ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి రైల్వేస్టేషన్ను సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్(డీఎం) ఆశిష్ అగర్వాల్ శనివారం ఉదయం సందర్శించారు.
బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి రైల్వేస్టేషన్ను సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్(డీఎం) ఆశిష్ అగర్వాల్ శనివారం ఉదయం సందర్శించారు. డివిజనల్ రైల్వే మేనేజర్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అగర్వాల్ తొలి పర్యటనగా బెల్లంపల్లి రైల్వే స్టేషన్కు వచ్చారు. స్టేషన్లో ప్రయాణికుల వసతులను పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా అప్రమత్తతతో పని చేయాలని సిబ్బందికి సూచించారు.