నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగుతోంది.
మూసీకి భారీగా వరద
Sep 17 2016 12:04 PM | Updated on Sep 4 2017 1:53 PM
కేతెపల్లి: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగుతోంది. దీంతో నల్లగొండ జిల్లా కేతెపల్లి వద్ద మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ నాలుగు గేట్లు రెండు అడుగుల మేరకు ఎత్తి 4,500 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత మూసి నిండటంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement