మహిళపై కత్తితో పదేపదే దాడి | Land Disputes Man Attacks On Couple Brutally In Wanaparthy District | Sakshi
Sakshi News home page

భూవివాదం: మహిళపై అతి కిరాతక దాడి

Jul 8 2020 12:28 PM | Updated on Jul 8 2020 4:02 PM

Land Disputes Man Attacks On Couple Brutally In Wanaparthy District - Sakshi

సాక్షి, వనపర్తి: రెండు కుటుంబాల మధ్య మూడేళ్లుగా నలుగుతున్న భూవివాదం మారణాయుధాలతో దాడులు చేసుకునేవరకు వెళ్లింది. ఈ ఘటన జిల్లాలోని గోపాల్‌పేట మండలం బుద్దారంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అర్జున్‌రావు అనే వ్యక్తి అనంతరావు, రత్నమ్మ దంపతులపై కత్తితో అతి దారుణంగా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని హైదరాబాద్‌కు‌ తరలించారు. రత్నమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అనంతరావు దంపతులపై అర్జున్‌రావు దాడి చేస్తున్న సమయంలో చుట్టూ పదుల సంఖ్యలో జనం ఉన్నా ఎవరూ అడ్డుకోకపోవడం శోచనీయం. ఇక అర్జున్‌రావు రత్నమ్మపై కత్తితో దాడి చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(పోలీసుల‌మంటూ ప్రేమ‌జంట‌పై దౌర్జ‌న్యం)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement