ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ | Raghuram G Rajan appointed next Reserve Bank of India Governor | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్

Aug 6 2013 4:47 PM | Updated on Sep 1 2017 9:41 PM

ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్

ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్

రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్గా రఘురామ్ జి రాజన్ నియమితులయ్యారు.

రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్గా రఘురామ్ జి రాజన్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. దువ్వూరి ఐదేళ్ల పదవీ కాలం సెప్టెంబర్ 4తో ముగియనుంది.      

ఆర్బీఐ గవర్నర్ పదవిలో రఘురామ్ జి రాజన్ మూడేళ్ల పాటు కొనసాగుతారని అధికార ప్రకటనలో తెలిపారు. రాజన్ ప్రస్తుతం ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయనను గతేడాది ఆగస్టులో ఈ పదవిలో నియమించింది. గతంలో ఐఎంఎఫ్లో ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు. ప్రధానికి గౌరవ ఆర్థిక సలహాదారుగానూ కొనసాగుతున్నారు.

ఆర్బీఐ గవర్నర్గా రాజన్ పలు సవాళ్లు ఎదుర్కొనున్నారు. రూపాయి పతనం, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఐటీ-అహ్మదాబాద్, ఐఐటీ-ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన రాజన్ 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగా ఊహించారు.

Advertisement
 
Advertisement
Advertisement