అన్న క్యాంటీన్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, ఎమ్మిగనూరు : అన్నక్యాంటీన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకుంది. సామాన్య ప్రజలపై మున్సిపల్ కమిషనర్ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో గురువారం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం రావడంతో సిబ్బంది కంట్రోల్ చేయలేకపోయ్యారు. దీంతో కమిషనర్ వచ్చిన వారిపై అసహనం వ్యక్తం చేశారు.
భోజనం చేయడానికి వచ్చిన వారిపై మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి చేయి చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ తీరును జనం తప్పుబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అన్న క్యాంటీన్లను ప్రారంభించి విషయం తెలిసిందే. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు