స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి.. | three school girls missing at rangareddy district | Sakshi
Sakshi News home page

స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి..

Nov 28 2016 8:25 AM | Updated on Sep 15 2018 5:14 PM

స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి.. - Sakshi

స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి..

స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి ఆదివారం పాఠశాలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు

హైదరాబాద్: స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి ఆదివారం పాఠశాలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఉదయం స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు రాత్రైనా తిరిగి రాకపోవడంతో.. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 

వివరాలు.. రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కేశబాగుల శ్రీలత(14), ఎం. శ్రావణి(15), ఎస్. సంధ్యారాణి(15) ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పాఠశాలలో ప్రత్యేక తరగతులు ఉన్నాయని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరారు. రాత్రైనా తిరిగి రాకపోవడంతో.. వీరి తల్లిదండ్రులు మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినులు మీర్‌పేట పరిధిలోని హనుమాన్‌నగర్, డీఎన్‌ఆర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీలకు చెందిన వారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement