'లీకులెవరు చేస్తున్నారు.. జాగ్రత్తగా ఉండండి' | Kerala minister warns action against 'erring' officials | Sakshi
Sakshi News home page

'లీకులెవరు చేస్తున్నారు.. జాగ్రత్తగా ఉండండి'

Aug 9 2015 2:42 PM | Updated on Sep 3 2017 7:07 AM

'లీకులెవరు చేస్తున్నారు.. జాగ్రత్తగా ఉండండి'

'లీకులెవరు చేస్తున్నారు.. జాగ్రత్తగా ఉండండి'

కేరళ హోమంత్రి రమేశ్ చెన్నితాలా ప్రభుత్వాధికారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

తిరువనంతపురం: కేరళ హోమంత్రి రమేశ్ చెన్నితాలా ప్రభుత్వాధికారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అనవసరంగా మీడియాకు సమాచారం అందించినా, తప్పుడు వివరాలు తెలియజేసినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హుకుం జారీ చేశారు. కేరళలోని ఓ ఐటీ ప్రాజెక్టు విషయంలో దాదాపు రూ.రెండు కోట్లు వృధా చేశారనే విషయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

దీనిపై మీడియాలో వార్తలు హల్ చల్ చేయడంతో ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగింది. ఓ సీనియర్ పోలీసు అధికారి ఐటీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు మీడియాకు లీక్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదివారం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ అధికారులందరికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో దర్యాప్తు విషయాలు మీడియాకు అప్పుడే చెప్పవద్దని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement