వ్యభిచారం కేసులో మంత్రి పీఎస్ అరెస్ట్ | Sakshi
Sakshi News home page

వ్యభిచారం కేసులో మంత్రి పీఎస్ అరెస్ట్

Published Sun, Oct 9 2016 5:15 PM

వ్యభిచారం కేసులో మంత్రి పీఎస్ అరెస్ట్ - Sakshi

బెంగళూరు (బనశంకరి) : వేశ్యా కేంద్రంపై శనివారం సీసీబీ పోలీసులు దాడి చేసి తమిళనాడుకు చెందిన మంత్రి వ్యక్తిగత కార్యదర్శితో పాటు 11 మందిని అరెస్ట్ చేశారు. వివరాలు... బాణసవాడి సమీపంలోని ఓ లాడ్జీలో వేశ్య కేంద్రం నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న సీసీబీ పోలీసులు దాడి చేసి తమిళనాడు రాష్ట్ర పశు సంవర్ధక శాఖమంత్రి బాలకృష్ణారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సత్యనారాయణతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఐదుగురు యువతులను పోలీసులు కాపాడారు. బానసవాడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement