టీచర్ కొట్టిందని విద్యార్థిని ఆత్మహత్య | student commits suicide in nalgonda distirict | Sakshi
Sakshi News home page

టీచర్ కొట్టిందని విద్యార్థిని ఆత్మహత్య

Nov 6 2015 10:27 AM | Updated on Nov 9 2018 4:36 PM

టీచర్ కొట్టిందని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది.

చింతపల్లి:  టీచర్ కొట్టిందని మనస్తాపానికి గురై  రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్‌వెంకటేశ్వర నగర్‌ గ్రామానికి చెందిన సురిగి భవాని(15) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చాయని టీచర్ భవానిని కొట్టడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement