తిరుపతి : ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా.. బుధవారం నుంచి వారం రోజుల పాటు తిరుపతిలో గంగజాతర జరగనుంది.. కనుక నగరవాసులెవరూ ఊరు వదలి వెళ్లరాదు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రి పూట ఇక్కడ బస చేయకుండా తిరిగి వెళ్లిపోవాలహో.. అని కైకాల వారు మంగళవారం రాత్రి చాటింపు వేశారు.
జాతరలో భాగంగా ఉదయం 7.30 గంటలకు ఆలయ అవరణలోని అమ్మవారి విశ్వరూప కొడిస్తంభానికి భక్తుల సమక్షంలో శాస్తోక్తంగా అభిషేకం, పూజలు చేసి, ఒడిబాలు సమర్పించారు.
అలాగే ఆలయంలో అమ్మవారి మూలవిరాట్టుకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు, విశేషాలంకరణ చేసి కొలువు తీర్చారు.
ఈ సందర్భంగా భక్తులు పొంగళ్లు పెట్టి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.


