source: X
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆఫ్ఘన్ జట్టు రెండు మార్పులు చేయగా.. భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది.
ఆఫ్ఘన్ తరఫున గుల్బదిన్ నైబ్, నూర్ అహ్మద్ స్థానాల్లో అబ్దుల్లా అహ్మద్జాయ్, నూర్ ఉల్ రహ్మాన్ బరిలోకి దిగనుండగా.. భారత్ తరఫున అర్షదీప్ స్థానంలో యశ్ ఠాకూర్ బరిలోకి దిగుతున్నాడు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు గెలిచిన భారత్ ఇదివరకే సిరీస్ కైవసం చేసుకుంది.
తుది జట్లు..
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): ఇబ్రహీం జద్రాన్ (సి), రహమానుల్లా గుర్బాజ్ (డబ్ల్యు), సెడిఖుల్లా అటల్, అబ్దుల్లా అహ్మద్జాయ్, దర్విష్ రసూలీ, నూర్ ఉల్ రెహమాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబుల్ ఉర్ రహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, అబ్దుల్లా అహ్మద్జాయ్
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా
ఇదీ చదవండి: ఆసీస్ వరల్డ్కప్ విన్నర్ షాకింగ్ నిర్ణయం


