వడదెబ్బకు కార్మికుడు మృతి | worker dies with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు కార్మికుడు మృతి

Apr 17 2016 6:33 PM | Updated on Sep 3 2017 10:08 PM

ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన ఓ యువకుడు వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.

ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన ఓ యువకుడు వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. గోపిరెడ్డి పరమేశ్వరరెడ్డి స్థానికంగా గల ఐటీసీ పేపర్ మిల్స్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శ్రీరామనవమి, సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం కార్యక్రమాల నేపథ్యంలో ఎక్కువగా ఎండలో తిరిగిన పరమేశ్వరరెడ్డి శనివారం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని విజయవాలోని ఓ ఆస్పత్రికి తరలించగా శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement