
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలుల వర్షం బీభత్సం సృష్టించింది

భారీ వృక్షాలు, 123 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి

20 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లా కలెక్టరేట్ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు

అక్కడక్కడా చెట్ల కొమ్మలు, వృక్షాలు తీగలపై పడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కాగా, ఎన్పీడీసీఎల్కు రూ.18.30 లక్షల నష్టం కలిగింది.

గాలులకు ద్విచక్రవాహనాలు కింద పడిపోగా, ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. హోర్డింగులు, ఫ్లెక్సీలు నేలకూలాయి. వర్షంతో కూడిన బలమైన ఈదురు గాలులకు ప్రజలు బెంబేలెత్తిపోయారు.













