
‘కేసీఆర్ కుట్ర చేస్తున్నారు’
టీడీపీని దెబ్బతీసేందుక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కుట్ర చేస్తున్నారని టీటీడీపీ నేత రేవంత్రెడ్డి ఆరోపించారు.
ఈ కార్యకమంలో ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్రెడ్డి, పెద్దిరెడ్డి పాల్గొన్నారు. టీడీపీలో పుట్టి పెరిగిన కేసీఆర్.. ఇప్పుడు ఆ పార్టీనే లేకుండా చేయాలని చేస్తున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ధ్వజమెత్తారు. కొందరు నాయకులు పదవుల కోసం స్వార్థంతో పార్టీ మారారని, వారు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ లేదన్నారు.