న్యూఢిల్లీ: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో... పనిభారం, భవిష్యత్తులో కీలక సిరీస్లను దృష్టిలో పెట్టుకొని అతడికి ఇంకొన్నాళ్లు విశ్రాంతి అవసరమని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ) వైద్యబృందం భావిస్తోంది. బుమ్రా స్థానంలో సెలక్టర్లు దేశవాళీల్లో రాణిస్తున్న జమ్మూకశ్మీర్ పేసర్ అఖీబ్ నబీని ఎంపిక చేయనున్నారు.


