జూన్‌ 3న ఇంటర్‌ పరీక్షలు

Postponed Telangana Intermediate Exams To Be Conducted On June 3 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో వాయిదా పడిన ఇంటర్మీడియెట్‌ పరీక్షలను నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు జూన్‌ 3వ తేదీన ఇంటర్‌ ద్వితీయ సంవత్సర జియాగ్రఫీ పేపర్‌–2, మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2 పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, పాత పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు పాత హాల్‌ టికెట్లతోనే హాజరు కావచ్చని వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top