
దాతల నుంచి సేకరించే విరాళాల నుంచి చెల్లింప
పురపాలక శాఖ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: అన్న క్యాంటీన్ ఛారిటబుల్ ట్రస్టు సీఈఓగా పోతుల వంశీధర్ను ప్రభుత్వం నియమించింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నెలకు రూ.4 లక్షల వేతనం (జీతం రూ.3 లక్షలు, కారు అలవెన్సు రూ.60 వేలు, ఇతర అలవెన్సులు రూ.40 వేలు) ఇవ్వాలని నిర్ణయించింది. దాతల నుంచి సేకరించే విరాళాలతో ఆయనకు ఈ వేతనాన్ని చెల్లంచాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో ఉన్న అన్న క్యాంటీన్లను ప్రారంభించిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇందుకోసం ఓ ఛారిటబుల్ను ట్రస్టును ఏర్పాటుచేసి.. విరాళాలు సేకరిస్తోంది. వాటితో అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు రూ.5కే టిఫిన్, రూ.5కే భోజనం అందిస్తున్నట్లు చెబుతోంది. కానీ, వీటి నిర్వహణకు నియమించే సీఈఓకు మాత్రం నెలకు రూ.4 లక్షలను వేతనంగా చెల్లించాలని నిర్ణయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇది అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్లుగా ఉందని రాజకీయ వర్గాల్లో సెటైర్లు పేలుతున్నాయి.