కార్గో నౌకలు ఢీ: 8 మంది సిబ్బంది గల్లంతు | Eight Chinese crew missing after ships collide off Japan | Sakshi
Sakshi News home page

కార్గో నౌకలు ఢీ: 8 మంది సిబ్బంది గల్లంతు

Mar 18 2014 12:04 PM | Updated on Sep 26 2018 3:36 PM

జపాన్ రాజధాని టోక్యో తీర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున రెండు కార్గో నౌకలు ఢీ కొన్నాయి.

జపాన్ రాజధాని టోక్యో తీర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున రెండు కార్గో నౌకలు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో నౌకలో పని చేస్తున్న ఎనిమిది మంది చైనీయులు గల్లంతు కాగా, మరోకరు తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు.ఈ మేరకు జపాన్ తీర ప్రాంత ఉన్నతాధికారులు వెల్లడించారు.

 

ఈ రోజు తెల్లవారుజామున 3.00 గంటల ఆ ప్రాంతంలో పనామాకు చెందిన బిగెల్ 3, దక్షిణ కోరియాకు చెందిన పెగాసస్ ప్రైమ్ నౌకలు ఢీ కొన్నాయని తెలిపారు. అయితే గల్లంతైన వారి ఆచూకీ కోసం రెండు హెలికాప్టర్లు,19 నౌకలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement