11 నెమళ్లకు విషం పెట్టిన రైతు అరెస్టు

Eliminate By Poisoning 11 Peacocks In Tamil Nadu - Sakshi

సాక్షి, తమిళనాడు : తిరుపూర్‌ జిల్లా తారాపురం సమీపంలో 11 నెమళ్లకు విషం పెట్టి చంపిన రైతును పోలీసులు అరెస్టు చేశారు.  తిరపూర్జిల్లా తారాపురం సమీపం చిన్న పుత్తూర్‌ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో రైతులు తమ వ్యవసాయ పొలంలో కాయకూరలు, పండ్లు సాగు చేస్తున్నారు. వీటిని ఆ ప్రాంతంలోని నెమళ్లు తరచూ ధ్వంసం చేస్తున్నాయి. దీనిపై పలువురు రైతులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ పొలంలో 11 నెమళ్లు మృతి చెంది పడి ఉండడాన్ని స్థానిక రైతులు గుర్తించి వ్యవసాయ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు వ్యవసాయ అధికారి తిరుమూర్తి, అటవీశాఖ ఉద్యోగి మణివన్నన్‌ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన రైతు ముత్తుస్వామి కుమారుడు శ్యామ్లయ్యాన్‌ విషం పెట్టి ఆ నెమళ్లను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన పంటను నెమళ్లు నాశనం చేయడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top