ఇకనైనా వర్షాలు కురవాలి | Former minister Dr. Geetha Reddy wishes to come rain | Sakshi
Sakshi News home page

ఇకనైనా వర్షాలు కురవాలి

Jul 24 2015 4:17 AM | Updated on Oct 22 2018 9:16 PM

ఇకనైనా వర్షాలు కురవాలి - Sakshi

ఇకనైనా వర్షాలు కురవాలి

గోదావరి పుష్కరాలు ముగిశాక అయినా వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మతల్లిని వేడుకున్నానని

♦ {పజలు సుఖంగా ఉండాలని గంగమ్మ తల్లిని వేడుకున్నా..
♦ మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి
 
 మోర్తాడ్ : గోదావరి పుష్కరాలు ముగిశాక అయినా  వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మతల్లిని వేడుకున్నానని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. మండలంలోని తడపాకల్‌కు గురువారం పుష్కర స్నానానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలతోనైనా వాతావరణ పరిస్థితులు మారాలని ఆకాంక్షించారు. పుష్కరాల ఏర్పాట్లు బాగున్నాయని, స్థానికుల సహకారంతో సజావుగా సాగుతున్నాయని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారన్నారు.ఆమె వెంట నాయకులు శ్రీనివాస్, సుమన్, సతీష్ ఉన్నారు.

 సోనియూ ఆశించినట్టుగానే అభివృద్ధి...
 సోనియా గాంధీ ఆశించినట్లుగానే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని కల్వకుర్తి ఎమ్మెల్యే, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన గుమ్మిర్యాల్‌లో పుష్కర స్నానం చేశాక మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement