్యాధుల బారి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. -
పనులన్నీ చేయించుకుని మరిచిపోతారు..
ప్రజలపై సీఎం అసహనం సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల విలువైన భూములను క్రమబద్ధీకరించి పట్టాలిచ్చామని, పట్టా తీసుకున్నవారు ఇంటికెళ్లి తనను మరిచిపోతారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘పింఛన్ తీసుకుంటున్నారు.. మరిచిపోతున్నారు. రేషన్ తీసుకుంటున్నారు..మరిచిపోతున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నా మరిచిపోతున్నారు. మీక్కావల్సిన పనులన్నీ చేయించుకుని నన్ను మరిచిపోవడం ఎంతవరకు సమంజసం?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదానంలో బుధవారం సాయంత్రం జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 21,225 మందికి క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, శంషాబాద్ ఎయిర్పోర్టును తలదన్నేలా భోగాపురం ఎయిర్పోర్టును నిర్మిస్తామని చెప్పారు. మహిళల నిరసన.. గెంటేసిన హోంమంత్రి పట్టాలిస్తామని చెప్పి ఇక్కడికి పిలిచి ఇప్పుడు రద్దయిపోయింది పొమ్మంటున్నారంటూ పలువురు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ‘నాకు పట్టా మంజూరైందని డబ్బులు కూడా తీసుకున్నారు..తీరా ఇక్కడకు వస్తే లేదు పొమ్మన్నారు..’ అంటూ తాటిచెట్లపాలేనికి చెందిన పుష్ప సీఎం పేరిట తనకు ఇచ్చిన ఆహ్వాన పత్రికను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. అదేవిధంగా పలువురు మహిళలు వేదిక వద్దకు వచ్చి మీడియా వద్ద గోడు వెళ్లబోసుకుంటున్న సమయంలో.. హోంమంత్రి చినరాజప్ప అక్కడకు చేరుకుని మీడియాపై అసహనం వ్యక్తం చేయడమే కాకుండా, మహిళలను అక్కడినుంచి పొమ్మంటూ గెంటేశారు. -
నవంబర్లో అన్న క్యాంటీన్లు
మంత్రి నారాయణ వెల్లడి నెల్లూరు: తమిళనాడు తరహాలో ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లు రాష్ట్రంలో నవంబరు నుంచి ప్రారంభమవుతాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలక మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి పథకాల గురించి వాక బు చేసి, అటువంటి వాటిని మన రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నామన్నారు. అందు లో భాగంగానే తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లను పరిశీలించి, ఆ తరహాలో రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయన మంగళవారం నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నమైన పథకాలను రాష్ట్రానికి తీసుకురావాలని ఆశిస్తున్నారని తెలిపారు. అన్న క్యాంటీన్లు నవంబర్లో ప్రారంభిస్తామన్నారు. అక్టోబరు 2న వెయ్యి రూపాయల పింఛన్ అమలు మొదలుపెట్టడంతో పా టు, ఎన్టీఆర్ సుజల పథకాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను గుర్తించేందుకు పింఛన్ పరిశీలన కమిటీలను ఏర్పాటుచేశామని, ఆధార్ అనుసంధానం కూడా అందుకేనని మంత్రి అన్నారు. -
నవంబర్ లో అన్నా క్యాంటీన్లు ప్రారంభం
హైదరాబాద్:నవంబర్ లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. ఈ అన్నా క్యాంటీన్లలో ఒక రూపాయికే సాంబారు ఇడ్లీ సరఫరా చేస్తామన్నారు. ఐదు రూపాయలకే లెమన్, పెరుగు, సాంబారు రైస్ ను సరఫరా చేస్తామన్నారు. అంతేకాకుండా మరో ఐదు రూపాయలకే రెండు చపాతీలను సరఫరా చేస్తామన్నారు. అక్టోబర్ 2 వ తేదీన 222 ఎన్టీఆర్ సుజల ప్లాంట్లను మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేస్తామన్నారు. వారం రోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఆన్ లైన్ ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో ప్రజల అవసరాలు ఏమున్నా ఫోటో తీసి ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాటిని పరిష్కరించి తిరిగి ప్రజలకు ఫోటో పంపిస్తామన్నారు. పట్టణాభివృద్ధి మిషన్ ను నూటికి నూరుశాతం అమలు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. -
ఆహా ఏమిరుచి!
- అమ్మ క్యాంటీన్లలో ఆంధ్ర మంత్రుల ఆనందం - చెన్నైకి దీటుగా అన్న క్యాంటీన్లని వెల్లడి చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి’ అంటూ రాగం తీశారు అమ్మ క్యాంటీన్లను సందర్శించిన ఆంధ్ర మంత్రులు. మధ్యాహ్న భోజనానికి వినియోగదారుల కోసం సిద్ధం చేసిన నిమ్మకాయ అన్నం, సాంబారు అన్నం, పెరుగన్నాన్ని ఆరగించి ఆనందించారు. చెన్నైకి ఏమాత్రం తీసిపోని రీతిలో ఆంధ్రాలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని శుక్రవారం పర్యటనలో వెల్లడించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం పేదలపై పడకుండా చౌకధరలకే ఆహారం లభించేలా ముఖ్యమంత్రి జయలలిత గత ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన చెన్నైలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలోని 200 వార్డుల్లో వార్డుకు ఒకటి చొప్పున 200, మూడు ప్రభుతాస్పత్రుల్లోనూ మొత్తం 203 క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఉదయం ఒకరూపాయికే ఇడ్లీ, రూ.5కు పొంగల్, మధ్యాహ్నం రూ.5కు సాంబార్, నిమ్మకాయ అన్నం, రూ.3కు పెరుగన్నం అందిస్తున్నారు. రాత్రిపూట రూ.3కు మూడు చపాతీలు పెడుతున్నారు. ఈ కాంటీన్లు పెద్దఎత్తున ప్రజాదరణ పొందడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం అన్న క్యాంటీన్ల పేరుతో ఇదే తరహా పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మంత్రివర్గ ఉపసంఘంగా ఏర్పడిన పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, మునిసిపల్ మంత్రి నారాయణ, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం చెన్నైలోని అమ్మ క్యాంటీన్లను సందర్శించారు. చేపాక్ ప్రభుత్వ అతిథిగృహం నుంచి 11.30 గంటలకు బయలుదేరిన మంత్రులు ముందుగా సాంతోమ్ చర్చిరోడ్డులో సీఎం జయ చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకున్న అమ్మ క్యాంటీన్కు వెళ్లా రు. అక్కడి వంటకాలను ముగ్గురు మం త్రులు రుచిచూశారు. వంటగది, స్టోర్రూములను సందర్శించారు. సిబ్బంది నుంచి జమా ఖర్చుల వివరాలు సేకరించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని మేయర్ సైదై దొరస్వామి, కమిషనర్ విక్రమ్ కపూర్తో సమావేశమై అమ్మ క్యాంటీన్లపై వారిచ్చిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ను తిలకించారు. అక్కడి నుంచి రాజీవ్ ప్రభుత్వాస్పత్రి(జీహెచ్)లోని అమ్మ క్యాంటీన్ను సందర్శించారు. నాలుగు జిల్లాలు - 35 క్యాంటీన్లు చెన్నై తరహా అమ్మ క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్లో ‘అన్న క్యాంటీన్ల’ పేరుతోప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు నారాయణ, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు మీడియాకు వెల్లడి ంచారు. అమ్మ క్యాంటీన్లను అధ్యయనంచేసిరమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు చెన్నైలో పర్యటించినట్లు తెలిపారు. అమ్మ క్యాంటీన్ల నిర్వహణ, పనితీరు అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఆహార పదార్థాలు సైతం ఎంతో రుచికరంగా ఉన్నాయని ప్రశంసించారు. పూర్తిగా మహిళలే పర్యవేక్షిస్తున్నా జమా ఖర్చుల లెడ్జర్ను చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు. పెలైట్ ప్రాజెక్టుగా నాలుగు జిల్లాల్లో 35 క్యాంటీన్లను నవంబర్ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖపట్నంలో 15, గుంటూరులో 10, అనంతపురంలో 5, తిరుపతి 5 మొత్తం 35 క్యాంటీన్లను పరిచయం చే యనున్నట్లు వారు వెల్లడించారు. మునిసిపల్, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ డైరక్టర్ వాణిమోహన్, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు కాంతీలాల్ దండే, సాల్మన్ ఆరోగ్యరాజ్, సిద్ధార్థ్జైన్, విశాఖపట్నం జాయింట కలెక్టర్ ప్రవీణ్కుమార్, ఆయా జిల్లాల మునిసిపల్ కమిషనర్లు, పౌరసరఫరాల అధికారులు, మేనేజర్లు, ప్రజాప్రతినిధులు మంత్రుల పర్యటనలో పాల్గొన్నారు. -
35 క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం
-
ఎన్టీఆర్ క్యాంటీన్లో నిత్యం లక్ష మందికి భోజనం
ఏపీలోని 4 జిల్లాల్లో త్వరలోనే ప్రారంభిస్తామన్న మంత్రివర్గ ఉపసంఘం ఏటా రూ.160 కోట్ల వ్యయ భారం పడుతున్నప్పటికీ భరిస్తామని వెల్లడి 35 క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి చపాతీ సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని ‘అమ్మ క్యాంటీన్’ తరహాలో ఆంధ్రప్రదేశ్లో ‘ఎన్టీఆర్ క్యాంటీన్’లకు ప్రభుత్వం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించి విస్తృత పరిశీలన అనంతరం.. క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. పేదలకు అతి తక్కువ ధరలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి చపాతీ అందించేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ‘ఎన్టీఆర్ క్యాంటీన్’లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు పి. నారాయణ, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయా వివరాలను మీడియాకు వెల్లడించారు. క్యాంటీన్ల నిర్వహణకు ఏటా 160 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ క్యాంటీన్ల ద్వారా నిత్యం లక్ష మంది పేదలకు అతి తక్కువ ధరలకే అల్పాహారం, భోజనాలను అందించనున్నట్టు తెలిపారు. ప్రయోగాత్మకంగా తొలుత 4 జిల్లాల్లో 35 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలో 15, గుంటూరులో 10, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 5 చొప్పున వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. క్యాంటీన్లలో ఉదయం ఇడ్లీ, పొంగల్, ఉప్మా మధ్యాహ్నం పులిహోర, సాంబారు, పెరుగన్నం, రాత్రికి చపాతీలు, వె జ్ కర్రీ ఉంటాయని తెలిపారు. వీటి నిర్వహణను స్వయం సహాయక బృందాలు, ఇస్కాన్, నంది, ఎన్జీఓలకు అప్పగించాలన్న విషయంపై ఆలోచిస్తున్నామని, సోమవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.