కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం

CM Meeting With District Collectors In Pragati Bhavan Hyderabad - Sakshi

సాక్షి, నల్గొండ: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్‌జీవన్‌ పాటిల్, అనితారామచంద్రన్, వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు వనమాల చంద్రశేఖర్, రాహుల్‌శర్మ, జి.రమేష్, సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతి, హరితహారం, అక్షరాస్యతతోపాటు వివిధ సంక్షేమ పథకాల అమలు, కలెక్టర్ల బాధ్యతలపై దిశా నిర్దేశం చేశారు. అడవుల పెంపకంపై సలహాలు ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top