తుని ఘటన కేసులో 8మంది బెయిల్ పై విడుదల | tuni insident : 8 got released on bail | Sakshi
Sakshi News home page

తుని ఘటన కేసులో 8మంది బెయిల్ పై విడుదల

Jun 18 2016 9:35 PM | Updated on Jul 30 2018 7:57 PM

తుని ఘటన కేసులో రాజమండ్రి జైలు నుంచి 8 మంది బెయిల్ పై విడుదలయ్యారు.

తుని(తూ.గో): తుని ఘటన కేసులో రాజమండ్రి జైలు నుంచి 8 మంది బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలు సరిగా లేవని ఒకరిని అధికారులు విడుదల చేయలేదు. బెయిల్ పై విడుదలైన మరొకరిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుని ఘటన కేసులో 10 మందికి పిఠాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో ముగ్గురి బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.


జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపుఐక్యగర్జన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజు తునిలో చోటుచేసుకున్న సంఘటనలపై 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారానికి పదో రోజుకు చేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement