త్రయంపై నిషేధం కొనసాగుతుంది బీసీసీఐ స్పష్టీకరణ | Why there's nothing wrong with the BCCI upholding life ban on Sreesanth and co | Sakshi
Sakshi News home page

త్రయంపై నిషేధం కొనసాగుతుంది బీసీసీఐ స్పష్టీకరణ

Jul 30 2015 12:58 AM | Updated on Sep 3 2017 6:24 AM

స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి నిర్దోషులుగా బయటపడిన పేసర్ శ్రీశాంత్, స్పిన్నర్ అంకిత్ చవాన్, చండిలాలపై జీవితకాల నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి నిర్దోషులుగా బయటపడిన పేసర్ శ్రీశాంత్, స్పిన్నర్ అంకిత్ చవాన్, చండిలాలపై జీవితకాల నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది.
 
 ఇందులో రెండో ఆలోచన లేదని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ‘బీసీసీఐ క్రమ శిక్షణ కమిటీ విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన లేదు. క్రమశిక్షణ, క్రిమినల్ చర్యలు.. రెండు వేర్వేరుగా ఉంటాయి. గతంలో క్రికెటర్లు క్రమశిక్షణ ఉల్లంఘించారని అవినీతి నిరోధక యూనిట్ కూడా నివేదికను ఇచ్చింది. కాబట్టి కమిటీ తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది’ అని ఠాకూర్ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement