
నేడు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వియత్నాం, చైనా దేశాల పర్యటనకు బయలుదేరనున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వియత్నాం, చైనా దేశాల పర్యటనకు బయలుదేరనున్నారు. శుక్రవారం వియత్నాంలో పర్యటించనున్న మోదీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. రక్షణ, వాణిజ్య, చమురు వెలికితీత వంటి అంశాల్లో వియత్నాంతో కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం సెప్టెంబర్ 3, 4 తేదీల్లో చైనాలోని హాంగ్జూలో జరిగే జీ-20 సదస్సులో మోదీ పాల్గొంటారు.
ఈ సదస్సులో ఉగ్రవాదానికి ఆర్థికసాయం చేస్తున్న సంస్థలు, దేశాలు.. పన్ను ఎగవేత వంటి అంశాలపై మోదీ మాట్లాడనున్నారు. అనంతరం 5న భారత్ తిరిగొచ్చి.. ఆ వెంటనే లావోస్లో రెండ్రోజుల పాటు జరిగే.. భారత-ఆసియాన్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరతారు.