ఆర్టీసీ బస్సులో భారీ చోరి | robbery in rtc bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో భారీ చోరి

Apr 9 2015 6:54 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఆర్టీసీ బస్సులో భారీ చోరి జరిగింది.

హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో భారీ చోరి జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నగలు అపహరించుకుపోయారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాలు.. చాంద్రాయణగుట్టకు చెందిన అనీస్‌ఫాతిమా ఆర్టీసీ బస్సులో ఎర్రగడ్డ వైపు వెళ్తుండగా ఈ చోరి జరిగింది. ఆమె బ్యాగ్‌లో ఉన్న 30 తులాల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. బస్సు దిగిన తర్వాత చూసుకున్న ఫాతిమా నగలు కనిపించక పోవడంతో ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరికి గురైన నగల విలువు సుమారు రూ. 8 లక్షల విలువ ఉంటుందని ఫాతిమా తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement