-
CM Yogi Adityanath: యోగి ఔర్ ఏక్.. మదర్సాలకు షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు మరో కీలకమైన నిర్ణయంతో సంచలనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మదర్సాలకు ఎటువంటి నిధులు ఇవ్వకూడదన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఆయన కేబినెట్. దీంతో యూపీలోని చాలావరకు మదర్సాలకు ప్రభుత్వం నుంచి ఇకపై రూపాయి అందదు. మదర్సాలు అన్నీ కూడా జాతీయ గీతం ఆలపించడాన్ని ఇటీవలే యోగి సర్కారు తప్పనిసరి చేసింది. మదర్సాల్లో తరగతులు ఆరంభానికి ముందు విద్యార్థులు, టీచర్లు అందరూ జాతీయగీతం ఆలపించాలంటూ మైనారిటీ శాఖ ఈ నెల 12న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఇచ్చిన వారం వ్యవధిలోనే.. కొత్త మదర్సాలను ప్రభుత్వ నిధుల సాయం నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం నిధుల సాయం నుంచి కొత్త సంస్థలనే మినహాయించారు. యూపీ సర్కారు మదర్సాల ఆధునికీకరణ పథకానికి గత బడ్జెట్ లో రూ.479 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధులతో మదర్సాలను ఆధునికీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 వేలకుపైగానే మదర్సాలు ఉన్నాయి. కానీ, వాటిలో 558 మదర్సాలకు మాత్రమే ప్రభుత్వం నిధులను అందించనుంది. దీంతో మిగిలిన వేలాది మదర్సాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధుల సాయం అందదు. చదవండి: కశ్మీరీ ఫైల్స్.. రక్తపు కూడు సీన్లు ఏంటసలు? -
డిగ్రీ కాలేజీల్లో 253 సూపర్ న్యూమరరీ పోస్టులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విలీనమైన ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాల చెల్లింపు, ఇతర సర్దుబాటు చర్యల కోసం ప్రభుత్వం ఆయా కాలేజీల్లో 253 సూపర్ న్యూమరరీ పోస్టులను మంజూరు చేసింది. వీటిలో 23 ప్రిన్సిపాల్, 31 టీచింగ్, 199 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం జీవో 17 విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చేసిన విధాన నిర్ణయం ప్రకారం ప్రభుత్వంలో తమ సిబ్బందిని విలీనం చేసేందుకు 125 ఎయిడెడ్ కాలేజీల యాజమాన్యాలు అంగీకారం తెలిపాయి. వీరిలో 895 మంది బోధన సిబ్బంది, 1,120 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. బోధన సిబ్బందిలో 864 మందిని వివిధ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న క్లియర్ వేకెన్సీ పోస్టుల్లో సర్దుబాటు చేశారు. మిగతా 31 మందిని కొత్తగా మంజూరుచేసిన కాలేజీల్లోకి పంపారు. అయితే అక్కడ ఇంకా మంజూరు కాని పోస్టుల్లో వారిని నియమించారు. అలాగే ప్రభుత్వంలో విలీనమైన 23 మంది ప్రిన్సిపాళ్లకు ఖాళీలు లేనందున ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. బోధనేతర సిబ్బందిలో 921 మందిని క్లియర్ వేకెన్సీల్లో సర్దుబాటు చేశారు. బోధనేతర సిబ్బందిలో మిగిలిన 199 మందితోపాటు 23 మంది ప్రిన్సిపాళ్లు, 31 మంది టీచింగ్ స్టాఫ్ కోసం సూపర్ న్యూమరరీ పోస్టులు అవసరమని కాలేజీ విద్యా కమిషనర్ ప్రతిపాదనలు ఇవ్వడంతో ప్రభుత్వం ఆమేరకు పోస్టులు మంజూరు చేసింది. -
జగన్ ప్రభుత్వంలోనే ఎయిడెడ్కు జీవం
సాక్షి, అమరావతి: ఎయిడెడ్ విద్యాసంస్థలకు పూర్వవైభవం తీసుకొచ్చే విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో మరోసారి తేటతెల్లమైంది. అలాగే పట్టణ, గ్రామీణ సంస్థలు, సహకార సంస్థలకు ఆర్థిక సాయం, విద్యుత్ రాయితీల విషయంలోనూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే అత్యధిక మేలు జరిగింది. అన్ని రకాల ఎయిడెడ్ విద్యా సంస్థలకు చంద్రబాబు హయాంలో 2018–19లో రూ. 9,600 కోట్లు గ్రాంటుగా ఇవ్వగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో రూ. 10,048 కోట్లు గ్రాంటుగా ఇచ్చినట్లు కాగ్ పేర్కొంది. అధికారంలో ఉండగా ఖాళీల భర్తీలు చేపట్టకుండా, సరైన పర్యవేక్షణ చేయకుండా ఎయిడెడ్ సంస్థలను కునారిల్లేలా చేసిన చంద్రబాబు ఇప్పుడు వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తుంటే బురద జల్లుతుండడం విడ్డూరంగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఒక్క అమ్మ ఒడి పథకం కోసం 2019–20 ఆర్థిక ఏడాదిలోనే రూ. 6,349.47 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఇక విద్యుత్ రాయితీలను చంద్రబాబు ప్రభుత్వం భారీగా కుదించేసినట్లు నివేదికలో తేలింది. సీఎం జగన్ వచ్చిన తర్వాత విద్యుత్ రాయితీల కోసం ఏకంగా నాలుగున్నర రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు. 2019–20లో వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ కోసమే రూ. 4,919.84 కోట్లను వ్యయం చేసినట్లు కాగ్ పేర్కొంది. ఇక సహకార సంస్థలకు గత ప్రభుత్వం కేవలం రూ. 543 కోట్లు కేటాయించి పూర్తిగా నిర్వీర్యం చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ. 9,487 కోట్లు గ్రాంటుగా ఇచ్చినట్లు వెల్లడైంది. -
పదే పదే చెబితే అబద్ధం నిజమవుతుందా..?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలు, భోదనా సిబ్బంది, విద్యార్థులకు మంచి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు దాన్ని వక్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం అన్నట్లుగా.. ఏదో అన్యాయం చేస్తున్నట్లుగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 వంటి మీడియా బలం ఉంది కాబట్టి.. ఒక అబద్ధాన్ని పదే పదే వాటితో చెప్పించి.. అదే నిజం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శాసనసభలో శుక్రవారం విద్యారంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏం చెప్పారంటే.. గతంలో ఆస్తిపాస్తులు బాగా ఉన్న వారు ఛారిటీ కింద తమ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే లక్ష్యంతో భవనాలు నిర్మించి, వాటిలో పాఠశాలలు, కాలేజీలు పెట్టారు. వాటికి బోధన సిబ్బందిని ఇస్తూ ప్రభుత్వమూ సహకరిస్తూ వచ్చింది. కాలక్రమంలో భవనాలు పాతబడి శిథిలావస్థకు చేరుకున్నాయి. 25 ఏళ్లుగా ఎవరైనా రిటైరైతే.. వారి స్థానాలను భర్తీ చేయడం లేదు. స్కూళ్లు, కాలేజీలు నడపడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోయింది. ఒక వైపు ఖర్చులు పెరగడం, మరోవైపు ఆదాయం లేని పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలు నిర్వీర్యం అయిపోయాయి. తమను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవాలని ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న బోధనా సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎయిడెడ్ విద్యా సంస్థల ఏర్పాటు వెనక ఉన్న ఉద్దేశం నెరవేరేలా ఆప్షన్లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాజమాన్యాల అంగీకారంతోనే.. నడపలేని పరిస్థితిలో ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థలను ఉన్నది ఉన్నట్లుగా ప్రభుత్వానికి అప్పగిస్తే వారి పేరే పెట్టి, శిథిలావస్థలో ఉన్న ఆ భవనాలను నాడు–నేడు పథకం ద్వారా అభివృద్ధి చేసి, విద్యార్థులకు సరిపడా టీచర్లను భర్తీ చేసి, ఆ విద్యా సంస్థల స్థాపన లక్ష్యాలను చేరుకునేందుకు సహాయంగా నిలుస్తుంది. తాము ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలంటూ ఎయిడెడ్ టీచర్లు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారి డిమాండ్ను కూడా పరిగణలోకి తీసుకుని.. వారిని సరెండర్ చేసి ప్రైవేటు సంస్థగా యాజమాన్యాలు నడుపుకోవచ్చు. n లేదా ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా యథా ప్రకారం నడుపుకోవచ్చు. ప్రభుత్వానికి ఏ అభ్యంతరం లేదు. ఇప్పటికే ఎవరైనా ప్రభుత్వానికి అప్పగిస్తూ నిర్ణయించినా, దాన్ని వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. తప్పును సరిదిద్ది మంచి చేయాలని సంకల్పిస్తే.. దాన్ని కూడా వక్రీకరించి దుర్మార్గంగా రాజకీయాలు చేస్తే, ఏ విధంగా రాష్ట్రం బాగు పడుతుందో ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాను. -
‘ఎయిడెడ్’ను భ్రష్టుపట్టించిందే చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఎయిడెడ్ విద్యా సంస్థలను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలను టీడీపీ దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చకు అనుమతివ్వాలంటూ టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రోటెం చైర్మన్ విఠపు బాలసుబ్రమణ్యం తిరస్కరించడంతో వారు బాయ్కాట్ చేశారు. దీనిపై మంత్రి బొత్స స్పందిస్తూ.. ఎయిడెడ్ విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించిందే చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా నిషేధం విధించారని.. వీటి అసలు లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాజకీయం చేసి లబ్ధిపొందాలని టీడీపీ చూస్తోందని బొత్స మండిపడ్డారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన విజయనగరం మహారాజ ఎయిడెడ్ కళాశాలను కూడా నిర్వహించలేమని గతంలో టీడీపీ నేత పూసపాటి అశోక్గజపతిరాజు లేఖ ఇచ్చిన విషయాన్ని సభలో మంత్రి ప్రస్తావించారు. ఇలా అనేకమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వినతుల మేరకే ఎయిడెడ్ విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు చేపట్టారన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలు కోరుకున్నట్లే చేసేలా వాటికి అవకాశమిచ్చామని, విద్యార్థుల మేలుకోసమే ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిందన్నారు. విద్యార్థులకు సీఎం అన్యాయం చేయరు మరో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 43 లక్షల మంది విద్యార్థుల మేలు కోసం తపనపడుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్న సీఎం వైఎస్ జగన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని మూడు లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేయబోరని స్పష్టంచేశారు. వీటిని గాడిలో పెట్టి విద్యార్థులకు మరింత మేలు చేసేలా తీసుకుంటున్న చర్యలకు మనమంతా మద్దతుగా నిలవాలన్నారు. ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, ఐ. వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి కూడా మాట్లాడారు. అంతకుముందు.. మాజీ ఎమ్మెల్సీ వల్లభనేని కమలకుమారి మృతికి సంతాపం తెలుపుతూ సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement