ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్‌ | Telangana CM KCR to Attend Niti Aayog meeting | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్‌

Jun 13 2019 8:02 AM | Updated on Jun 13 2019 8:15 AM

Telangana CM KCR to Attend Niti Aayog meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 15న ఢిల్లీలో జరగనున్న ఐదో నీతి ఆయోగ్‌ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి నీతి ఆయోగ్‌ సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం ఆహ్వానించింది. నీతి ఆయోగ్‌ సమావేశం ముగిసిన అనంతరం శుక్రవారం రాత్రి కేసీఆర్‌ తిరిగి రాష్ట్రానికి రానున్నారు. కాగా, ఈ నెల 20న ఢిల్లీలో జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థికమంత్రి హోదాలో హాజరు అయ్యేందుకు మరోసారి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement