
'రామ మందిరం మరమ్మత్తు చేసుకోవచ్చు'
అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది.
ఉత్తరప్రదేశ్: అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. తాత్కాలికంగా నిర్మించిన రామ మందిరానికి మరమ్మత్తులు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ఆలయం వద్ద తాత్కాలిక షెల్టర్ కవర్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓ కలెక్టర్తోపాటు ఇద్దరు ఉన్నత స్ధాయి అధికారుల సమక్షంలోనే జరగాలని కూడా సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.