కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. భూమి తగాదాల్లో తమ్మునిపై అన్న దాడిచేయడంతో తమ్ముడు మృతిచెందాడు.
కమలాపురం: కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. భూమి తగాదాల్లో తమ్మునిపై అన్న దాడిచేయడంతో తమ్ముడు మృతిచెందిన ఘటన కమలాపురం మండలం వంగపల్లి గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన సన్నపు భద్రయ్య, సన్నపు రవి(35) అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. సోమవారం ఉదయం రవిపై భద్రయ్య దాడిచేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే రవిని వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రవి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.