దాసోజు శ్రవణ్‌కు టికెట్‌.. విష్ణుకు మరో చాన్స్‌! | Congress Announces Second List For Telangana Elections | Sakshi
Sakshi News home page

పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ రెండో జాబితా

Nov 14 2018 11:41 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Announces Second List For Telangana Elections - Sakshi

కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పది మంది అభ్యర్థులతో  కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రెండో జాబితాను విడుదల చేసింది. విస్తృత సంప్రదింపుల అనంతరం ఎట్టకేలకు మలి జాబితా విడుదలైంది. ఖానాపూర్‌ (ఎస్టీ)లో ఊహించినట్టుగానే రమేష్‌ రాధోడ్‌కు అవకాశం కల్పించారు. ఖైరతాబాద్‌లో బీసీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌వైపు అధిష్టానం మొగ్గుచూపింది. ఇక, ఎల్లారెడ్డి నుంచి జాజల సురేందర్‌కు చోటుదక్కింది. ధర్మపురి (ఎస్టీ) టికెట్‌ను అదూరి లక్ష్మణ్‌ కుమార్‌కు కేటాయించారు.

కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన రెండో జాబితా ఇది

ఖానాపూర్‌ (ఎస్టీ)      రమేష్‌ రాథోడ్‌
ఎల్లారెడ్డి                జాజల సురేందర్‌
ధర్మపురి (ఎస్సీ)     అదూరి లక్ష్మణ్‌ కుమార్‌
సిరిసిల్ల               కేకే మహేందర్‌ రెడ్డి
మేడ్చల్‌              కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
ఖైరతాబాద్‌          దాసోజు శ్రవణ్‌
జూబ్లీహిల్స్‌          పి విష్ణువర్ధన్‌ రెడ్డి
షాద్‌నగర్‌           సీ ప్రతాప్‌రెడ్డి
భూపాలపల్లి       గండ్ర వెంకట రమణారెడ్డి
పాలేరు             కాందాల ఉపేందర్‌రెడ్డి

సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే రెండో జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్‌ పార్టీ సహజంగానే పెద్ద పీట వేసింది. రెండో జాబితాలో రెడ్లకు 6 టికెట్లు కేటాయించగా.. బీసీలకు రెండు టికెట్లు, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో టికెట్ చొప్పున కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement