
సంచలన ఫలితాలతోనే క్రికెట్కు భవిష్యత్తు
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను ఇటీవల జింబాబ్వే జట్టు అనూహ్య ప్రదర్శనతో గెలిచిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను ఇటీవల జింబాబ్వే జట్టు అనూహ్య ప్రదర్శనతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సంచలన ఫలితాలతో ప్రపంచ క్రికెట్ మరింత పటిష్టమవుతుందని స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
‘లంకపై జింబాబ్వే విజయంతో ఓ విషయం రుజువయ్యింది. క్రికెట్లో ఎలాంటి జట్టయినా ఓడొచ్చు.. ఎవరైనా గెలవచ్చు. రేపు అఫ్ఘానిస్తాన్ కూడా ఏదో ఓ జట్టును ఓడిస్తుంది. ఇలాంటి ఫలితాలే క్రికెట్కు కావాలి. అలా అయితేనే క్రికెట్ భవిష్యత్ మరింత బావుంటుంది’ అని అశ్విన్ అన్నాడు.