'దళితులపై దాడులు అరికట్టాలి' | Take action against leaders, says sc leaders | Sakshi
Sakshi News home page

'దళితులపై దాడులు అరికట్టాలి'

May 23 2015 7:36 PM | Updated on Aug 16 2018 1:18 PM

'దళితులపై దాడులు అరికట్టాలి' - Sakshi

'దళితులపై దాడులు అరికట్టాలి'

దళితులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్...

సంగారెడ్డి(మెదక్ జిల్లా): దళితులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఫ్లెక్సీకి శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ దళితులపై దాడులు చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని, అట్రాసిటి కేసులను నీరుగారుస్తున్న సంగారెడ్డి, రామచంద్రపురం డీఎస్పీలను సస్పెండ్ చేయాలని, సంగారెడ్డి జడ్పీటీసీ మనోహర్‌గౌడ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement