సహాయక చర్యలు ముమ్మరం చేయండి | Concern in the student's parents | Sakshi
Sakshi News home page

సహాయక చర్యలు ముమ్మరం చేయండి

Jun 10 2014 12:01 AM | Updated on Mar 28 2018 11:05 AM

సహాయక చర్యలు ముమ్మరం చేయండి - Sakshi

సహాయక చర్యలు ముమ్మరం చేయండి

బియాస్ నదీ ప్రవాహంలో విద్యార్థుల గల్లంతు ఘటనపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి దిగ్భ్రాంతి చెందారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: బియాస్ నదీ ప్రవాహంలో విద్యార్థుల గల్లంతు ఘటనపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి దిగ్భ్రాంతి చెందారు. ఈ అంశంపై కలెక్టర్ బి.శ్రీధర్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. గల్లంతైన విద్యార్థుల గురించి ఆరా తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులను వ్యక్తిగతంగా కలిసి మనోధైర్యం చెప్పాలన్నారు. ఆయా మండల తహసీల్దార్లు ప్రత్యేకంగా ఒక వీఆర్వోను ఏర్పాటుచేసి బాధిత కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి తీసుకునే చర్యలకు అనుగుణంగా తక్షణమే స్పందించాలన్నారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement