రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోమ్‌ 

At Home Program In The Presidential Palace Hyderabad - Sakshi

హాజరైన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ 

రాష్ట్రపతితో మర్యాదపూర్వకంగా భేటీ  

సాక్షి, హైదరాబాద్‌: శీతాకాల విడిది కో సం ఈ నెల 20న హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌హోం’కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గవర్నర్‌ తమిళిసై, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. ఎట్‌హోం కార్యక్రమానికి వచ్చిన అతిథులకు రాష్ట్రపతి కోవింద్‌ దంపతులు అభివాదం చేసి పేరు పేరునా పలకరించారు. 

అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను సీఎం కేసీఆర్‌ రాష్ట్రపతి కోవింద్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారంతా రాష్ట్రపతి దంపతులతో గ్రూప్‌ ఫొటో దిగారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top