breaking news
Minister of State for Transport
-
డిసెంబర్ నాటికి మెట్రో సొరంగ మార్గం పూర్తి
రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి వెల్లడి సాక్షి, బెంగళూరు : కబ్బన్ పార్క్ నుంచి మహాత్మాగాంధీ రోడ్ (ఎం.జీ రోడ్) వరకు నిర్మిస్తున్న మెట్రో సొరంగ మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ నాటికి మెట్రో సొరంగ మార్గం నిర్మాణం పూర్తవుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. శనివారమిక్కడ మెట్రో రైలు అధికారులతో కలిసి సొరంగ మార్గం నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెట్రో సొరంగ మార్గం నిర్మాణంలో ఇప్పటికే 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ట్రాక్ వేసే కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తికానున్నాయని, ఏప్రిల్ లేదా మే నెలలో సొరంగ మార్గంలో మెట్రో రైల్ ట్రయల్ రన్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంజీ రోడ్ నుంచి బయ్యప్పన హళ్లి, మల్లేశ్వరం నుంచి పీణ్యా మెట్రో రైలు మార్గాలు అందుబాటులోకి రావడంతో వేలాది మంది నగరవాసులకు ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఇక రెండో విడతలోని మెట్రో రైలు నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. భూ స్వాధీన ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్బేగ్, ఎమ్మెల్యే హ్యారిస్ తదితరులు పాల్గొన్నారు. -
సహాయక చర్యలు ముమ్మరం చేయండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: బియాస్ నదీ ప్రవాహంలో విద్యార్థుల గల్లంతు ఘటనపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి దిగ్భ్రాంతి చెందారు. ఈ అంశంపై కలెక్టర్ బి.శ్రీధర్తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. గల్లంతైన విద్యార్థుల గురించి ఆరా తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులను వ్యక్తిగతంగా కలిసి మనోధైర్యం చెప్పాలన్నారు. ఆయా మండల తహసీల్దార్లు ప్రత్యేకంగా ఒక వీఆర్వోను ఏర్పాటుచేసి బాధిత కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి తీసుకునే చర్యలకు అనుగుణంగా తక్షణమే స్పందించాలన్నారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.