8 మంది అగ్రి గోల్డ్‌ డైరెక్టర్ల అరెస్ట్‌ | Arrest of 8 Agri Gold Directors | Sakshi
Sakshi News home page

8 మంది అగ్రి గోల్డ్‌ డైరెక్టర్ల అరెస్ట్‌

Jan 10 2018 1:28 AM | Updated on Aug 21 2018 6:02 PM

Arrest of 8 Agri Gold Directors - Sakshi

లీగల్‌ (కడప అర్బన్‌) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్‌ కేసులో ఆ సంస్థకు సంబంధించిన 8 మంది డైరెక్టర్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి వైఎస్సార్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారికి ఈ నెల 23 వరకు రిమాండ్‌ విధించడంతో ఏలూరు కేంద్రకారాగారానికి తరలించారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్‌ కాగా, పరారీలో ఉన్న 8 మంది డైరెక్టర్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి తమ ఎదుట హాజరు పరిచారని తెలిపారు. అరెస్టయిన అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లలో శివనారాయణ, వెంకటసుబ్రమణ్యం, శర్మ, ఉదయభాస్కర్‌రావు, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, ఉమతో పాటు మరొకరు ఉన్నారన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement